కురుక్షేత్రయుద్ధంలో అర్జునుడి రథం జండాపైన హనుమంతుడు ఎందుకు ఉంటాడో తెలుసా?

0
18445

కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని నడపగా, రథం మీద ఉన్న జెండాలో హనుమంతుడి రూపం ఉంటుంది. అయితే రాముడి పరమ భక్తుడు అయినా హనుమంతుడు అర్జునుడి రథం మీద ఉండటానికి కారణం ఏంటి? మహాభారతం ప్రకారం హనుమంతుడు, అర్జునుడు అసలు ఏవిధంగా కలిశారు అనే అప్పటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

hanumanthuduపూర్వము, అర్జునుడు దేశమంతా తిరుగుతూ అక్కడ ప్రదేశాలను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ వస్తూ రామేశ్వరాన్ని చేరుకున్నాడు. అయితే అక్కడ సాక్షాత్తూ ఆ రాములవారు ప్రతిష్టించిన శివలింగాన్ని పూజించాడు. ఆ తరువాత సముద్రతీరాన తిరుగుతూ అక్కడి రామసేతువుని గమనించాడు. ఆ సమయంలో నలుడనే వానరుని ఆధ్వర్యంలో నిర్మించిన ఆ వంతెనని చూడగానే అర్జునుడికి ఓ ధర్మసందేహం వచ్చింది. రాముడు మహా శక్తిసంపన్నుడు కదా గొప్ప విలుకాడు అలాంటి రాముడు కోతుల సాయంతో సేతువుని నిర్మించడం ఏమిటి? తనే స్వయంగా బాణాలతో ఓ దృఢమైన వంతెనని నిర్మించవచ్చు కదా అని సందేహం వచ్చింది.

hanumanthuduఅర్జునుడి మనసులో ఇలా సందేహం మెదిలిందో లేదో అక్కడ రాముని ధ్యానంలో ఉన్న హనుమంతులవారికి విషయం చేరిపోయింది. వెంటనే ఒక సాధారణ వానరుడిలాగా అర్జునుడి దగ్గరకు చేరుకుని మీరు ఏదో సమస్యతో మధనపడుతున్నట్లు ఉన్నారు. ఏమిటీ విషయం? అని అడిగాడు. దానికి అర్జునుడు తన మనసులోని సందేహాన్ని ఆ వానరం ముందర నిలిపాడు. రాములవారు బాణాలతో సేతువుని నిర్మించలేకేమీ కాదు కాకపోతే కోట్లకొలదీ వానరులు ఆ వంతెన మీదుగా ప్రయాణించాలంటే, రాళ్లతో నిర్మించే సేతువే సురక్షితం. అందుకనే వానరులతో వంతెనని నిర్మింపచేశారు, అని బదులిచ్చాడు హనుమంతుడు.

hanumanthuduవానరరూపంలోని హనుమంతుడు చెప్పిన జవాబు, అర్జునుడికి సంతృప్తిగా తోచలేదు. ఏదైనా సరే, రాములవారు బాణాలతోనే వారధిని నిర్మించి ఉండాల్సింది అంటూ వాదనకు దిగాడు. క్రమేపీ మాటా మాటా పెరిగింది. ధర్మ సందేహం కాస్తా గొడవకు దారితీసింది. చివరికి హనుమంతునికి కోపం వచ్చి సరే రాములవారి సంగతి అలా ఉంచు. నువ్వు గొప్ప విలుకాడివని నీ నమ్మకం కదా సాక్షాత్తూ ఆ రాములవారినే అనుమానిస్తున్నావు కదా, మరి బాణాలతో నువ్వో వంతెనని కట్టిచూడు. ఆ వంతెన మీద నేను నడుస్తాను. నా బరువుకి తట్టుకుని ఆ వంతెన నిలిస్తే సరే. లేకపోతే నీ ఓటమిని ఒప్పుకుంటావా? అని అడిగాడు. హనుమంతుని సవాలుతో అర్జునుడికి పట్టుదల చెలరేగింది. నీ ధాటికి నేను నిర్మించే వంతెన కనుక కూలిపోతే, ఓటమిని అంగీకరించడమే కాదు ఇక్కడికిక్కడే అగ్నిగుండంలో ప్రాణత్యాగం చేస్తాను, అని శపథం చేశాడు.

hanumanthuduఅర్జునుడు తన విలువిద్యనంతా ప్రదర్శించి అద్భుతమైన ఓ శరవంతెనను నిర్మించాడు. కానీ ఏం లాభం రామనామం చేస్తూ హనుమంతుడు దాని మీద ఒక్క అడుగు వేశాడో లేదో వంతెన కాస్తా తునాతునకలు అయిపోయింది. ఆ ధాటికి విస్తుపోవడం అర్జునుడి వంతయ్యింది. దాంతో తన ఓటమిని ఒప్పుకోవడంతో పాటుగా అగ్నిగుండంలోకి దూకి ప్రాణాలను త్యాగం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు.

hanumanthuduఇంతలో ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వారిని సమీపించాడు. అగ్నిప్రవేశం చేయబోతున్న అర్జునుడిని చూసి ఏం జరుగుతోంది అంటూ ప్రశ్నించాడు. ఆ బ్రహ్మణుడి ముఖవర్చస్సు చూసి హనుమంతుడు, అర్జునుడు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆపై జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించారు.

6 Hanumanth Flagమీరు ఇద్దరు ఉన్నపుడే ఎలాంటి సాక్షి లేకుండా చేస్తారు అందుకని మీరు మరోసారి మీ పోటీ సాగించండి. ఈసారి నేను సాక్షిగా వ్యవహరిస్తాను. ఎలాంటి పక్షపాతానికీ ఆస్కారం లేకుండా చూస్తాను, అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుని మాటలు కూడా సబబుగానే తోచడంతో వెంటనే మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. ఈసారి అర్జునుడు తన గురువు, ఆప్తబంధువుని తల్చుకుని వారధిని నిర్మించాడు. అలా నిర్మించిన వారధిని స్పృశించి ఆ బ్రాహ్మణుడు కూడా తన ఆశీస్సులని అందించాడు. ఇదంతా చిరునవ్వుతో గమనిస్తున్న హనుమంతుడు ఆ వారధిని కూలగొట్టేందుకు దాని మీదకు ఎక్కాడు.

7 Hanumanth Flagఈసారి వారధి హనుమంతుని బరువుని తట్టుకుని నిలబడింది. అతను ఎన్ని చేసిన అది కించిత్తయినా కదలనే లేదు. అది చూసి హనుమంతునికీ, అర్జునుడికీ కూడా ఏదో అద్భుతం తోడయ్యిందన్న విషయం అర్థమైంది. తమ ముందున్న బ్రాహ్మణుడు సామాన్యుడు కాడనీ సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణపరమాత్ముడనీ బోధపడింది. అహంకారానికి లోనై, తాము పనికిరాని పంతాన్ని పట్టామని ఇద్దరికీ అర్థమైంది. వారికి ఆ జ్ఞానోదయం కలిగిన వెంటనే శ్రీకృష్ణుడు తన నిజరూపంలో వారి ముందు సాక్షాత్కరించాడు. రాముని అవతారంలో తనని సేవించిన హనుమంతునీ, కృష్ణుని అవతారంలో తోడుగా నిలిచిన అర్జునుడినీ కలిపాడు.

8 Hanumanth Flagఈ విధంగా ఇద్దరు శ్రీకృష్ణుడి సమక్షంలో స్నేహితులు అవ్వడమే కాకుండా వారి స్నేహానికి చిహ్నంగా అర్జునుడు అయన రథం జెండా పైన హనుమంతుడు ఉంటాడని ఒక కథ ద్వారా తెలుస్తుంది.

9 Hanumanth Flag