ఆశ్చర్యాన్ని కలిగించే ఈ ఆలయాల గురించి మీకు తెలుసా ?

ప్రపంచం మొత్తం మీద ఎన్నో అతి పురాతన ఆలయాలు, అద్భుత శిల్పకళానైపుణ్యం ఉన్న ఆలయాలు ఉన్నట్టే, ఇప్పటికి ఎవరికీ అర్ధం కానీ కొన్ని అద్భుత ఆలయాలు ఉన్నాయి. అయితే ఈ 5 ఆలయాలలో ఒక్కో ఆలయంలో ఒక్కో అద్భుతం దాగి ఉంది. మరి ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నవి? ఆ ఆలయాల్లో ఉన్న అద్భుతాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సంగమేశ్వర ఆలయం : 

wonder templesఆంధ్రప్రదేశ రాష్ట్రం, కర్నూలు జిల్లాకి 56 కి.మీ. దూరంలో సంగమేశ్వరం అనే గ్రామంలో సంగమేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. సంగమేశ్వర ఆలయం ఏడునదులు కలిసే ప్రదేశం. అందుకే ఈ క్షేత్రానికి సప్తనది సంగమం అని పిలుస్తుంటారు. ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం.  అయితే అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఎందుకంటే ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం. మరో విశేషం ఏంటంటే వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం దర్శనమిస్తూ ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

నేతి శివలింగం : 

నేతి శివలింగంకేరళ రాష్ట్రం, త్రిచూర్ జిల్లాలో  వడక్కునాథన్ ఆలయం ఉంది.  గర్భగుడిలో ఉండే శివలింగాన్ని ఆ కాలం నుండి కూడా నేతితో అభిషేకించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విశేషం ఏంటంటే, ఎప్పటినుండో ఇలా శివలింగానికి నేతితో అభిషేకం చేస్తున్నప్పటికీ ఆ నెయ్యి అనేది కరగడం లేదు, అంతేకాకుండా ఆ నెయ్యి అనేది ఎలాంటి దుర్వాసన అనేది కూడా రావడం లేదు. ఇదంతా కూడా దైవలీలగా భక్తులు భావిస్తుంటారు. ఇక్కడ పురాతన కాలం నుండి శివలింగానికి నెయ్యితో అభిషేకం చేస్తుండగా శివలింగం చూట్టు మూడు మీటర్ల మందంతో నెయ్యి అనేది ఉంటుంది. అందుకే ఈ ఆలయంలో శివలింగం అనేది కనిపించదు.

వేదగిరీశ్వర్: 

wonder temples

తమిళనాడు రాష్ట్రం, కాంచీపురం జిల్లా, తిరుక్కళికుండ్రం అనే పట్టణంలో ఒక కొండపైన వేదగిరీశ్వర్ అనే ఒక ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని డేగల దేవాలయం అని కూడా అంటారు. అయితే ఆలయ పూజారి ఒక పెద్ద పాత్రలో ప్రసాదం లాంటి పాయసం తయారుచేసుకొని వచ్చి గుడి పక్కన ఉన్న ఆవరణలో ఒక చోట కూర్చుంటాడు. ఇక సరిగ్గా 12 గంటల సమయంలో కొన్ని పక్షులు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తాయి. వాటిని చూసిన అర్చకుడు ఒక పళ్లెం మీద మోత మ్రోగిస్తూ ఆ పక్షులకి సంకేతాన్ని తెలియచేస్తాడు. అప్పుడు ఆకాశంలో ఉన్న పక్షులలో రెండు పక్షులు అతని ముందు వాల్తాయి. అప్పుడు ఆ పూజారి వద్ద ఉన్న పాత్రలోని పాయసాన్ని కొంత ఆ రాతిపైన ఉంచుతాడు. ఆ పక్షులు ఆ పాయసాన్ని కొంచం తిని వెంటనే ఎగిరిపోతాయి. ఈ వింత ఆచారం ఎప్పటినుండో కొనసాగుతుండగా సరిగ్గా 12 గంటలకి ఆ పక్షులు వచ్చి పాయసం తాగడం అనేది ఇప్పటికి ఒక అద్భుతంగా భావిస్తారు.

శివ గంగ గంగాధరేశ్వర ఆలయం:

శివ గంగ గంగాధరేశ్వర ఆలయంకర్ణాటక రాష్ట్రం, తుమకూరు ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో శివ గంగ గంగాధరేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ ఆశ్చర్యంగా గర్భగుడిలో ఉన్న శివలింగానికి నెయ్యి తో అభిషేకం చేస్తే ఆ నెయ్యి వెన్నె వలె మారుతుంది. అయితే సాధారణంగా వెన్న నుండి నెయ్యి అనేది వస్తుంది కానీ ఇక్కడ విచిత్రంగా శివలింగంపైన నెయ్యి ని రాస్తే వెన్న రావడంతో, దీని పైన చాలామంది పరిశోధనలు చేసినప్పటికీ ఇప్పటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

జ్వాలాముఖి ఆలయం: 

జ్వాలాముఖి ఆలయం

హిమాచల్ ప్రదేశ్, కాంగడా కి కొన్ని కిలోమీటర్ల దూరంలో జ్వాలాముఖి ఆలయం ఉంది. మన దేశంలో ఉన్న 51 శక్తిపీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ అమ్మవారు జ్వాలా రూపంలో ఉండటం వలన అమ్మవారికి జ్వాలాముఖి అనే పేరు వచ్చినది అని చెబుతారు. ఇక్కడ తొమ్మిది జ్యోతిలు ఎప్పుడు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఈ ఆలయంలో ఇలా తొమ్మిది జ్వాలలు ఎలాంటి సహాయం లేకుండా ఎలా వెలుగుతున్నాయనే విషయాన్నీ తెలుసుకోవడానికి ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఆ మిస్టరీ ఏంటనేది ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. ఈ ఆలయంలో అరకు కింద చిన్న గుంట ఉండగా, ఆ గుంట పక్కన ఉన్న చిన్న రంద్రం నుండి అరచేతి మందంతో ఒక జ్వాలా నిరంతరం వెలుగుతుండగా, ఆ జ్వాలా సతీదేవి యొక్క నాలుక రూపం అని చెబుతారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR