సీత రాములు పూజించిన శివలింగం ఎలా వెలిసిందో తెలుసా ?

లంకలో రావణ సంహారం జరిగిన తరువాత శ్రీరాముడు తనవారితో అయోధ్య బయలుదేరుతాడు. ఆ ప్రయాణంలోని మార్గమధ్యంలో ఒక మహా అరణ్య ప్రాంతంలో ఒక పర్వత శిఖరం వుండేది. శ్రీరాముడు తన అనుచరులతో కలిసి ఆ అరణ్య ప్రాంతానికి చేరుకోగానే కొద్దిసేపు అక్కడే సేద తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అనుచరులలో ఒక్కరైనా సుశేణుడు అనే ఒక దైవవైద్యుడు ఆ పర్వత ప్రాంతంలోనే వున్న ఔషధ మౌళిక వృక్షాలను చూసి చాలా సంతోషిస్తాడు.

సీత రాములు పూజించిన శివలింగంకైలాసానికి చేరుకోవాలనే తన పూర్వ వాంఛను తీర్చుకునేందుకు కూడా ఈ ప్రాంతమే అనువైన ప్రదేశంగా అతను భావిస్తాడు. దాంతో సుశేణుడు తన మనసులో వున్న నిర్ణయాన్ని శ్రీరాముడికి చెబుతాడు. శ్రీరాముడు అతని అనుచరుడిలో వున్న మంచి గుణాలకు మెచ్చుకుని అతని కోరిక మేరకు అతని కైలాస వాంఛ తీరాలని ఆశీర్వదించి అతనిని అక్కడే వదిలేసి తన అనుచరులతో కలిసి అయోధ్యవైపు బయలుదేరుతాడు.

సీత రాములు పూజించిన శివలింగంశ్రీరాముడు వెళ్లిపోయిన తరువాత సుశేణుడు ఆ సుమంత పర్వతంపై పరమశివుని కోసం ఘోరతపస్సు చేయడం ప్రారంభించాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత శ్రీరాముడు, సుశేణుడి బాగోగులు తెలుసుకుని రావాల్సిందిగా హనుమంతుడిని అతనున్న పర్వతప్రాంతాలకు పంపిస్తాడు. శ్రీరాముని ఆజ్ఞమేరకు హనుమంతుడు ఆ పర్వత ప్రాంతానికి వెళ్లి సుశేణుడు గురించి వెతకడం మొదలుపెడతాడు. ఎంత గాలించినా హనుమంతునికి సుశేణుడు కనిపించలేదు. కానీ అతని కళేబరం మాత్రం కనిపిస్తుంది.

సీత రాములు పూజించిన శివలింగంఅప్పుడు హనుమంతుడు తన మనసులో ‘‘సుశేణుడు తపం ఆచరిస్తూ.. శివసాయుజ్యం పొందినట్లున్నాడు’’ అనుకుంటాడు. వెంటనే అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వుతాడు. సుశేణుని కళేబరాన్ని ఆ గొయ్యిలో పూడ్చేసి.. ఆ గొయ్యికి గుర్తుగా అక్కడే వున్న మల్లెపూలను, దానిపై జింక చర్మాన్ని కప్పేస్తాడు. అనంతరం ఈ విషయాన్ని శ్రీరాముడికి చెప్పాలని హనుమంతుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు.

సీత రాములు పూజించిన శివలింగంహనుమంతుడు, శ్రీరాముడికి మొత్తం విషయం చెప్పగా… శ్రీరామువు వెంటనే సీత, లక్ష్మణ, హనుమంతునితో కలిసి సుమంత పర్వతానికి బయలుదేరుతాడు. అక్కడికి చేరుకున్న వెంటనే హనుమంతుడు, శ్రీరాముడికి సుశేణుడి కళేబరాన్ని చూపించడానికి జింక చర్మాన్ని పైకి లేపుతాడు. అయితే అక్కడ సుశేణుడి కళేబరానికి బదులు శివలింగం కనిపించింది. అప్పుడు శ్రీరాముడు, సీతాలక్ష్మణులతో కలిసి పక్కనే వున్న కొలనులో స్నానం ఆచరిస్తాడు. ఆ శివలింగానికి పూజా కార్యక్రమాలను మొదలుపెడతాడు.

సీత రాములు పూజించిన శివలింగంశివలింగాన్ని పూజించడం ప్రారంభించగానే ఆ లింగం క్రమక్రమంగా పెరిగి పెద్దదవడం మొదలయ్యింది. దాంతో ఆ ప్రాంతంలో వున్న ఔషధ, మూలికలు తిరిగి పూసి, సువాసనలతో కూడిన గాలి ఆ శివలింగాన్ని తాకి, పవనాలుగా మారి.. వీచినంతమేర అనారోగ్యాలుగా వున్నవారు ఒక్కసారిగా తిరిగి ఆరోగ్యవంతులుగా మారిపోతారు. ఆ శక్తిని గమనించిన శ్రీరాముడు మొదట్లో ఆ లింగానికి దేవాలయం నిర్మించాలని నిర్ణయించుకున్నా.. ఆ లింగం పెరిగి పెద్దదవ్వడంతో తన నిర్ణయాన్ని విరమించుకున్నాడు.

సీత రాములు పూజించిన శివలింగంఅలా ఆ విధంగా ఈ శివలింగం పెరిగి పెద్దదవుతూ మహాశివలింగంగా ఏర్పడింది. శ్రీరాముని ద్వారా మల్లెపూలతో పూజించిబడి, జింక చర్మంతో కప్పబడి వున్నప్పుడు వెలసిన స్వామి కాబట్టి. మల్లికాజిన స్వామిగా పిలవడం జరిగింది. తరువాత క్రమక్రమంగా అది మల్లికార్జున స్వామిగా మార్చబడింది. ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో గల టెక్కలి మండలం రావివలసలో వుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR