ఆది, అంతం ఈ సూత్రానికి సృష్టిలోని చిన్న ప్రాణినుంచి కాలాన్ని గణించే యుగాల వరకూ అన్ని అతీతులని హైందవ ధర్మాలు చెబుతున్నాయి. మొదలైన ప్రతి యుగం ఏదో ఒక సమయంలో అంతమొందక తప్పదు. అంతమైన ప్రతీసారి మరో నూతన యుగం మొదలవకాతప్పదు.
ఇదే సృష్టి ధర్మమని మన వేదాలు వివరిస్తున్నాయి. ఈ సృష్టిలో ఏ కార్యం జరగాలన్నా ఆ కార్యానికి ఒక కారణం కావాలి. అలాగే ఈ కలియుగం అంతమవడానికి కొన్ని ప్రత్యేక కారణాలను ఎప్పుడో ఆ విధాత ఏర్పరచిపెట్టినట్టు పురాణాలు పలుకుతున్నాయి. పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రకారం కలియుగం అంతం అవుతుందని వింటూ ఉంటాం. కలియుగాంతం గురించి కొన్ని సినిమాలు వచ్చాయి. కొన్ని కథలు, పురాణ గాధలు ఎన్నో ఉన్నాయి. ఈ యుగం అంతమైతే.. భూమ్మీద మనుషుల మనుగడ ఉండదని వివరిస్తుంది. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే అంతమయ్యాయని చెబుతూ ఉంటారు.
అయితే వీరభ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికే కొన్ని సంకేతాలు కలియుగాంతాన్ని సూచిస్తున్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు. కలియుగం అంతరించే సమయం దగ్గర్లోనే ఉందని.. జరుగుతున్న పరిణామాలే అందుకు కారణమని వివరిస్తున్నారు. అయితే కలియుగాంతాన్ని హెచ్చరించే ఆశ్చర్యకర సంకేతాలు.. కలియుగాంతంలో చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయని కొన్ని అధ్యయనాలు ఇలా వివరిస్తున్నాయి.. కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే! మనుషుల తీరులో చాలా మార్పులు కనిపిస్తాయి. మనుషులకు మతం, యదార్థం, సహనం, శుభ్రత, దయ, ఆయుష్షు, శారీరక శక్తి, జ్ఞాపకశక్తి వంటివన్నీ రోజురోజుకీ తగ్గిపోతాయి. ఇవన్నీ కలియుగాంతాన్ని సూచించే పరిణామాలే.
కలి యుగం ముగిసే సమయానికి అన్ని జీవులు పరిమాణంలో బాగా తగ్గిపోతాయి. మత సూత్రాలు నాశనమవుతాయి. మానవ సమాజంలో వేదాలు సూచించిన మార్గాన్ని మానవలోకం మరచిపోతుంది. మతం అని పిలవబడేది ఎక్కువగా నాస్తికంగా ఉంటుంది. పాలించేవారిలో ఎక్కువగా దొంగలై ఉంటారు. పురుషులు దొంగిలించడం, అబద్ధాలాడటం, అనవసరమైన హింసకు పాల్పడతారు. అన్ని సామాజిక తరగతులు తమతమ స్థాయిలు తగ్గిపోతాయి. ఆవులు మేకల మాదిరిగా ఉంటాయి. కుటుంబ సంబంధాలు వివాహం యొక్క తక్షణ బంధాల కంటే ఎక్కువ విస్తరించవు.
మొక్కలు, మూలికలు చిన్నవిగా అయిపోతాయి. అన్ని చెట్లు మరగుజ్జు చెట్లలా కనిపిస్తాయి. మేఘాలు మెరుపులతో నిండి ఉంటాయి. గృహాలు(ఇల్లు) భక్తి లేకుండా ఉంటాయి. మానవులందరూ మానవత్వాన్ని మరిచిపోతారు. స్త్రీ, పురుషులు వివాహం బంధంతో కాకుండా కలిసి బ్రతకడం ఎక్కువవుతుంది. జాలి, దయ, కరుణ అనేవి అంతరించిపోతాయి. ఆ సమయంలో భగవంతుని యొక్క స్వరూపం భూమిపై కనిపిస్తుంది. ధర్మ రక్షణార్థం కల్కి అవతారం అనివార్యమవుతుంది.