పార్వతి దేవి శాపానికి గురై 700 ఏళ్ల క్రిందట వెలసిన అద్భుత ఆలయం గురించి తెలుసా ?

శ్రీ లక్ష్మి అమ్మవారిని సంతానం తో పాటు సకల సంపదలను ఇచ్చే తల్లిగా కొలుస్తారు. అయితే ఇక్కడ వెలసిన అమ్మవారు ఎవరు? ఆ అమ్మవారికి కలిగిన శాపం ఏంటి?  ఈ ప్రాంతంలో ఆ అమ్మవారు ఎందుకు జన్మించింది? ఈ ఆలయం ఎక్కడ వెలసింది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారిఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, గుంటూరు జిల్లా, దుర్గి మండలం, అడిగొప్పుల గ్రామంలో నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయం ఉన్నది. పేరులో శ్రీ లక్ష్మి అని ఉన్నా,  ఈమెను పార్వతి దేవి అంశగా భావిస్తారు. ఇక ఆలయ పురాణం విషయానికి వస్తే, పూర్వము కైలాసంలో పార్వతీపరమేశ్వరులు కూర్చొని ఉండగా ప్రమథ గణాలు నాట్యం చేస్తున్నాయి. అప్పుడు నందీశ్వరుణ్ణి చూసి పార్వతిదేవి హేళనగా నవ్విందట. అప్పుడు జగన్మాత, నా కుమారుణ్ణి చూసి ఎందుకు నవ్వావు? అని మహర్షి శిలాదుడు ఆమెను ప్రశ్నించగా, అతడి నాట్యంలో తాళము, భావము ఏమి లేవు అని నవ్వుతూ పార్వతి దేవి చెప్పిందట. అప్పుడు శిలాదుడికి కోపం వచ్చి , కలియుగంలో నీవు భూలోకంలో జన్మించి, అవివాహితవైనా నీవు చిన్నతనంలోనే గర్భందాల్చి అవమానాలను ఎదుర్కొనగలవు అని శపించాడు.

నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారిఅప్పుడు పార్వతి దేవి శాపవియోగం మార్గం ఏంటి అని అడుగగా, నీతో పాటు కామధేనువు గోమాతగా అవతరిస్తుంది. నీవు రోజు దాన్ని పూజిస్తావు. ఆ తరువాత నీవు ఒక విచిత్ర గర్భం దరిస్తావు. నా నాట్యంలో నంది అసంపూర్ణుడు అన్నావు కాబట్టి, నీ గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా ఉంటాడు. పెళ్లి కాకుండానే గర్భవతి అయినా నిన్ను మీ వాళ్ళు నిన్ను అగ్నికి ఆహుతి చేస్తారు. ఆవిధంగా నువ్వు మానవరూపాన్ని వదిలి నిదానంపాటి అమ్మవారుగా భక్తుల కోర్కెలు తిరిస్తూ వారిచే పూజలు అందుకుంటావు అని చెప్పాడు.

నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారిఆవిధంగా శాపానికి గురైన పార్వతి దేవి సుమారు 700 ఏళ్ల క్రిందట గుంటూరుజిల్లా, పల్నాడు ప్రాంతంలోని యాగంటిరామయ్య ఇంట్లో జన్మించిందని చెబుతారు. నలుగురు కుమారులు తరువాత పుట్టిన ఆమెకు శ్రీ లక్ష్మి అని పేరు పెట్టారు. రామయ్యకి పశుసంపదలో కామధేనువు అనే గోవు ఉండేది. శ్రీలక్ష్మి ప్రతి రోజు గోశాలకి వెళ్లి గోవు చుట్టూ ప్రదిక్షణలు చేసి గోపం చింతాన్ని తాగుతూ ఉండేది. ఒక రోజు ఆ కామధేనువుతో ఒక ఆబోతు క్రీడించింది. ఆ విషయం తెలియని శ్రీ లక్ష్మి రోజులాగే వెళ్లి గోమాతను పూజించి గోపంచింతాన్ని తాగింది. అప్పుడు ఆమె కొన్నాళ్లకు గర్భవతి అయింది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆమెని వారి ఇంటివారిని చాల అవమానించారు. దానితో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మిని పొలానికి పిలిపించి ఆమెకి నిప్పు పెట్టారు. అప్పుడు ఆ అగ్నిలోకి గోశాలలో ఉన్నా కామధేనువు కూడా వచ్చి అగ్నిలోకి దూకి ఆహుతి అయ్యింది. అలా మంటలకు ఆహుతి అయినా శ్రీ లక్ష్మి శిలగా మారిపోయింది.

నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారితరువాత ఆమె ఒక 11 ఏళ్ల బాలికను పూని ఆదివారం నన్ను అగ్నికి ఆహుతి చేసారు కనుక ప్రతి ఆదివారం పసుపు, కుంకుమలతో నాకు పూజలు చేయాలి, నన్ను దర్శించుకునే వాళ్ళు అందరు కూడా ఎండలోనే నిలబడాలి, నాకు ఆలయాన్ని నిర్మించవద్దు అని చెప్పిందంటా. అందుకే  అమ్మవారు వెలసిన ప్రదేశం చుట్టూ 10 అడుగుల మేర స్థలాన్ని విడిచి పెట్టి మందిరాన్ని నిర్మించారు. అమ్మవారి దీక్ష చేసే భక్తులు 40 రోజుల దీక్ష పూర్తయ్యాక ఇరుముడులు కట్టుకొని కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.  ఈవిధంగా శాపానికి గురైన పార్వతిదేవి శ్రీ లక్ష్మి అమ్మవారిగా వెలసి భక్తులకి దర్శనం ఇస్తున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR