దేశంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు అనేవి ఉన్నాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో విశేషం అనేది ఉంటుంది. అలానే ఈ ఆలయంలో కోనేటిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే సర్వరోగాలు మటుమాయం అవుతాయని ఒక నమ్మకం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, హుగ్లీ జిల్లా లో కలకత్తా నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో పండాలె అనే గ్రామంలో తారకేశ్వర్ అనే ఆలయం ఉంది. శైవక్షేత్రాలలో ఒకటిగా చెప్పే ఈ ఆలయంలో శివుడు లింగరూపంలో స్వయంభువుగా వెలిశాడని పురాణం. ఇక్కడ వెలసిన ఈ స్వామివారిని తారకేశ్వరుడు అని, అమ్మవారిని తారకేశ్వరి అని పిలుస్తుంటారు. ఈ ఆలయాన్ని 18 వ శతాబ్దంలో రాజా భరమల్లుడు నిర్మించాడు.
ఈ ఆలయ పురాణానికి వస్తే, ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న స్థలంలో పూర్వం ఆవులు తమ పాలని శివార్పణం చేసేవట, ఒకసారి రాజా భరమల్లుడు కలలో శివుడు కనిపించి తనకి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించామని చెప్పగా ఆ రాజు సంతోషించి శివాజ్ఞతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది.
ఇంకా ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఈ ఆలయంలోని స్వామివారు ఎలాంటి మందులు లేకుండా వ్యాధులు నయం చేసే స్వామివారిగా ప్రసిద్ధి చెందాడు. ఇంకా ఈ ఆలయం దగ్గర ఉన్న కోనేటిలో స్నానం చేసి ఆలయం చుట్టూ ప్రదిక్షిణ చేస్తే సర్వ రోగాలు నయం అవుతాయని భక్తుల నమ్మకం. అంతే కాకుండా గుండెజబ్బులు ఉన్నవారు ఈ స్వామిని దర్శిస్తే తొందరగా నయం అవుతుందనే నమ్మకం కూడా ఉంది. ఇంకా ఈ ఆలయంలో ఒక పక్కన గంటలు కొన్ని వందల సంఖ్యలో ఒకేదగ్గర ఉంటాయి. ఆలయంలో పూజ జరిగే సమయంలో భక్తులు ఈ గంటలని మోగిస్తుంటారు.
ఇలా ఎంతో ప్రసిద్ధిచెందిన ఈ ఆలయంలో శివరాత్రి రోజున జరిగే బ్రహ్మోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.