మనం దేవాలయాలకు వెళ్లినపుడు దేవుడి దర్శనం తరువాత తీర్థ ప్రసాదాలు తీసుకుంటాం. చెక్కర పొంగలి, పులిహోర, దద్ధోజనం ఇలాంటి ప్రసాదాలు మనలో చాలా మంది ప్రసాదంగా తీసుకున్నాం. కానీ మాంసాహారం ఎప్పుడైనా దేవుడికి నైవేధ్యంగా పెట్టడం, భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం చూసారా? అయితే ఇప్పుడు ఆ అరుదైన ప్రసాదం గురించి తెలుసుకుందాం..
ప్రముఖ దేవాలయాలు అన్ని కూడా మాసాంహారంను నిషేదించిన నేపథ్యంలో ముఖ్యమైన పండుగలు మరియు ఇతర ముఖ్యమైన రోజుల్లో హిందువులు మాసాహారంను భుజించరు.
తమిళనాడు మధురై జిల్లాలోని తిరుమంగళం సమీపంలో వడుకంపట్టి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే ఉంటుంది మునీశ్వరుడి ఆలయం. ఆ ఆలయంలో మటన్ తో బిర్యానీ చేసి ప్రసాదంగా పెడతారు.
ఎక్కడ లేని విధంగా తమిళనాడులో ఇలాంటి వింత ఆచారం ఉండటంతో అంతా కూడా దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు.
మునీశ్వరుడి గుడిలో బిర్యానీ పెట్టడంకు స్థానికులు ఒక కథను చెబుతూ ఉంటారు. అందేంటి అంటే 85 ఏళ్ల క్రితం సుబ్బనాయుడు అనే వ్యక్తి మునీశ్వర పేరుతో హోటల్ను పెట్టాడట. ఆ హోటల్లో బిర్యానీ అమ్మేవాడు.
ఈ బిర్యానీ ప్రసాదంను కొందరు హిందువులు తప్పుబడుతున్నారు. అయితే కొందరు మాత్రం దేవుడు శాఖాహారమే తనకు కావాలని చెప్పలేదు కాబట్టి మాసాహారం అయిన ఆయనకు ప్రసాదంగా పెట్టవచ్చు అంటూ వాదిస్తున్నారు. ఏది ఏమైనా దాదాపు 85 ఏళ్లుగా మునీశ్వరుడికి, ఆయన భక్తులకు బిర్యానీ ప్రసాదం దొరుకుతుంది.