పితృకార్యాల్లో ఆహారం కాకులకే ఎందుకు పెడతారు?

పెద్దవారికి పితృకార్యాలు చేసేటప్పుడు కాకులను పిలిచి పిండాలు అర్పిస్తారు. పెట్టిన ఆహారాన్ని కాకులు తింటే పెద్దవాళ్ళ ఆత్మకు శాంతి జరిగింది అని అనాదిగా నమ్ముతారు. కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే వున్నాం. జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలున్నాయి. దీనిప్రకారం శని భగవానునికి కాకి వాహనంగా పరిగణిస్తారు.

పితృకార్యాలుసాధారణంగా ఏదైనా నోములు, వ్రతాలు ఆచరిస్తే.. నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో కాస్త దానం చేయడం ద్వారానో, కాకులకు పెట్టడం ద్వారా ఆ వ్రతం పరిపూర్ణమైందని భావించాలి.

పితృకార్యాలుకాకి అనేది శనిభగవానుని అనుగ్రహం పొందింది. అందుచేత కాకికి అన్నం పెడితే అది శనిభగవానునికే దానం చేసినట్లవుతుందని విశ్వాసం. ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకికి అన్నం పెట్టడం ఇప్పటికీ ఆనవాయితీగా వస్తుంది.

పితృకార్యాలుఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని, అందుకే వారు మరణించిన తిథులు, అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR