Home Blog Page 55

చలికాలంలో పల్లీ పట్టీ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ?

0

చలి కాలం ఎన్నో ఆరోగ్య సమస్యలను మోసుకొస్తుంది. శరీరంలో వేడి తగ్గి, చలికి ముడుచుకుపోతుంటారు. దీనికి తోడు చల్లటి వాతావరణం వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు పొంచి ఉంటాయి. వీటినుండి బైటపడడానికి వేడిసూప్ లు, శరీరంలో వేడి పుట్టించే ఆహారపదార్థాలు తినాల్సి ఉంటుంది. అందులో పల్లి పట్టి ముందుటుంది.

health benefits of eating palli pattiపల్లీల్లో ఉండే సుగుణాలు, బెల్లంలోని ఆరోగ్య లక్షణాలు చలికాలంలో శరీరంలో వేడి పుట్టించి జబ్బులకు దూరంగా ఉండేలా చేస్తుంది. పల్లీల్లో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సినన్ని పోషకాలు ఉంటాయి. బెల్లంలో ఇనుము, కాల్షియం తదితర పోషకాలు ఉంటాయి. ఇవి రెండూ కలవడం వల్ల శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది.

health benefits of eating palli pattiపల్లీ పట్టీల వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. అలాగని అదే పనిగా మరీ ఎక్కువగా తినొద్దు. ఏదైనా మోతాదు మించితే అనర్థమే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. రక్త సమస్యలు లేదా మరేదైనా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకున్నాకే తినాలి.

health benefits of eating palli pattiపల్లీలను బెల్లంతో కలిపి తినడం వల్ల రక్తహీనత దూరమవుతుంది. పల్లీలను తరచుగా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడతుంది. వేరు శనకలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. డయాబెటీస్ బాధితులు మినహా మిగతావారు రోజుకు 20 గ్రాముల బెల్లం తినడం మంచిదే.

health benefits of eating palli pattiబెల్లం, వేరుశనగలను కలిపి తినడం వల్ల మహిళల్లో రుతు సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. పల్లీలో ఉండే పీచు పదార్థాలు ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తాయి. వేరుశనగ, బెల్లం ఉండలు ఒంట్లోని విషతుల్యాలను బయటకు పంపేస్తాయి. బెల్లంలో ఉండే కాల్షియం, ఇతర ప్రొటీన్ల వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా మారతాయి.

 

కిరాతకుడుగా ఉన్న వ్యక్తి వాల్మీకిగా మారడానికి గల కారణాలేంటి?

0
వాల్మీకి

రామాయణం రాసింది ప్రాచేతసుడు అనే పేరుగల రుక్షుడు లేదా భార్గవుడు. ఆయన్నే వాల్మీకి అని అంటామని అందరికీ తెలిసిందే. కానీ కీరతకుడిగా ఉన్న వ్యక్తి వాల్మీకిగా మారడానికి గల కారణాలేంటి? ఆయనకు వాల్మీకి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

వాల్మీకికిరాతధర్మంతో ఉన్న రుక్షుడు అడవిలో ఉంటూ దారినపోయే వారిపై దోపిడీ చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు ఆ దారిలో సప్తమహర్షులు వెళ్లారు. వారి వద్ద ఉన్న సొమ్మును అపహరించాలన్న ఉద్దేశంతో రుక్షుడు వారిని చెట్టుకు కట్టేస్తాడు. అప్పుడు నారదుడు రుక్షుడుని ఇలా అడుగుతాడు.నీ పాపంలో, భార్యపుత్రులకి కూడా భాగం ఉందా? లేదా తెలుసుకునిరా! అని అంటాడు. అంతే వెంటనే ఈ కిరాతకుడు ఇంటికి వెళ్లి నేను చేసిన పాపంలో భాగాన్ని మీరు తీసుకుంటారా అని భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను అడుగుతాడు. కానీ వారందరూ ఒక్కటే సమాధానం చెప్తారు. నీవు తెచ్చిన ధనాన్ని లేదా ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాం. నీ పాపాలతో మాకు సంబంధం లేదు అని.

వాల్మీకిజన్మసంస్కారమో, జీవితంలో రాబోయే కాలంలో మార్పు కోసమో లేదా భగవత్ సంకల్పమో ఆ రుక్షుడు అడవిలోకి వచ్చి మహర్షుల కట్టు విప్పుతాడు. వారికి సాష్టాంగ నమస్కారం చేసి తప్పును మన్నించమని ప్రాధేయపడుతాడు. అంతేకాకుండా జీవితంలో తరించడానికి ఏం చేయాలో తెలపమని ప్రార్థిస్తాడు. దీంతో నారదుడు మరా అని రామనామాన్ని తిరగలమరగల ఉపదేశిస్తాడు. దాన్నే 12 లక్షలసార్లు అక్కడే కూర్చుని రుక్షుడు జపించాడు.

వాల్మీకిదాంతో అక్కడ పుట్టలు పెరిగాయి. నారదుడు తిరిగి వచ్చాడు. రుక్షుడు చుట్టూ పుట్టలు పెరిగడం చూసి వల్మీకం నుంచి వచ్చినవాడు కాబట్టి వాల్మీకిగా ప్రసిద్ధి చెందుతావని నారదుడు ఆశీర్వదిస్తాడు. అప్పటి నుంచి ఆ కిరాతకుడికి వాల్మీకి అనే పేరు వచ్చింది. మహా రుషిగా మారాడు. తపంబు ఆచరిస్తూ తదనంతర కాలంలో శ్రీమద్రామాయణాన్ని రాసి ధన్యుడుగా మారాడు.

 

శాపం కారణంగా మొగలిపూవు పూజకు అర్హత లేకుండా మారిందా ?

0
mughal flower

పూర్వం బ్రహ్మ విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్పని వాధించుకుంటారు. వాదన ఎంతకీ తేలకపోయేసరికి పరమశివుడు వాళ్ళ కళ్ళు తెరిపించాలనుకుంటాడు. అప్పుడు వారి మధ్య శివుడు శివలింగ రూపంలో పుట్టి బ్రహ్మను, నా శిరస్సు ఎక్కడుందో కనుక్కోమని చెప్తాడు. విష్ణువును నా పాదాలేక్కడున్నాయో కనుక్కోమని ఆదేశిస్తాడు. హంసరూపంలో బ్రహ్మ పైకి, ఆదివరాహరూపంలో విష్ణువు క్రిందికి వెళ్లారు.

Vishnuబ్రహ్మకు లింగంశిరస్సు, విష్ణువునకు లింగపాదాలు కన్పించలేదు. మన్వంతరాలు తిరిగిపోయాయి. ఇద్దరూ తిరిగి తిరిగి పోరాడుకున్న స్థలానికే వచ్చారు. విష్ణువు నాకు లింగంపాదాలు కనిపించాలేదన్నాడు. బ్రహ్మ తానూ ఎలాగైనా గెలవాలి అన్న ఆశతో లింగం శిరస్సు చూసానని మొగిలిపూవును, కామధేనువును వెంటబెట్టుకొని వచ్చాడు. మొగలిపూవుచేత చూసినట్లు సాక్ష్యం చెప్పించాడు. ప్రలోభానికి లోనై మొగలిపూవు అబద్ధం చెబుతుంది. కామధేనువుని అడగ్గా అది తన తోకను అడ్డంగా ఊపి ఇది అబద్ధమని తెలియజేసింది.

మొగలిపూవుఅప్పుడు విష్ణువు మొగలిపూవు అబద్ధం చెప్పింది కనుక అది పూజకర్హం కాదనీ శాపం పెట్టాడు. కామధేనువు వెనుక భాగంతో సత్యం తెలిపింది కనుక ఆవుకు వెనుకభాగం పూజార్హమగుగాక అని వరం ఇస్తాడు.

Kamadenuvuఅందువల్ల మొగలి పూవు పూజకర్హం కాకుండా పోయింది. ఆవు వెనుకభాగమే పూజింపబడుతోంది. మల్లె, గులాబీ మొదలైన పూవులు కూడా పూజకు అర్హత లేనివే. మల్లె కేవలం అలంకారానికి మాత్రమే.

 

గోదాదేవి ఆచరించిన ఈ వ్రతం వెనుక ఉన్న ప్రాముఖ్యత

0

సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం – “ధనుర్మాసం”. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన “తిరుప్పావై” ని ఈ మాసం రోజులు పఠిస్తారు.

Uniqueness of Dhanurmasa Poojaముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దద్ధోజనం సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచవలెను. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు, సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది అని నమ్మకం.

ధనుర్మాస వ్రతం:

Uniqueness of Dhanurmasa Poojaప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరాశి మొదలు పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు. ఆదిత్యుడు తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే ధనుర్మాసం ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది.

Uniqueness of Dhanurmasa Poojaఈ నెలరోజుల పాటూ “ధనుర్మాసవ్రతం” ఆచరించాలి.ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణకథనం. ధనుర్మాస వ్రత ప్రస్తావన, మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత ఆదిత్యపురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది. వ్రతం చేయాలనుకునే వారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే శక్తి మేరకు పంచలోహలతోగాని, రాగితో గానీ శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని ఒకదాన్ని తయారుచేయించుకుని పూజాపీఠంపై ప్రతిష్టించుకోవాలి. విష్ణువును ‘మధుసూదనుడు’ అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతి రోజు సూర్యోదయాని కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్ర లేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి.

Uniqueness of Dhanurmasa Poojaమధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్ఠం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్కదానినే నింపుకుని, అభిషేకం చేయాలని శాస్త్రవచనం. తర్వాత తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ, సహస్రనామాలతోగానీ, పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ ‘చెక్కర పొంగలి’ ని గానీ, బియ్యం, పెసరపప్పు కలిపి వండిన ‘పులగం’ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ ‘దధ్యోదనం’ నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూప,దీప, దక్షిణ,తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని పూజించాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజుల పాటూ చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని శాస్త్రవచనం.

Uniqueness of Dhanurmasa Poojaవ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీమధుసూధన స్వామివారి విగ్రహాన్ని –
“మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథాః||”
అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు దానన్ని స్వీకరిస్తూ –
“ఇందిరా ప్రతి గృహ్ణాతు”

Uniqueness of Dhanurmasa Poojaఅని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాసవ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వేయిసంవత్సరాల పాటూ నిత్యం వివిధదేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితాభిప్రయం. కాత్యాయనీవ్రతం లేక శ్రీ వ్రతంఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.

మెదడును డ్యామేజ్ చేసే ఈ అలవాట్లు నుండి జాగ్రత్త

0
brain

శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటి. మిగతా అవయవాలుఎంత ఆరోగ్యం గా ఉన్నా ఇది పనిచేయకపోతే ఇబ్బందే. అలాంటి మెదడు ఆరోగ్యం గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో..

Beware of these habits that can damage the brainఅది డ్యామేజ్ కాకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం. అయితే, ముఖ్యం గామెదడును డ్యామేజ్ చేసే అలవాట్లు మనిషిలో చాలా ఉన్నాయి. అవేంటంటే…

బ్రేక్ ఫాస్ట్ మానేయడం:

Beware of these habits that can damage the brainఉదయం టిఫిన్ తినడం మానొద్దు. అలా చేస్తే రక్తంలో సుగర్ లెవల్స్ తగ్గి మెదడు మొద్దుబారిపోతుంది. శరీరంలో అన్ని భాగాల కంటే ఎక్కువ ఎనర్జీని తీసుకునేది మెదడే. కాబట్టి, సమయానికి ఆహారం తింటూ ఎప్పటికప్పుడు ఎనర్జీని అందించాలి.

అవసరమైన నిద్ర లేకపోవడం:

Beware of these habits that can damage the brainఈ రోజుల్లో అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. మెదడు సక్రమంగా పనిచేయాలంటే కంటి నిండా నిద్రపోవాలి. లేకపోతే మానసిక సమస్యలు ఏర్పడి మీ రోజువారి పనులకు విఘాతం ఏర్పడుతుంది. నిద్రలేమి వల్ల మెదడుకు ఏర్పడే నష్టం ఓ ప్రమాదంలో తలకి తగిలే బలమైన గాయంతో సమానం.

అతిగా తినడం:

Beware of these habits that can damage the brainఅవసరానికి మించి ఆహారం లాగించినా మెదడుకు చేటే. ఊబకాయానికి జ్ఞాపకశక్తి కోల్పోయే వ్యాధి(Dementia)కి దగ్గర సంబంధం ఉందని పరిశోధనలు తెలుపుతున్నాయి. కాబట్టి అతిగా తిని అనార్థాలు తెచ్చుకోవద్దు.

యూరిన్‌ను ఆపుకోవ‌డం:

Beware of these habits that can damage the brainయూరిన్ కు వెళ్లడాన్ని కొంతమంది వాయిదా వేస్తుంటారు.అలా చేయడం వల్ల మెదడు నరాలు ప్రభావితం అవుతాయనితాజా అధ్యయనాల్లో తేలింది. అందుకే మూత్ర విసర్జనచేయాలనిపించిన వెంటనే వెళ్లడం మంచిది. ఇవేకాకుండా ఎక్కువగా మాట్లాడటం, ఆలోచనా శక్తి తగ్గడం,వ్యాయామాలు చేయకపోవడం, ఆరోగ్యం సరిగా లేనప్పుడుబ్రెయిన్ పై ఒత్తిడి పెంచడం, పొల్యూషన్ కూడా మెదడుడ్యామేజ్ కు కారణమవుతాయి.

స్మోకింగ్:

Beware of these habits that can damage the brainస్మోకింగ్ ఎన్నివిధాలుగా చూసినా నష్టమే. పొగతాగడం వల్ల మెదడులో ఉండే కణాల పొరలు, నాళాలు దెబ్బతింటాయి. అతిగా స్మోకింగ్ చేసేవారు గజినీలుగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది. మానవుని మెదడు పై భాగాన పొరగా కప్పి ఉంచే పదార్థం (కార్టెక్స్) పలచబడుతుంది. అసలు స్మోకింగ్ చేయని వ్యక్తులతో పోల్చితే 25 ఏళ్లపాటు స్మోకింగ్ చేసిన వ్యక్తుల కార్టెక్స్ చాలా పలచబడినట్లు ఓ సర్వేలో తేలింది.

నీరు తాగకపోవటం:

Beware of these habits that can damage the brainమన శరీరంలో ఉండేధీ 70 శాతం నీరే. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే తప్పకుండా నీరు తాగాలి. ముఖ్యంగా మెదడుకు అవసరమైన ఆక్సిజన్ కూడా నీటి ద్వారానే చేరుతుంది. రెండు గంటలపాటు నీరు తాగకుండా వ్యాయమం చేసినట్లయితే తీవ్ర నిర్జలీకరణకు గురవుతారని, దీనివల్ల శరీరం అదుపు తప్పుతుందని సర్వేలు తెలుపుతున్నాయి. నీరు తాగకపోతే మెదడులో సమన్వయ లోపం తలెత్తుతుంది. ‘దాహం’ అనేది మెదడు అందించే సిగ్నల్. ఈ నేపథ్యంలో దాహం వేసిన ప్రతిసారి నీరు తాగడం మరిచిపోవద్దు.

సుగర్’ తగ్గించండి:

Beware of these habits that can damage the brainశరీరానికి, మెదడుకు సుగర్ అవసరమే. కానీ, అతిగా తీసుకోకూడదు. అతిగా సుగర్ తీసుకుంటే మెదడులోని కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే మీ శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను ఆహారం నుంచి గ్రహించడం కష్టమవుతుంది. జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

ఒత్తిడి:

Beware of these habits that can damage the brainదీర్ఘకాలిక ఒత్తిడి మనిషిని జీవశ్చవం చేస్తుంది. శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల మెదడులో కార్టిసోల్ (ఒత్తిడిని ఎదుర్కొనే హార్మోన్) తీవ్రమై శాస్వత సమస్యగా మారుతుంది. అంతేకాదు, మెదడులోని కణాలను ఛిద్రం చేయడమే కాకుండా, మెదడు కుచించిపోడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ అలవాట్లు ఉంటె వెంటనే అప్రమత్తమై ఈ రోజు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే. మెదడు బిందాస్‌గా పనిచేస్తుంది.

 

ఇంటికి వేసే రంగులుతో ఏ కలర్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతోందో తెలుసా

0

ఇళ్లకు పెయింట్స్ వేసుకునేటప్పుడు ఏ కలర్ వేసుకుంటే బెటర్ అన్నది ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్యే. ఒక్కొక్కరికీ ఒక్కో కలర్ నచ్చుతుంది. కొందరికి బ్లాక్ నచ్చితే, కొందరికి అస్సలు నచ్చదు. కొందరు రెడ్ అంటే ఇష్టపడతారు. మరికొందరు రెడ్‌ని చూస్తే చాలు చిర్రెత్తిపోతారు. అయితే… మానసికవేత్తలు మనుషులకూ, కలర్స్‌కీ మధ్య సంబంధాల్ని పరిశోధించారు. మరి ఏ కలర్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతోందో, ఇళ్లలో ఎలాంటి కలర్స్ వేసుకుంటే, ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకుందాం.

benefits of any colors with home dyes->సాధారణంగా ఇళ్లకు వేసే కలర్స్ లో వైట్ కలర్ ని ఎక్కువగా చూస్తుంటాం. నిజానికి ఇళ్లకు వైట్ కలర్‌ని మించిన కలర్ మరొకటి లేదు. అయితే ఎప్పుడూ వైట్ కలరే వేసుకుంటే కూడా మనసుకి నచ్చదు. అందుకే వైట్‌తోపాటూ కొన్ని ఇతర కలర్స్ కాంబినేషన్ కూడా ఉండేలా చేసుకోవాలి. కానీ అవి ఎలాంటివి?

benefits of any colors with home dyes-> ఆకాశం బ్లూ కలర్‌లో కనిపిస్తూ విశాలమైన ఫీలింగ్ కలిగిస్తుంది. అందువల్ల ఇళ్లకు స్కై బ్లూ కలర్ వేసుకుంటే… మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా డోర్స్, విండోస్‌ కి ఇలాంటి కలర్స్ వేసుకుంటే బాగుంటుంది.

benefits of any colors with home dyes-> ఈ ప్రపంచలో గ్రీన్… ఎప్పటికీ ఎవర్ గ్రీనే. ఇళ్లలో గ్రీన్ కలర్ ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నేచర్‌లో ఉన్న ఫీల్ కలుగుతుంది. ఇది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని పరిశోధకులు తేల్చారు. ముఖ్యంగా ఇంట్లోని స్టడీ రూంలో గ్రీన్ కలర్ ఎక్కువగా ఉంటే, పిల్లలు బాగా చదువుతారట. ఒత్తిడి, టెన్షన్లు తగ్గాలంటే గ్రీన్ కలర్ ది బెస్ట్.

benefits of any colors with home dyes->రెడ్ కలర్ ఎంత ఎక్కువగా ఉంటే, టెన్షన్లు అంతలా పెరుగుతాయి. రూం నిండా రెడ్ కలర్ ఉంటే, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కాబట్టి ఇది వీలైనంత తక్కువగా ఉండేలా చేసుకోవాలి. అయితే ఈ కలర్ ఎట్రాక్టివ్‌గా ఉంటుంది. అందువల్ల ఇళ్లలో ఫ్రేములు, ర్యాక్స్, షెల్ఫులకు రెడ్ కలర్ వేసుకుంటే లుక్ బాగుంటుంది.

benefits of any colors with home dyes->కలర్స్‌లో అత్యంత ఎక్కువగా ఎట్రాక్ట్ చేసేది ఎల్లో కలర్. కానీ ఇది బొద్దింకల్ని బాగా ఆకర్షిస్తుంది. అందువల్ల వీలైనంతవరకూ ఇళ్లలో ఎల్లో కలర్ వాడవద్దని సలహా ఇస్తున్నారు నిపుణులు.

benefits of any colors with home dyes->ఆరెంజ్ అనేది ఎల్లో, రెడ్ కలర్స్ కాంబినేషన్. కానీ ఇది మనలో ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. ఉత్సాహాన్ని కలిగించే, చురుకుదనాన్ని పెంచే లక్షణాలు ఆరెంజ్‌లో ఉన్నాయి. ఎట్రాక్ట్ చేసే గుణం కూడా ఉంది. అందువల్ల ఇళ్లలో ఆరెంజ్ కలర్ వేసుకుంటే మంచిది.

-> ప్రేమకి గుర్తుగా భావించే పింక్ కలర్ మనలో ప్రశాంతతను కలిగిస్తుంది. కోపం, ఆవేశాన్ని తగ్గిస్తుంది. ఇంట్లో పింక్ కలర్ ఉంటే, బీపీ తగ్గడమే కాక, గుండె కొట్టుకునే వేగం సక్రమంగా ఉంటుందట.

benefits of any colors with home dyes-> ఇది వరకు బ్లాక్ కలర్‌ను చెడుకు సంకేతంగా భావించేవారు. ఇప్పుడు కాలం మారింది. బ్లాక్ కలర్ పెయింట్ హై క్వాలిటీతో ఉంటుంది. అందువల్ల ఇళ్లకు బ్లాక్ కలర్ వేస్తే… ఇంపుగా ఉంటుంది. ఐతే… లైటింగ్‌ని తగ్గించే శక్తి బ్లాక్‌కి ఉంది. ఇంట్లో కాంతి బాగా ఉండాలంటే బ్లాక్ కలర్‌ని దూరం పెట్టాల్సిందే.

 

10 Heart Touching Non-Telugu Songs That All Telugu People Fell In Love With

0

Mana intlo koora kannaa poruginti koora ruchi ani peddhalu annattu, konni saarlu manolla songs kannaa pakka language songs ye manollaki yekkuva nacchuthaayi… Ante annii kaadhu anukondi… Mana Telugu lo super hit melodies unnaayi, alaane pakka bhashallo koodaa adhiripoye melodies manam vinnaam… Avi Telugu lo release ayinappatikii manollu original version vinadaanike yekkuva interest choopisthaaru… Yenthayinaa original orginal ye kadhaa… Ayithe asalu pakka language films loni ye songs mana Telugu vaallani koodaa oopesaay ani doubt vacchi okasaari list bayataki theesthe idhigo ivi dhorikaay naaku… Ayithe veetilo konni Telugu remake ayinaa sare aa language lone manollu baagaa alavaatu paddaaru…

1) Sun Raha Haina – Ashiqui 2

Ee paata okaanoka time lo india motthanni oppesindhi… Andhulo mana Telugu vaallu minayimpaa yenti, manollaki koodaa piccha picchagaa nacchindhi… Yekkada vinnaa idhe vinipinchedhi…

Tum hi ho – Ashiqui 2

Mari ee paata yemayinaa thakkuva thinindhaa… Andhulo unna pratheedhi oka diamond laa anipinchedhi… Kondhariki pai paata ayithe mari konthandhiki ee paata… Vaayinchipadesaaru asalu…

2) Bekhayali – Kabir Singh

Mana Arjun Reddy remake ayinaa sare ee song maathram konchem gattigaane manollani attract chesindhi… Telugu lo Break-up song yentha highlight ayyindho ee song koodaa anthe range lo manollani touch chesindhi…

3) Teri Meri – Bodyguard

Ee paata pettakapothe thappayipothundhi… Anthe kadhaa mari… Yenthalaa hit ayyindhi guru ee paata… Appatlo andhari phones ki idhe ringtone… Antha craze vacchindhi mana states lo koodaa…

4) Malare – Premam

Dheeni gurinchi seperate ga cheppaalaa… Manollu ee cinema ne vadhalledhu, alaantidhi ee paata ni yelaa vadhilesthaaru… Anthalaa connect ayyaaru kabatte thega videos chesaaru ee song tho… BGM ni ayithe archakangaa vaadukunnaaru…

5) Kattumooliyo – Om Shaanthi Oshaana

Theliyadhu antaaremo ee paata… Naaku thelisinanatha varaku chaala mandhi Telugu music lovers ki ee paata thelusu… Oka range lo untundhi audio, ika video ayithe kallaas asalu…

6) Kaathale Kaathale – 96′

Music of the deacde lekka idhi… Asalu oka industry tho aagindhaa, annintilonuu vacchesindhi… Yentha craze undho movie dhaani antha craze ye ee song koodaa thecchukundhi… BGM ki ayithe manollu flattttt…

7) Thangamey – Naanum Rowdy Dhaan

Manaki Anirudh ni 3 movie introduce chesthe ee song maro level ni choopinchindhi… Manollu chaala baagaa recieve chesukunnaa Tamil songs lo idhi first row lo untundhi anadam lo athisayokthe ledhu…

8) Kanave Kanave – David

Bhavam ki bhasha tho pani ledhu antaaru kadhaa, andhuku perfect example idhi… Love failure ayina prathee okkadiki idho anthem laa maaripoyindhi… Manollu baagaa feel tho dhaachukunna song idhi… Andhulonuu mana Vikram gaaridhi…

9) Othaiyadi Pathyila – Kanaa

Beat ki beat, feel ki feel… Manollaki Telugu version vacchinaa sare dheenike yekkuva connect ayyaaru mari… Original feel assalu vadhalaru manollu… Telugu lo unnappatikii yedho baagunte dhaanike vote…

10) Belageddu – Kirik Party

Crazy song asalu… Yenthalaa oppindhi ante manollu chaalaa rojula paatu idhe song, andhari phones lo idhe paata mogadam… Ika Telugu lo late ga vacchindhi gaani, appatike baagaa own chesukunnaaru ee kannada song ni…

3 songs levu, avi levu ante okati chepthaa… Aa typo konni songs vere languages lo kante Telugu lone baagaa familiar manollaki… Adhii sangathi, untaa mari… Music starts…

Jai Jawan – Jai Kisan – Jai Jawan

ఎర్రగా మారిన కళ్లు మాములు స్థితికి రావాలంటే ఏం చేయాలో తెలుసా ?

0

రెండు రోజులు నిద్ర పోలేదంటే కళ్ళలో నీటికి బదులు రక్తం నిండినట్టు కనిపిస్తుంది. కళ్ళు ఎర్రగా మారిపోతాయి. అయితే నిద్రరాని సమయంలో కళ్లు ఎందుకు అలా ఎర్రగా మారతాయనేది చాలా మందికి కలిగే సందేహం. దీనికి కారణం బాడీలో ఆక్సిజన్ స్దాయి తగ్గడమే. మత్తుగా,బలహినంగా ఉన్నప్పడు కంటికి సరఫరా అయ్యే ఆక్సిజన్ పరిణామాణం కూడా తగ్గుతుంది. దీంతో కంటిలో ఉండే రక్తనాళాలు ఉబ్బుతాయి. దీంతో రక్త నాళాలు పైకి తేలి ఎర్రగా కనిపిస్తాయి.

What causes redness of the eyesమరి అలా ఎర్రగా మారిన కళ్లు మాములు స్థితికి రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఆరు నుంచి ఏడు గంటల పాటు చక్కని నిద్ర పోయి కంటిని చల్లటి నీటితో కడ్కుకుంటే ఈ ఎరుపు మాయమవుతుంది. కళ్లు సాధారణ స్థితికి వస్తాయి. అలాగే సాధారణంగా మనిషి అలసిపోయినప్పుడు నిద్ర వస్తుంది. దీన్ని అపడానికి కళ్లను ఆర్పడం తగ్గిస్తాడు. ఈ కారణంగా కళ్లలలో ఉండే లూబ్రికెంట్ తగ్గుతుంది. దీంతో కళ్ళ పొడిబారి దురదలు మెుదలవుతుంది. దీంతో అదే పనిగా కళ్ళను చేతితో నలుపుకుంటారు.

What causes redness of the eyesఇలా నలపడం వల్ల కూడా కళ్లు ఎర్రబడుతాయి. రాత్రి సమయాల్లో కళ్లు ఎర్రబడానికి చాలా కారణాలు ఉన్నాయి. అలసట, కళ్లు నలపడం, విరామం లేకుండా పగటిపూట సూర్య కిరణాలు తాకిడికి గురవడం కారణంగా కళ్లు ఎర్రగా మారుతాయి. ఇలాంటి సాధరణ పరిస్థితుల వలన కాకుండా కళ్లు ఎర్రబడితే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

What causes redness of the eyesనిద్రలేమి సమస్య చాలా మందిని వేధిస్తున్న సమస్య. నిద్రపోకపోవడం వల్ల ఆరోగ్యం పాడైపోవడమే కాకుండా మన పని సామర్ధ్యం తగ్గుతుంది. మానసిక ఒత్తిడి కారణంగా మనిషి అనేకరకాల రుగ్మతలకు దారి తీస్తుంది. దాంతోపాటు చికాకు, నిద్రలేమి, ఆందోళన వంటివి మనిషిని వేధిస్తున్నాయి. రాత్రి పూట విధులు నిర్వర్తించే వారిలో నిద్రలేమి సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. ఈ సమస్య వలన డీఎన్‌ఏ సైతం దిబ్బతింటోంది. ఇది కాస్త దీర్ఘకాలిక వ్యాధులను ప్రేరేపించేందుకు దోహదపడుతోంది. రోజూలో కనీసం 7-8 గంటల నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

 

పార్వతి దేవి వినాయకుడిని ఎందుకు సృష్టించింది?

0

పార్వతీదేవికి ఇద్దరు చెలికత్తెలు. వాళ్ళ పేర్లు జయ, విజయ. ఒకసారి వాళ్ళు పార్వతీదేవితో ముచ్చటిస్తూ ఉండగా వారి సంభాషణ ఇలా సాగింది.”మహాశివుని దగ్గర లెక్కలేనన్ని గణాలు ఉన్నాయి. అయితే, వారిలో మనవాడు అనుకోదగిన వారు ఒక్కరు కూడా లేరు. వాళ్ళంతా శివుని ఆజ్ఞా పాలకులే మన మాటలు వినేవారు కారు. అలాంటప్పుడు మనకు ఆత్మీయం అనుకునే వ్యక్తి, మనకు విధేయుడిగా ఉండేటటువంటి వ్యక్తిని ఒకరిని సృష్టించకూడదా అమ్మా? అని అడిగారు. చెలికత్తెలు అన్న మాటలు పార్వతీదేవిపై ప్రభావం చూపాయి. దేవికి ప్రేరణ కలిగింది కానీ, అప్పటికి మాత్రం మౌనంగా ఊరుకుంది.

గణపతి జననంయధాప్రకారం కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పార్వతీదేవి, నందీశ్వరుని ద్వారపాలకునిగా నియమించి అభ్యంగన స్నానం ఆచరించేందుకు వెళ్ళింది. ఆవిడ స్నానం పూర్తికాకుండానే మహాశివుడు వచ్చాడు. నందీశ్వరుని పక్కకు జరగమని తిన్నగా లోనికి వచ్చాడు. దాంతో పార్వతీదేవికి సిగ్గుగా అనిపించింది. శివుని మీద కోపం కూడా కలిగింది.

గణపతి జననంఆ సమయంలో పార్వతీదేవికి మునుపు చెలికత్తెలు తనతో అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. వారన్న మాటలో నిజం ఉంది. తనవాడు అయిన వ్యక్తిని కనుక ద్వారం వద్ద కాపలాగా ఉంచినట్లయితే మహాశివుడు ఈవిధంగా నెట్టుకుని, అక్రమంగా లోనికి రాగలిగేవాడు కాదు కదా తాను ఇలా సిగ్గుతో కుంచించుకు పోవలసిన అగత్యం ఉండేది కాదు కదా అని ఆలోచించింది.

గణపతి జననంతనవాడు అనిపించే వ్యక్తి తనకు సదా అందుబాటులో ఉండాలనే ఆలోచన క్రమంగా పెరిగి పెద్దదయింది. కొన్నిరోజులకు ఆ ఆలోచన కార్యరూపం ధరించింది. ఒకరోజు పార్వతీదేవి తన మేనుకు పట్టించిన నలుగుపిండితో ఒక బాలుని ఆకృతిగా తీర్చిదిద్దింది. ఆ బాలుని రూపొందిస్తున్నంతసేపూ ఈ బాలకుడు శుభకరుడు, అపూర్వ బలశాలి, సకల సద్గుణుడు, సర్వ లక్షణ సంపన్నుడు, అద్వితీయ తేజోవంతుడు, మహా సుందరుడు కావాలి. ఈ అపురూపమైన బాలుడు నా సేవకుడిగా ఉండాలి. నేను ఏది చెప్తే దాన్ని ఆజ్ఞగా తీసుకోవాలి. తక్షణం అక్షరాలా అమలుపరచాలి అంటూ మధురమైన ఊహల్లో తేలింది.

గణపతి జననంపార్వతీదేవి తాను స్వహస్తాలతో రూపొందించిన బాలునికి ఊపిరి పోసింది. ముచ్చట కలిగించే వస్త్రాలు తొడిగింది. అనేక అమూల్యమైన ఆభరణాలతో అలంకరించింది. ఆ బాలుని చూస్తే అపురూపంగా, గర్వంగా అనిపించింది. ప్రేమగా స్పృశించి, ఆత్మీయంగా ముద్దు పెట్టుకుని, బాలకా నాకు సంతానం లేదు. ఈ క్షణం నుంచీ నువ్వే నా పుత్రుడివి. నేను ఎలా చెప్తే, అలా వినాలి. నా మాటలు తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పింది. బాలకా, ఇప్పుడు నేను అభ్యంగన స్నానం చేసేందుకు వెళ్తున్నాను. ఎవర్నీ, ఎట్టి పరిస్థితిలో లోనికి రానీయకు అని చెప్పడమే కాకుండా చేతిలో ఒక కర్ర కూడా ఉంచి మరీ వెళ్ళింది.

గణపతి జననంపార్వతీదేవి స్నానానికి వెళ్ళిన కొద్దిసేపటికి మహాశివుడు వచ్చాడు. ద్వారం దగ్గర నిలబడిన బాలుని చూసి ఆశ్చర్యపోయి, తప్పుకోమన్నాడు. పార్వతీదేవి స్వయంగా రూపొందించి, నియమించిన బాలుడు కదా, వీల్లేదన్నాడు.

గణపతి జననంకోపోద్రిక్తుడైన మహాశివుడు, తన గణాలను రప్పించి, కాపలాగా నిలిచిన బాలుని తరిమేయమన్నాడు. దేవగణాలు మూకుమ్మడిగా వచ్చి బాలకునితో యుద్ధం చేశాయి. ఆ యుద్ధాన్ని చూసిన పార్వతీదేవి తల్లడిల్లింది. తన కొడుకును ఒక్కడిని చేసి, ఇంతమంది ఘోరంగా పోరాడుతున్నారే ఇదేమైనా న్యాయమా అనుకుంది. దేవి, తన పుత్రునికి సాయపడేందుకు ఇద్దరు శక్తి దేవతలను సృష్టించింది. కానీ ఫలించలేదు.

గణపతి జననంమహావిష్ణువుతో సహా దేవ గణాలు అందరూ ఏకమై గణపతితో యుద్ధం చేశారు. చివరికి మహాశివుడు, పార్వతీ నందనుని తలను త్రిశూలంతో ఛేదించాడు.

చలికాలంలో పెదాలు పగలడం లాంటి సమస్యలకు చెక్ పెట్టే చిట్కాలు

0

అందం అనగానే అందరూ ఎక్కువగా ముఖం, కళ్లు, చిరునవ్వు, అదరసౌందర్యం వంటివాటిని చూస్తారు. అలాంటివే నలుగురిలో మనల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి కూడా. అయితే చలికాలంలో మీ మోములో చిరునవ్వు అందంగా కనబడాలంటే పెదాలను పదిలంగా కాపాడుకోవాలి. ఇవి కేవలం అందానికే కాదు ఆరోగ్యానికి కూడా అవసరం.

protect the lips from cracking in winterఅందంగా కనిపించేందుకు ఎంత మేకప్ వేసుకున్నా పెదాలు ఆకర్షణీయంగా లేకపోతే నలుగురిలో మీరు అందంగా కనబడరు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే చలికాలంలో పెదాలు పగలడం అనేది చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది.

protect the lips from cracking in winterఅయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకొని చలికాలంలో చక్కని మోముతో నలుగురిలో మీరు స్పెషల్ గా కనిపించండి.

తేనే:

protect the lips from cracking in winterచలికాలంలో పెదాలు పొడిబారకుండా ఉండేందుకు మీ రెండు పెదవులపై స్వచ్ఛమైన తేనేను రాయండి. ఆపైన ఒక లేయర్(కొద్దిగా) వ్యాసిలీన్ ను కూడా రాయండి. అలా చేసిన 15 నిమిషాల తర్వాత తడిబట్టతో వాటిని తుడిచేయండి. ఇలా ఏడురోజుల పాటు చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

గులాబీ రేకులు:

protect the lips from cracking in winterముందుగా పావు కప్పు పచ్చి పాలను తీసుకోండి. అందులో ఐదు లేదా ఆరు గులాబీ రేకులను రెండు లేదా మూడు గంటల పాటు ఉంచండి. ఆ తర్వాత ఆ రేకుల్ని మీ చేతులతోనే మెత్తటి పేస్టులా తయారు చేయండి. ఈ పేస్టుని మీ పెదాలకు రాసిన 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోండి. ఇలా ఒక వారంలో రెండు రోజుల పాటు చేసేయండి చాలు. మీ పెదాలు చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

కొన్ని రకాల నూనెలు:

protect the lips from cracking in winterమీ పెదాలు అందరి కంటే అందంగా కనబడాలంటే కొబ్బరి నూనె లేదా బాదం నూనె, ఆలివ్ ఆయిల్ లాంటి క్యారియర్ ఆయిల్ లో ఒకట్రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా గ్రేప్ సీడ్ ఆయిల్, నీం ఆయిల్ వంటి వాటిని కలిపి మీ పెదాలపై రాయండి. ఒకరోజులో రెండు లేదా మూడుసార్లు ఇలా చేయాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చలికాలమంతా మీ పెదాలు అందంగా మారిపోతాయి.

అలోవెరా జెల్:

protect the lips from cracking in winterమీ పెదాలు రోజంతా తాజాగా కనబడాలంటే ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది. ముందుగా తాజాగా తీసిన అలోవెరా జెల్ ని గాలి దూరని ఒక డబ్బాలోకి తీసుకోండి. రాత్రి పడుకునే ముందు మీ పెదాలకు ఈ జెల్ ని రాయండి. అవసరాన్ని బట్టి ఈ డబ్బాను ఎక్కువ రిఫ్రిజరేటర్లో ఉంచండి. అప్పుడు మీ పెదాలకు మంచి ఫలితం ఉంటుంది.

బటర్:

protect the lips from cracking in winterమీ పెదాలు చలికాలంలో చక్కని రూపంలో కనిపించేందుకు కొన్నిరోజుల పాటు రాత్రి వేళ ముఖ్యంగా నిద్రలోకి జారుకునే ముందు షియా బటర్ కానీ, కోకోవా బటర్ కానీ లిప్స్ కి పట్టించి రాత్రంతా అలా వదిలేయాలి. అప్పుడు మీ పెదవులు మంచి రూపాన్ని కలిగిఉంటాయి.

పెరుగు:

protect the lips from cracking in winterచలికాలంలో మీ పెదవులు చక్కని రూపును కలిగి ఉండాలంటే రాత్రి వేళలో పీనట్ బటర్, పెరుగును రాత్రి వేళ నిద్రపోయే ముందు మీ పెదాలకు రాయాలి. అలా పది నిమిషాల పాటు ఉంచి, తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. కొన్నిరోజుల పాటు తరచుగా ఇలా చేస్తే మీరు ఊహించిన పలితాలొచ్చేస్తాయి.

గ్రీన్ టీ బ్యాగ్:

protect the lips from cracking in winterముందుగా ఒక కప్పు వేడి నీటిలో ఒక గ్రీన్ టీ బ్యాగుని కొన్ని నిమిషాల పాటు ముంచాలి. ఆ తర్వాత ఆ బ్యాగుని మీ పెదాల మీద కొన్ని నిమిషాల పాటు ఉంచితే కూడా మీ పెదాలు అందంగా మారిపోతాయి. రోజులో ఒకసారి ఇలా చేస్తే చాలు.

దోసకాయ:

protect the lips from cracking in winterఒక దోసకాయ ముక్క తీసుకుని పెదాల మీద రబ్ చేయండి. అప్పుడే వచ్చే జ్యూస్ ను పది నిమిషాల పాటు మీ పెదాలపై అలాగే వదిలేయండి. ఆ తర్వాత మంచి నీటితో శుభ్రంగా కడిగేయండి. ఇలా రెండు సార్లు చేస్తే మీరు ఊహించిన ఫలితాలు రావడమే కాదు మీ పెదాలు మరింత ఆకర్షణీయంగా తయరవుతాయి.

 

ఏయే దేవాలయాల్లో, ఏ దేవుడి ముందు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా ?

0

నిత్యజీవితంలో ఏ బాధ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఉద్యోగం కావాలన్న, గ్రహదోషాలు పోవాలన్నా మొదట చేసేది దేవాలయ ప్రదక్షిణలే. ఈ ప్రదక్షిణలను ఆయా సమస్యలు, కోర్కెలను బట్టి ఆయా దేవాలయాల్లో పండితులు చెప్పిన విధంగా ఆచరించడం జరుగుతుంది. సాధారణంగా ప్రదక్షిణలు ఆలయ ధ్వజస్తంభం వద్ద ప్రారంభించి తిరిగి అక్కడికె చేరుకొని దైవానికి నమస్కరిస్తారు. దాన్ని ఒక ప్రదక్షిణగా పరిగణిస్తారు. ఏ దేవాలయమైన ఇలా కనీసం మూడు ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణలువేదాంత పరంగా మొదటి ప్రదక్షిణలో మనషులు తమలోని తమోగుణాన్ని వదిలివేయాలి. రెండో ప్రదక్షిణలో రజోగుణాన్ని వదిలి వేయాలి మూడో ప్రదక్షిణలో సత్వగుణాన్ని వదిలి వేయాలి. తర్వాత దేవాయలంలోకి వెళ్లి త్రిగుణాతీతుడైన ఆ పరమాత్మను దర్శించుకోవాలి. అనేది అసలు పరమార్థం. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కూడా ఆత్మ ప్రదక్షిణ చేయడం తప్పనిసరి.

ప్రదక్షిణలుఇప్పుడు ఏయే దేవాలయాల్లో, ఏ దేవుడి ముందు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసుకుందాం…ఏ దేవాలయంలోనైనా కనీసం మూడు తప్పనిసరిగా చేయాలి. నవగ్రహాలకు కనీసం మూడు. దోషాలు పోవడానికి కనీసం తొమ్మిది. ఒకవేళ ప్రదక్షిణం చేసేవారి జాతక లేదా గోచార పరంగా ఆయా గ్రహాల స్థితిని బట్టి 9, 11, 21, 27, 54 ఇలా ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.

ప్రదక్షిణలుఆంజనేయస్వామి దేవాలయంలో సాధారణంగా మూడు చేయాలి. గ్రహదోషాలు పోవాలనుకుంటే కనీసం 9/11, భయం, రోగం, పీడలు, దుష్టశక్తుల బాధలు పోవాలంటే కనీసం 21/40 లేదా 108 ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో సాధారణ ప్రదక్షిణలు చేయకూడదు. చండీశ్వరప్రదక్షిణ చేయాలి. ఇక అమ్మవారి దేవాలయంలో కనీసం మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. వేంకటేశ్వరస్వామి లేదా బాబా, గణపతి దేవాలయాల్లో కనీసం మూడు గాని ఐదు గాని, తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణలుఅయితే ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రదక్షిణ చేసే సమయంలో మనసు ధ్యాస అంతా లోపల ఉన్న భగవంతునిమీద మాత్రమే తప్ప ఇతరత్రా విషయాలపై ఉండకూడదు. సాధరణమైన, పరిశుభ్రమైన వస్త్రధారణతోనే దేవాలయంలో ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు వేగంగా, పరుగు పరుగున చేయకూడదు. నెమ్మదిగా ఆ దేవాలయంలో ఉన్న మూల విరాట్ నామస్మరణతో పక్కవారిని తాకకుండా, ముచ్చట్లు పెట్టకుండా ప్రదక్షిణలు చేయాలి.

8 Telugu Dialogues That Perfectly Portray The Caste Discrimination From Centuries

0

Caste… Caste… Caste… Mana mutthathaala, thaathalu nundi unnaa ee caste system, next mana manavallu, muni manavallu varaku prasthutham unnattu maathram konasaagakoodadhu ani kottukuntuu article loki vasthunnaa… Caste gurinchi peddhagaa maatlaadi chinchukokundaa direct ga point ki vacchesthaa… Mana Telugu cinema lalo mana hero lu caste gurinchi, ante anti casteism gurinchi cheppina dialogues, scenes ee roju ilaa mi mundhuki… Ante monna yedho scroll chesthuu unte idhi thattindhi, sare meeru koodaa choosi inkonchem chaithanyavanthulu avuthaarani choopiddhaam ani thecchaa…

Gamanika: Babu, yedho scenes unnaayi ani pattukocchaa, dhenni raccha cheyoddhu… Aanandhinchevaallu aanandinchandi…

1) Daana Veera Soora Karna

Modhati namaskaaram Vinayakudike annattu, ee dialogue tho kaakundaa inka dhenitho start chesthaam… Caste ane dhannii kookati veellatho peeki padesinattu peekipadesina dialogue idhi… Mari aa mahanubhavudi direction lo vacchina cinema…

 

2) Okka Magaadu

Anni caste lani maximum cover chesesthaaru mana Balayya… Ante andharuu okate, anni kulaala gunaganaalu goppave, kaligi unnaa annattu vallisthaaru… Too lengthy and informative koodaa…

 

3) Kanche

Ee dialogue lekapothe list fulfill yelaa avvuddhi… Prasakthe ledhu… Kaani ee dialogue mundhemo last word kulam ani undedhi, lip moment koodaa alaane untundhi, kaani dubbing lone mallii netthuru ani pettaarendhuko…

 

4) Trisulam

Indhulo dialogue marii specific ga caste ane cheppaaru, manushulanthaa okkate annattu chepthaaru… Ofcourse andhulo koodaa caste undhile… Pillalaki yem cheppaalo, yelaa cheppaalo ante ilaane cheppaali annattu untundhi… Ika ee cinema lo ayithe anni rakaala abhyudhayavaadham manaki kanipisthundhi… Krishanam Raju gaaru apt asalu… Raayini aadadhi chesina song indhulodhe…

 

5) Jayam Manadheraa

Maamoolu ga undadhu asalu dialogue… Ika Venkatesh gaaru cheppe style next level… Nijangaa manishini manishi gaa choodaleni brathuku yendhuku ra annattu chebuthaaru, nijame kadha mari…

 

6) Dharmakshetram

Job anedhe mukhyam kulam kaadhu annadhi chinna point anthe… Ayithe marii indhulo anti casteism gurinchi maatlaadaru gaani, but simple ga thelchesthaaru, kaani nijam chepthaaru…

 

7) Arjun Reddy

Asalu cinema lo antha peddha conflict vacchedhe dhaani valana kadhaa… Ika dialogue lekundaa yelaa… Alaa ani yedho bhaari length kaadhu gaani, chinna imperfection la chepthaaranthe… Ofcourse hero ki love kaavaali kabatti aa emotion lo vacchindhi antaaraa, anthe babu, yevariko okariki yedho oka emotion vesthene antaaru mari…

 

8) Aakali Rajyam

Ee cinema choosthe full emotions annatte… Yem cinema ra babu, Balachander gaarini andhuke legend anedhi… Ika dialogue vishayaaniki vasthe, hero cutting cheyinchukoni direct ga intloki vacchesthe, vaalla nanna mandhaliathaadu, ilaa managali dhaggara nundi vaathunnaav, snaanam cheyyakundaa lopaliki ani… Appudu vasthundhi ee dialogue… Yedhayinaa casteism ni yedhirinchadame kadhaa…

Veetannitilo exact ga casteism anagathokkesaaru ani nenu ananu… But vaatilo unna content yekkithe chaalu… Alaa ani preaching kaadhu saami…

Jai Jawan – Jai Kisan – Jai Sramik

భక్తులు తెచ్చిన ప్రసాదం దేవుడు స్వీకరించడం ఎప్పుడైనా చూసారా?

0
panakala narasimha swamy

దేవుని ముందు పెట్టిన ప్రసాదాన్ని దేవుడు తింటే అది చూసి పులకించని భక్తులు ఉండరు.కానీ అల ఎక్కడైనా జరుగుతుందా అంటే ఆ ప్రశ్నకు సమాధానము మంగళగిరి శ్రీ పానకాల నరసింహ స్వామి. ఈ విషయాన్ని వివరంగ తెలుసుకునే ముందు ఇక్కడి స్థల పురాణాన్ని తెలుసుకుందాము.

Panakala Narasimha Swamy Templeస్థల పురాణం:

మహిషాసుర వధ జరిగిన తరువాత దుర్గమ్మ ఆగ్రహాగ్నితో రగిలిపోయింది. అప్పుడు ఆమె అగ్ని తన రెండవ కంటి ద్వార ఒక కొండపైకి వదిలి ఆ కొండను పెళ్ళగించి గాలిలోకి విసిరివేసింది. అదియె ఇప్పటి నరసింహ స్వామి కొలువైన కొండ. కాని దుర్గమ్మ నుంచి వెలువడిన ఆ అగ్నిజ్వాలలు మాత్రం ఆ కొండ నుండి అలాగే వెలువడుతున్నాయి.తరువాతి కాలంలో నరసింహ స్వామి హిరణ్యకసిపున్ని చంపిన తరువాత అలాంటి అగ్నిజ్వాలల తోనే రగిలిపోయాడు.

Panakala Narasimha Swamy Templeఅప్పుడు ప్రహ్లాదుడు ఆయనను స్తుతించగా ప్రసన్నుడై తన నుంచి వెలువడుతున్న అగ్నిజ్వలను తను అదుపుచేసుకోదలచి అనువైన ప్రాంతాన్ని వెతకుతున్న సమయంలో అప్పటికే అగ్నితో రగులుతున్న ఈ కొండ కనిపించి అక్కడే తనకు అనువైన ప్రాంతo అని తలచి నరసింహ స్వామి ఇక్కడే కొలువైయ్యాడు. కాని అగ్ని జ్వాలలు మాత్రం చల్లారలేదు. బ్రహ్మదేవుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామిని పానకంతో అభిషేకించగా అగ్నిజ్వాలలు పూర్తిగా ఆరిపోయాయి. అప్పటినుంచి ఇక్కడ పానకంతో అభిషేకించడం ఆనవాయితీగా మారింది.

Panakala Narasimha Swamy Templeఇక్కడ చెప్పుకోతగ్గ విశేషం ఏమిటంటే స్వామి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి నోటిలో పోస్తే నరసింహుడు ఆ పానకాన్ని గుటకలు వేస్తూ సంతోషంగా స్వీకరిస్తాడు.గుటకలు వేసిన శబ్దం కూడా స్ఫష్టంగా వినిపిస్తుంది.స్వామికి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి కి అందివ్వగా స్వామి దానిని త్రాగి మరల కొంత పానకాన్ని బయటకు వదులుతాడు.దానినే భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు.మరియొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ నిరంతరం పానకం నైవేద్యం వల్ల అక్కడ పానకం నేలపై పడినా అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు మరియు ఒక ఈగ కూడా వాలదు. భగవంతుడుకి ఇచ్చిన ప్రసాదాన్ని భగవంతుడే తింటే వచ్చే అలౌకిక ఆనందాన్ని భక్తులు సొంతం చేసుకుంటారు. ఇది ప్రతి తెలుగువాడు ఖచ్చితంగా దర్శించాల్సిన ప్రాంతం.

Panakala Narasimha Swamy Templeఈ క్షేత్రం విజయవాడ మరియు గుంటూరు కు దగ్గరలో ఉంది. విజయవాడ నుంచి ప్రతి 10 నిమిషాలకు గుంటూరు కు బస్సు సౌకర్యం కలదు. ఆ మార్గ మధ్య లోనే ఈ ఆలయం కలదు. మన రాష్ట్రము లోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బస్సు లేదా రైల్ ప్రయాణం ద్వారా ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు.

 

చలికాలంలో ఈ పదార్ధాలు తింటే ఆరోగ్యానికి ప్రమాదమా ?

0

సీజన్ మారినప్పుడు మన ఆహార అలవాట్లలో కూడా మార్పులు వస్తుంటాయి. ఎండాకాలంలో అయితే శరీరానికి చలువ చేసే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. అదే చ‌లికాలం వ‌చ్చిందంటే మ‌సాలా వ‌స్తువులు, నూనె ప‌దార్దాలు, స్పైసి ఫుడ్ తిన‌డానికి ఆసక్తి చూపిస్తాం. క‌మ్మ‌ని వంట‌లు ఎలా ఉన్నా ఘాటు ఫుడ్ తింటారు, మ‌రీ ముఖ్యంగా ఈ స‌మ‌యంలో కొంద‌రు ఇష్టంగా జంక్ ఫుడ్ తింటారు. వీటి వ‌ల్ల ఆరోగ్యానికి చాలా ప్ర‌మాదం అంటున్నారు వైద్యులు.

Green pea accident in winterజంక్ ఫుడ్ మాత్రమే కాదు మనం తరుచూ తినే ఆహార ఇలా చలికాలంలో ఏది పడితే అది తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో హాని కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అలాంటి వాటిలో పచ్చి బఠాణి కూడా ఒకటి. చాలామంది ప‌చ్చి బఠాణీలు తినడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇది కూర‌గా కూడా చాలా మంది వండుకుని తింటారు. మిక్చ‌ర్ల‌లో కూడా వేసుకుని తింటారు.

Green pea accident in winterఅయితే ఇలా తినే ముందు ఆలోచించాలి అంటున్నారు నిపుణులు. చలికాలంలో బఠాణీలు తినడం వల్ల ఎంతో ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బఠాణి చెట్లు లాక్టిన్ ను ఉత్పత్తి చేయగలవని చెబుతున్నారు. ఈ చెట్లు కీట‌కాల నుంచి ర‌క్ష‌ణ కోసం లాక్టిన్ ఉపయోగిస్తాయి.

Green pea accident in winterపచ్చి బఠానీల పై ఉండే లాక్టిన్ కూరగాయలు లేదా ధాన్యాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందట. అందుకే ఇవి ఈ స‌మ‌యంలో ఎక్కువ‌గా తీసుకోవ‌ద్దు అంటున్నారు.

Green pea accident in winterఇవి అతిగా తింటేక‌డుపులో నొప్పి అలాగే అల‌ర్జీ అనేది శ‌రీరంపై క‌నిపిస్తుంది. అందుకే ఈ వింట‌ర్ సీజ‌న్లో వీటికి దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 

నార్మల్ డెలివరీ కావాలంటే ఈ చిట్కాలు తప్పక పాటించాలి

0
నార్మల్ డెలివరీ

85% స్త్రీలకు ప్రసవం( డెలివరీ)సహజంగా జరిగే అవకాశం ఉంది. స్త్రీ శరీర నిర్మాణం దానికి అనువుగానే ఉంటుంది. కేవలం 15 % వారికి వారి ఆరోగ్య రీత్యా, ఇతర కారణాల వలన ఆపరేషన్ చేసి బిడ్డను తియ్యాల్సివస్తుంది. నేటితరంలో కొందరు నొప్పులు, ఆందోళన ఎవరు పడతారు అని ఆపరేషన్ కావాలని కోరుకుంటున్నారు. కానీ సహజంగా జరిగే డెలివరీ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఆరోగ్యంగా ఉన్న స్త్రీ ప్రసవ వేదన ఎక్కువ లేకుండా, సునాయాసంగా కనవచ్చని మన పూర్వికులు రుజువు చేశారు.

నార్మల్ డెలివరీసహజమైన డెలివరీ వల్ల పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ (immunity system) బాగా ఉంటుంది. ప్రసవం తరువాత కోలుకోవటం సులభం. శరీరంలో సహజంగా నొప్పిని తగ్గించే హార్మోన్లు విడుదలవుతాయి. హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండేపని లేదు. మరి ఇన్ని లాభాలున్నప్పుడు సహజమైన డెలివరీ ఎవరు ఒద్దనుకుంటారు. సహజమైన డెలివరీ కావాలంటే, కొన్ని చిట్కాలు, ఆరోగ్య సూత్రాలు, వ్యాయామాలు పాటించాలి. అవి ఏమిటో పరిశీలిద్దాం.

ఒత్తిడి ని దూరంగా పెట్టండి:

నార్మల్ డెలివరీఅనవసరమైన ఒత్తిడి, నెగెటివ్ గా ఆలోచించటం, ఆందోళన పడటం అస్సలు పనికిరాదు. మనసు నిర్మలంగా, హాయిగా ఉంచుకోండి. దానికి ధ్యానం చెయ్యడం, మీకిష్టమైన సంగీతం, పాటలు వినడం, మంచి పుస్తకాలు చదవడం, మంచి దృశ్యాల్ని ఊహించుకోవడం చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. మిమ్మల్ని ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునే స్నేహితుల, సన్నిహితుల మధ్య గడపండి.

నిరుత్సాహ పరిచే మాటలు వినకండి:

వాళ్ళు, వీళ్ళు ఒక్కోసారి తెలిసో, తెలీకో కొన్ని కష్టతరమైన ప్రసవాలని గురించి చెప్తూ ఉంటారు. విషాదకరమైన విషయాలు వినకండి. ఎక్కడో నూటికో, కోటికో ఒక్క డెలివరీ కొన్ని అనివార్య కారణాలవల్ల విషాదం సంభవించవచ్చు. కానీ మనకి ఏమీ కాదు, అని గట్టిగా మనసులో అనుకోవాలి.

నార్మల్ డెలివరీఅవగాహన పెంచుకోండి:

భయాన్ని, బెరుకుని పోగొట్టేది అవగాహన. అందుకే అసలు డెలివరీ ఎలా జరుగుతుంది అని, సైన్టిఫీగ్గా (వైజ్ఞానికంగా) తెలుసుకోండి. ఇన్ని లక్షలమంది ఈ భూమి మీద పుట్టారంటే, అది భయంకరమైనది కాదు. భయం అనవసరం. ఇంట్లో ఉన్న పెద్దలతోనో, అమ్మతోనో చర్చించండి.

బాగా నీళ్లు తాగండి:

Drinking Waterగర్భిణీలు ఎక్కువ నీళ్లు తాగితే, సహజమైన డెలివరీ సాధ్యం. శరీరానికి, నరాలకు సత్తువనిచ్చేది నీళ్ళే. సమస్య లేకుండా సహజమైన ప్రసవం జరగాలంటే, ప్రతి రోజు పళ్ళ రసాలు, మంచి నీళ్లు సంవృద్ధిగా తాగాలి. ఇలాంటి నియమాలతో పాటు, మీరు తీసుకునే ఆహారం కూడా సులభ ప్రసవం జరిగేందుకు తోడ్పడుతుంది.

సుఖ ప్రసవానికి సహకరించే ఆహారం ఆరోగ్యకరమైన తల్లి ఆరోగ్యకరమైన బిడ్దనివ్వగలదు. మరి ఆమె తినే ఆహారం మీదే ఆమె ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అలంటి ఆహారం ఏమిటో తెలుసుకుందాం.

కూరలు, పళ్ళు:

నార్మల్ డెలివరీతాజా కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి.

ఐరన్ ఉన్న ఆహారం:

నార్మల్ డెలివరీగర్భిణులకు ఎక్కువ ఐరన్ అవసరము. సంవృద్ధిగా ఐరన్ ఉండే ఆహారం తినాలి. సులభంగా జీర్ణమయ్యే మాంసం, ఆకుకూరలు తినవచ్చు. చేపలవంటి జలచరాలు తింటే మంచిదే.

కొన్ని రకమైన పళ్ళు:

నార్మల్ డెలివరీపళ్ళల్లో కొన్ని యోని భాగాన్ని సాగడానికి సహకరిస్తాయి. బ్రోమిలియాన్ బాగా ఉండే పదార్ధాలు తినాలి. ఉదాహరణకి మామిడి పండు,అనాస అంటే పైనాపిల్ పండు వంటివి. ఇవి మరీ మోతాదు మించి అతిగా మాత్రం తినకూడదు.

మరి కారం తినవచ్చా:

శరీరం లో వేడినిచ్చేది కారం, ఒక రకంగా మంచిదే. కానీ ఎక్కువ తింటే, అసిడిటీ, అజీర్ణం, విరోచనాలు కలిగే ప్రమాదం ఉంది.

నార్మల్ డెలివరీకొన్ని ఆహార నియమాలు:

చెక్కెర తగ్గిస్తే మంచిది, రెటీనోల్ ఉన్నఆహారం పనికి రాదు. అలాగే, వీధుల్లో బండి మీద అమ్మే తినుబండారాలు అస్సలు తినకండి. రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. గర్భవతిగా ఉన్నప్పుడు కదలకుండా కూర్చోవాల్సిన అవసరం లేదు. మీ పనులు చేసుకుంటూ, స్వల్ప వ్యాయామం చేస్తే మీ ప్రసవం సులభమవుతుంది.

 

హనుమంతునడిపై శనీశ్వర ప్రభావం ఎందుకు ఉండదు?

0
Hanuman

దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనీశ్వరుడు పట్టలేదని మన శాస్త్రాలు చెపుతున్నాయి. శనీశ్వరుని ప్రభావం విఘ్నేశ్వరుడు, హనుమంతునిపై పడలేదని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరామాయణంలోని ఓ చిన్న కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వర ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.

Hanumanరామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా వారధి నిర్మిస్తున్నారు. ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయూత నిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ హనుమంతుడుని పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శనిభగవానుడు తెలిపాడు. చెప్పినట్లు హనుమాన్ తలపై ఎక్కి కూర్చున్న శని, హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించాడు.

Varadhiకానీ శ్రీరామ భక్తుడిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న సుకార్యమునకు శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు, శనీశ్వరుడిని తలమీద రాళ్లను మోయాలి, తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెబుతాడు. అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు.

Saniఅయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుడిని కాలికింద భాగంలో అణచివేయడంతో శనీశ్వరుడు మారుతిని పట్టుకోవడానికి వీలుపడలేదు. దీంతో పాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కిందనే ఉండి, తప్పించుకునే మార్గం లేక తపించిపోయాడని పురాణాలు చెబుతున్నాయి . నాకు విముక్తిని ప్రసాదించు హనుమా నేను నీ జోలికి నిన్ను భక్తితో పూజించే నీ భక్తుల జోలికి రాను అని చెబుతాడు. ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురోహితులు అంటున్నారు.

Hanumanఅందుచేత శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుడిని పూజించేవారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు పూర్తిగా తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం నాడు, లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపం వెెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.

Hanuman Poojaఇంకా రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతుడిికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడని, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతుడిని స్తుతిస్తే వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

 

Meet Madhu Vajrakarur, Who Built A Wind Turbine That Can Generate Both Electricity & Water

0

India, manam enthagano goppaga feel ayye mana desam lo approximately 88 million people are deprived of basic drinking water & electricity.

Kanisam taagadaniki manchi neelu koda dorakani janabha sankya 88 million and inka manchi neelu dorakani places enno…

Andhra Pradesh loni Anantapur district ki chendina 23-year Electrical Engineer aina Madhu Vajrakarur intiki ki kuda basic electricity, clean drinking water andubaatulo levu.

Ee kastame athani loni engineer ni bytaki teesindi.

Madhu Vajrakarur oka “Wind Turbine” tayaru chesaru, aa Wind Turbine both electricity and drinking water ni produce chestundi…

Ezgif.com Gif Maker (5)Tana savings and valla parents own savings nunchi Rs. 1 Lakh karchu chesaru ee Wind Turbine construction ki, Within 15 days lo Wind Turbine construction poorthi chesadu Madhu.

How does this “Wind Turbine” Work?

Ezgif.com Gif Maker (6)Madhu Vajrakarur Says:

“The moisture in the wind is directed into the wind turbines frame using a blower placed at the back of the fan. Once this cool air goes into the long frame, the moisture is directed into the cooling compressor which condenses the air into water. The water is then directed through copper pipes into a three-stage filter with membrane filters, carbon filters, and UV filters to collect any dust particles present. Finally, the clean water is accessed through a tap placed on the frame, and the wind turbine is connected to an inverter with 30-kilowatt capacity and this helps to power fans, lights, and plug-points in my home.”

The Inspiration Behind:

Second class lo yeppudaithe Wind Turbine gurinchi chadivado appati nunchi Madhu ki Wind Turbine tayaru cheyyali ani manasulo gattiga anukunnadu. Chinnappudu cardboards use chesi wind turbines chese vaadu.

Inka konchem peddayyaka Solar Power Grids, Automatic Lights tayyaru cheyyadam nerchukunnadu. And ee Wind Turbine construction design Youtube videos chusi chesaru Madhu.

Madhu Vajrakarur About His Struggle & Wind Turbine:

Ezgif.com Gif Maker (4)“I was born and brought up in Vajrakarur village. Here, the main source of water supply is through borewells and water tankers. The water drawn from the borewells is heated and then used for consumption. When there are no rains, the groundwater level drops and we are dependent on purchasing drinking water from tankers. My father is a farmer and my mother is a housewife, so their income is low. On some occasions we could not afford to buy the water while other times we would depend on borrowing from neighbours”

“This wind turbine provides 80 to 100 litres of water every day and it can cut down on high electricity bills from using a motor to pump water from borewells. My neighbours also benefit from the wind turbine whenever they are short on drinking water.”

“I am hoping to commercialise this design and help others by setting up this wind turbine in water-scarce areas.”

Madhu investors kosam chustunnaru.

Following Mahindra Thar, We Also Wish To See These Vintage Indian Cars In New Shape

0

Recent ga Mahindra Automotives vaalu Thar old version ki some changes chesi latest technology tho new thar ni indian market loki dimparu. New Thar design, advanced technology tho full updated ga vacchina ee Thar ki huge response vacchindi. Ippudu city lo ekkada chusina ee vehicles baga tirugutunnayi…..ee That lage mana Indian market lo oka ooopu oppina vintage indian Cars once malli release chesthe……andulo ivvi must and should undalsindhe.

Whatsapp Image 2021 02 04 At 3.05.13 Pm1.Maruti 800

Maruti 8002.Ambassador

Ambassador3.Premier Padmini

Premier Padmini4.Omni

Omni5.Toyota Qualis

Toyota Qualis6.FIAT

FIAT7.Mitsubishi Lancer

Mitsubishi Lancer8.Tata Sierra

Tata Sierra9.Tata Sumo

Tata Sumo10.Tata 1000

10 Vintage Indian Cars11.Tata Contessa

11 Vintage Indian Cars12.Maruti Esteem

12 Vintage Indian Cars13.Opel Astra

Opel Astra14.Daewoo Cielo

Daewoo Cielo15.Maruti Gypsy

Maruti Gypsy

ఉల్లి టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

చలికాలం వచ్చిందంటే చాలు వాతావరణంలో మార్పులతోపాటు జలుబు,దగ్గును కూడా వెంటబెట్టుకొస్తుంది. ఈ సీజన్ లో జలుబు, దగ్గు చేసిందంటే ఓ పట్టాన వదలదు. అందుకే ఎప్పటికప్పుడు శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. వేడి వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలి. చల్లగా ఉండేవి అస్సలు తీసుకోవద్దు. ముఖ్యంగా డ్రింకులు, ఐస్ క్రీములు, చాక్లెట్లని వీలైనంత దూరంగా పెట్టాలి.

Onion Teaఇక చలికాలం వచ్చిందంటే లేవగానే వేడి వేడిగా ఒక టీ గాని కాఫీ గాని తాగాలి అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ అది కూడా రోజుకి ఓసారి మాత్రమే అంటున్నారు వైద్యులు. దానికి బదులు సూప్ లాంటివి ఈ సీజన్ లో తీసుకుంటే మంచిది. ఇక ఈ సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు, తుమ్ములు తగ్గించుకోడానికి ఉల్లిపాయ టీ మంచి పరిష్కారంగా చెప్పొచ్చు.

Onion Teaజలుబు, తగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం ఇలాంటివి ఉంటే ఉల్లి టీ అప్పటికప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సీ అందిస్తుంది. రెండు రోజుల్లో జలుబు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. మరి ఈ ఉల్లిపాయ టీని ఎలా తయారుచేసుకోవాలి తెలుసుకుందాం…

Onion Teaముందుగా ఒక గ్లాసు నీరు మరిగించి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 3 నల్ల మిరియాలు, 1 యాలుకతో పాటు స్పూన్ సోంపు గింజలను వేసి అన్నీ కలిపి నీటిలో బాగా మరిగించాలి. ఇలా 20 నిమిషాలు మరిగించి కషాయంగా వచ్చాక దాన్ని వడగట్టి ఆ ఉల్లి పొరలు తీసేసి ఆ టీని తాగితే జలుబు, దగ్గు తగ్గిపోతుంది.

 

కనకదుర్గా క్షేత్ర మహిమ వెనుక దాగి ఉన్న రహస్యం

0
ఇంద్రకీలాద్రి

కృష్ణానదీ తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుతీరి వున్న కనక దుర్గామాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం వుంది. ఈ చక్రానికి అగస్త్యల వారు తమ తపః తపస్సును ఫలాన్ని ధారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్రరూపంలో వుండేదని, ఆదిశంకరులు ఇక్కడికి వచ్చి శ్రీ చక్రంలోని రౌద్రబీజాలు తొలగించిన తరువాత దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తుల కోరికలు నేరవేరుస్తుందని చెబుతారు. కనకదుర్గా క్షేత్రమహత్యాన్ని తెలిపే ఒక కథను తెలుసుకుందాం.

ఇంద్రకీలాద్రిఇంద్రకీలాద్రి కథ :-

ఈ కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై స్థిరనివాసం ఏర్పరచుకొని భక్తులను కాపాడుతుండేది. కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై వెలసి వుండడానికి ఒక కథ వుంది. దుర్గామాత ఆలయం వున్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు.

ఇంద్రకీలాద్రిఅతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ వుండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీపరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గ ఎనిమిది చేతుల్లో ఎనిమిది ఆయుధాలు కలుగి, సింహాన్ని అధిష్టించి మహిషాసురుని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది.

ఇంద్రకీలాద్రిఆరి, శంఖ, కేత, శూల, పాశ, అంకాశ, మౌర్వి, శౌనకాలనేవి దుర్గాదేవి బాహువుల్లోను ధరించే ఎనిమిది ఆయుధాలు, ఈ దేవీమూర్తికి ఎడమభాగంలో శ్రీ చక్రం స్థాపించబడి వుంది. ఆ శ్రీ చక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి వుంది, ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీ చక్రానికి జరుగుతాయి.

ఇంద్రకీలాద్రిఆ దేవీమూర్తికి గల మకరతోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి వున్నాయి. శ్రీశైల, బ్రహ్మచారిణి, చండ, మష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు.

 

We Wish These Magical Movie Combos Repeat Again In The Near Future

0

Superstar Mahesh Babu films lo music ippudu entha super ga unna, Mahesh Babu ki Mani Sharma music ichinattu evaru ivvaledhu, ivvaleru kuda. Asalki Mahesh – Mani Combo vere level. Veeliddaridi oka magical combo malla ee combo lo oka movie vasthe bgundu, yevaro okaru ee combo ni malli set cheyyandi ayya… Plz…

Ilane konni magical combos unnai movies lo, aa combos anni past lo valla magic tho audience ni mesmerize chesina vaare. But malli okasaari aa combos screen pai kanipiste yentha bguntundo kadha…

Inthaki past lo manandarini mesmerize chesina aa magical combos list chuddam padandi…

1) Mahesh Babu – Mani Sharma

1

2) Pawan Kalyan – Ramana Gogula

2

3) Dhanush – Anirudh

3

4) Teja – RP Patnaik

4untitled 9

5) Suriya – Jyothika

4

6) Vijay Devarakonda – Sandeep Reddy Vanga

6

7) Trivikram – Mahesh Babu

7

8) Mani Ratnam – Kamal Hassan

8

9) Mani Ratnam – Aishwarya Rai

9

10) Vijay – Murugadoss

10

11) Gautam Menon – Suriya

11

ఐస్ క్యూబ్స్ తో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0
ఐస్ క్యూబ్స్

వాటర్ తాగేటప్పుడు చాలామందికి అందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవడం అలవాటు. అప్పటికప్పుడు ఏదైనా జ్యూస్ గాని, ఏదైనా ఫుడ్ గాని చల్లగా కావాలనుకుంటే అందులో ఐస్ క్యూబ్స్ వేసి తీసుకుంటారు. అయితే ఈ క్యూబ్ తో చాలా ఉపయోగాలు ఉంటాయి.

ఐస్ క్యూబ్స్చల్లదనం కోసం మాత్రమే కాదు బాడీ పెయిన్స్ వచ్చినా ఐస్ క్యూబ్స్ తో రఫ్ చేస్తే అక్కడ పెయిన్ తగ్గుతుంది, కాళ్లు చేతులు నొప్పులు వచ్చినా అక్కడ ఐస్ క్యూబ్ తో రఫ్ చేస్తూ ఉంటే ఆ పెయిన్ తగ్గి ఉపశమనం లభిస్తుంది.

ఐస్ క్యూబ్స్ఇక ముఖంపై మొటిమలు, ముడతలు వంటివి చాలా మందిని వేధిస్తుంటాయి. అలాంటి సమస్యలు తగ్గాలంటే ఐస్ ముక్కని క్లాత్ లో వేసుకుని సమస్య ఉన్న చోట అద్దండి. ఇలా చేస్తే నొప్పి మొటిమలు తగ్గుముఖం పడతాయి. అయితే ఇక్కడ ఉపయోగించే క్లాత్ క్వాలిటీది అయి ఉండాలి మురికిగా ఉండకూడదు.

ఐస్ క్యూబ్స్ఇక కొంతమందిలో కళ్ళు ఉబ్బిపోయి ఉండడం, కళ్లకింద ముడతలు పడినట్టు ఉండడం కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కళ్ల కింద మచ్చలు ఉన్నా నెమ్మదిగా ఐస్ క్యూబ్ తో అద్దితే ఎంతో మంచిది.

ఐస్ క్యూబ్స్ఇవే కాదు చర్మం పై వాపులు ఉన్నా ఐస్ క్యూబ్స్ రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటే అక్కడ ఎలాంటి పెయిన్ ఉన్నా తగ్గుతుంది. అయితే ఐస్ క్యూబ్స్ ని వాటర్ లో వేసుకుని తాగద్దు అంటున్నారు నిపుణులు. దీని వల్ల శరీరానికి వేడి చేస్తుంది. అలాగే ఐస్ వాటర్ కు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యం అనేది గుర్తు ఉంచుకోవాలి.

ఇంద్రుడు చిరుతపులిలా మారి అయ్యప్పకు వాహనం అయ్యాడా?

0
అయ్యప్ప

అయ్యప్ప హిందూ దేవుళ్లలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది.

అయ్య (=విష్ణువు)
అప్ప (= శివుడు)

Ayyapaఈ పేర్ల సంగమం తో ‘అయ్యప్ప’ నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే “కుళతుపుళ”లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. “అచ్చన్ కోవిల్”లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు.

మహిషిని వాదించటం:

మహిషిమహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి. అని వరం కోరింది మహిషి. ‘తధాస్తు’ అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.

అయ్యప్ప జననం:

ఛైత్రమాసము , ఉత్తరా నక్షత్రం ,చతుర్ధశి – సోమవారము నాడు జన్మించారు. జ్యోతి రూపం గా అంర్ధానమయిన రోజు — మకర సంక్రాంతి.

అయ్యప్ప జననంక్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు సోమవారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు.

అయ్యప్పఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు ‘అయ్యా అని మరికొందరు ‘అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి ‘అయ్యప్ప’ అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులం లో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.

మహిషి వధ:

అయ్యప్పఅడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.

శబరిమలైలో నివాసం:

Ayyapaరాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.

 

కళ్ళ కింద వలయాలు పోగొట్టే ఇంటి చిట్కాలు మీకోసం

0
Home Tips for Reducing Dark Circles

ముఖం మీద మొటిమలు ఎంత ఇబ్బంది పెడతాయో కళ్ల కింద నల్లటి వలయాలు అంతకన్నా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఈ వలయాలు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి మొదలగు కారణాల వల్ల కళ్ళకింద వలయాలు ఏర్పడతాయి. కళ్లకింద అంత త్వరగా నల్లటి వలయాలు ఏర్పడడానికి కారణం కూడా ఉంది.

Home Tips for Reducing Dark Circlesకళ్ల కింద ఉండే చర్మం చాలా మృదువుగా ఉంటుంది. ఏదైనా అనారోగ్యానికి చాలా తొందరగా గురవుతుంది. కళ్ళకింద వలయాలు పోగొట్టుకోవడానికి మార్కెట్లో చాలా సాధనాలున్నాయి. అయితే ఈ డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవడానికి ఇంట్లోనే ఔషధం తయారు చేసుకోవచ్చు. కళ్ళ కింద వలయాలు పోగొట్టే ఇంటి చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

Home Tips for Reducing Dark Circlesదోసకాయ ముక్కల్ని గుండ్రంగా కత్తిరించుకుని వాటిని కొద్ది సేపు ఫ్రిజ్ లో ఉంచి, ఆ తర్వాత కళ్లపై ఉంచుకోవాలి. అలా కాకున్నా దోసకాయ ముక్కలని చిదిమేసి, ఆ రసాన్ని వలయాల మీద మర్దన చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి.

Home Tips for Reducing Dark Circlesరోజ్ వాటర్ చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కళ్లకింద వలయాలని పోగొట్టడంలో రోజ్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది. ఒక చిన్న కాటన్ ముక్క తీసుకుని రోజ్ వాటర్ లో ముంచి, కళ్ళకింద వలయాల భాగంలో మర్దన చేసుకోండి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా రోజూ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేస్తే సరిపోతుంది.

Home Tips for Reducing Dark Circlesబంగాళ దుంపలని కొద్ది సేపు రిఫ్రిజిరేటర్లో ఉంచుకుని తర్వాత వాటిని ముక్కలుగా కత్తిరించుకుని, దాన్ని రసంగా చేసి, ఆ రసాన్ని కళ్లకింద వలయాల చుట్టూ మర్దన చేయాలి. 15నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

Home Tips for Reducing Dark Circlesఇలా ఓ వారం రోజుల పాటు చేస్తే సరైన ఫలితం దక్కుతుంది. వీటితో పాటు సరైన నిద్ర కూడా కళ్లకింద వలయాలు రాకుండా కాపాడుతుంది.

 

కార్తీక మాసంలో సోమవారం ఎందుకు అంత ప్రత్యేకం ?

0

ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తి క నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది.

కార్తీక మాసంకృత్తికా నక్షత్రం:

ఈ కృత్తికానక్షత్రం నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు.

కార్తీక మాసంఈ కృత్తికలకు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమార స్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖములు కలవాడని అర్థం. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు యివ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతోపాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమరస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది.

కార్తీక సోమవారాలు:

కార్తీక మాసంఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఏ మనుష్యూడైన తులారాశియందు సూర్యుడుండగా కార్తీకమాసమందు సూర్యోదయ సమయంలో లేచి కాలకృత్యలు నిర్వర్తించి, నదీస్నానం చేసి, జపము, దేవపూజ, తీర్థవిధి మొదలగు కార్యాలను చేస్తే గొప్ప ఫలితం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక మాసారంభ రోజున శుద్ధపాడ్యమి మొదలుకొనిగాని వ్రతారంభమును చేయాలి. ఇలా ప్రారంభించు సమయంలో ఓ కార్తీక దామోదార నీకు వందనాలు. నాచే ఆరంబించబడే కార్తీక వ్రతమును విఘ్నము లేకుండ జరిగేటట్లు చేయమని ప్రార్ధించాలి.

 

10 Best Movies You Can Watch In Theatres This Weekend In Hyderabad

0

Finally, repati nunchi theatres open ippatiki 9 months aipoindi theatre ki poyyi, and mana Nolan mama Tenet movie kuda vastundi repu, of course andaru bookings chesukoni untaru lendi, aside Tenet inka konni cinemalu theatres lo release chestunnaru, aa movies ento mee kosam list istunnam, movie edi aithe emundi bhai, theatre ki chala kaalam taruvatha veltunam aa emotion mundhu anni emotions chinnave…

List Of 10 Movies You Can Watch In Theatres This Weekend In Hyderabad

1) Tenet

1

2) Arjun Reddy

2

3) Come Play

3

4) Dilwale Dulhania Le Jayenge

4

5) iSmart Shankar

5

6) Kanulu Kanulanu Dochayante

6

7) Peninsula

7

8) The New Mutants

8

9) Trolls World Tour

10

10) War

Whatsapp Image 2020 12 03 At 3.59.36 Pm

9 Solid Differences Between Mechanical Mass & CSE Class..”Inthaki Ey Branch Tough ‘O’ Mari”

0

Idhigo, title choosi oorike speed ayipomaakandi… Idhedho Mechanical branch, CSE ki madhya maathrame anukunte chembulo cheyyittinatte… Vishayam ennadhaa ante, ippudu mechanical engineering ante hard students ani, Computer student ante soft ane oka bhavan balangaa manandharilo naatukupoyindhi… Ofcourse Computers lo koodaa untaaru anukondi, kakapothe avarage number theesukunte yekkuva soft ye ani stasticis batti yedho theliyakapoyinaa chepthunnaam anna maata, yenti, theliyakapoyinaa chepthunnaam… Anthe… vishayaaniki vasthe, mechanical kindhaki ee Civil, Metallurgy laanti vaatini consider cheyyandi… Computers group loki ee ECE, EEE, IT ni koodaa alaane… So ippudu maaaadatha ee rendu group la madhya differences gurinchi…

Gamanika: Chaduvuralaku vignapthi… Mukhyangaa Mechanical, Computers ki differences ye sariggaa untaayi kabatti veeti gurinche chebuthunnaa, kaavuna migilina branches ni thakkuva chesinattu assalu feel avvaddhu… Inko vishayam, nenu BTech student ne ayinaa ee rendu branches lo dhenikii chendhina vaadini kaanu ani chukketti marii chebuthunnnaanu.. Namaskaaram, ika sabha modhalu…

1) Ammayilu

Saati magaadigaa mundhu nenu dheeni gurinche prasthaavisthunnaa ani andharikii manavi chesukuntunnaanu… Mechanical group branches lo ammayila karuvu mamoolugaa undadhu… Andharikii thelisina nagna sathyame idhi… Adhe computers lo ayithe ac gadhullo koorchoni pani dhorike branch kabatti kuppalu theppalugaa untaaru…

2) Pyaar

Mari mana mechanical kurrollu aaguthaaraa yenti… Mana dhaggara lenappudu yekkada unte akkadaki povadame kadhaa paddhathi… Vaallu koodaa adhe paddhathilo CSE board mundhu vaalipothaaru, aa branch ammayilaku sight yesthaa koorchuntaaru… Mari mana CSE boys calm ga untaaraa yenti, appatike karchief lu, towel lu, blanket lo yesi marii yesesi ready ga untaaru… Idhi vinna tharuavatha yevarayina sare, Nijamenayyaa Pullarao anaka thappadhu…

3) Studies

CSE vaallaki computer, andhulo codes thone pani… Ee drawings, machines ante vaallaki asalu pattani vishayam… It’s natural re… Alaane mechanical vaallakemo ee computers code choosthe thala thirguthundhi, yeppudo oka sem lo unde aa subject ne naanaa thippalu padi pass avuthaaru… Ika CSE vaallaki itu vaipu pani undadhu gaani, mana Mechanical vaallaki maathram adapaa dhadapaa aa computer pani untundhi ga… Computer yugam ani oorike annaaraa mari…

4) College Adda

Ofcourse meeku thelisindhe… Nenu kotthagaa cheppedhi koodaa yem ledhu… College lo godava ane padham vacchindhi ante andhulo Mechanical vaallu pakkaa unnatte… Kaani CSE vaallaki maathram avi chaalaa thakkuva ga untaayi… Yendhukante vaallu chaalaa busy kadhaa… Yentraa annii mechanical ki favour ga chebuthunnnaav, CSE vaallu koodaa fights ki velthaaru ante velthaaru yendhuku vellaru, kaani yenthamandhi velthaaru..!

5) Extra Circular Activities

Idhigo ikkada andharuu untaaru gaani, paina dance vese vaallu, kindha dance vesevaallu ani rendu rakaalu untaay… Ee paina kindhaa yentraa babu ante, adhe guru, stage painaa, stage kindha… Kindha ayithe Cinema theater lo dance yesinatte untadhi… Peddhagaa laaganule, yevaru stage yekki chesevaallo, yevaru stage kindha kucrheela madhya dance chesevaallu meeku thelusugaa, anesukondi alaa…

6) Courses

Thokkale, manam college lo chadivindhe yekkuva, inkaa special course lu annattu untundhi mechanical mind set… Ammo, special courses, languages antuu ilaa laat sem lo unnappude boledu nerchesukovaali annattu untundhi CSE vaallaki… Yentha vyathyaasam naaradha… Nijaaniki Mechanical vaallaki koodaa untaay gaani, peddha andharuu pattinchukune vishayam kaadhu adhi…

7) Campus Placement

Dheenamma, adhento campus placement unde yedhayinaa college undhante akkada mundhu kamipinchedhi ye Software company ye… Adhi koodaa ee computer group branches lo motthanni jalleda vesi, mechanical lo koodaa first year lo chadivina languages gurinchi thelisinollani koodaa laagesthaaru… Mechanical chadivi software lo job yentraa saami, ni bombay chutney lo na ravva dosa…

8) Jobs

Paina cheppaagaa… Kakapothe placements leni colleges mana dhaggara aaksamlo nakshatraalla bocchudu unnaay… Andharikii placements ravannadhi jagamerigina sathyam kadhaa… So bayataki vellaaka, CSE kurrakaaru, Hyderabad Ameerpet lo padi yevevo nerchesukoni software company laki parigedathaaru… Ika mana mechanical kurrakaaremo yekkada plants unnaayaa, yekkada private company lu untaayo yerukoni join ayipothaaru… Aa searching ki ee searching ki top much thedaa babay…

9) Skillset

Mechanical vaallante marii dhaddhammalu yem kaadhu, college time lone mechanical innovations tho credits kottinollu unnaaru… Mari anthaa Mechanical prapancham mari, machine lenidhe muddha dhigatledhu ikkada… Ika ee computer batch vaallemo codes, avii ivii ani market lo avii ivvii theesukocchi janala mundhu pedathaaru… Inko vishayam Frank ga yenti ante, vaallu work cheyyadam aapeathe ee maanavaali kaasepu alaa sthambinchukupothundhi mari… Bank transaction nundi mobile service varaku pratheedhi vaalla kanureppallo matter ye kadhaa, annii choosukovaali ga mari… Respect ivvandayyaa konchem… Yevadiki undaalsindi aadiki untadhi, anthe gaani ee branch ye goppa, indhulone kaasulu kurusthaayi ani yemii ledhu… Gurthuettuko baaby… Yeraa gopaluuu, yelaa icchaa..!

Ilaa motthaaniki yenno untaay… Idhigo yemannaa pakshapaatham laa kanipisthe oorike idhayipomaakandi… Yedho cheppaa naalugu mukkalu thelisinavi… Idhigo babaji, yentho kontha connect ayye untaaru ga, laagincheyandi…

Jai Jawan – Jai Kisan – Jai Sramik

2020 Hasn’t Been Kind: List Of Legends We Lost This Year From Different Fields

0

2020, ee year gurinchi future lo mana pillalaki raka rakalaga chebutam. Asalu ee year motham daridrame, anyway 2021 nunchi aina antha baga avvali ani korukundam.

But ee year chala fields nunchi greatest legends ni mana nunchi dooram teesuku vellipoindi. Irrfan Khan nunchi SP Balu garu daaka, we lost so many greats.

Just to remember all these greats, we present all the legends that left us from different fields in this year

1) SP Balasubrahmanyam

1

2) Sean Connery

2

3) Irrfan Khan

3

4) Diego Maradona

4

5) Chadwick Boseman

5

6) Rishi Kapoor

6

7) Saroj Khan

7

8) Kobe Bryant

8

9) Sushant Singh Rajput

Whatsapp Image 2020 12 02 At 6.24.58 Pm

We Matched Prabhas’ Latest ‘Salaar’ Look With KGF Dialogues And The Result Is Mass Ka Baap

0

Oka Nuclear Bomb worldwide ga theatres meeda padabothundi…

Aa Nuclear Bomb peru “SALAAR”

KGF director Prashanth Neel combo lo mana Rebel Star cinema and aa first aa tile and ee caption ‘The Most Violent Men… Called One Man… The Most Violent’

Asalki ey range lo goosebumps scenes theatres lo untayo mee ooha ke odilestunna!!!

But one thing about PRABHAS, he is not here to compete he is here to rule.

Radhe Shyam – Love Story, Adipurush – Mythological, Prabhas & Nag Ashwin – Sci Fi Film and now Salaar – Oora Mass Film

Asalki aa line up edaithe undo

So main matter loki vacheddam ala Salaar look lo Prabhas ni chudagane first mind loki KGF dialogues vachesai, aa dialgoues and ee look ee rende mind lu tirugutunnai, anduke KGF dialogues tho Salaar look ni match chesthe kiraak ga untundi anukunna, exact ga kiraak gane undi…

So meeru kuda Ee KGF Dialogue & Salaar first look mash up chuseyandi

1.

6

2.

5

3.

7

4.

2

5.

15

6.

13

7.

3

8.

8

9.

14

10.

9

11.

4

12.

12

13.

17

14.

1

15.

10

16.

11

17.

16

షుగర్ పేషంట్లకు ఔషధంగా పనిచేసే బ్లాక్ రైస్ గురించి తెలుసా ?

0
బ్లాక్ రైస్

కృష్ణ వ్రీహీ లేదా బ్లాక్ రైస్ అనేది ప్రాచీన భారతీయ వరి వంగడం, సుశృత సంహితలో కూడా దీని గురించి ప్రస్తావించారు. అత్యంత ప్రాచీన వరి రకాల్లో కృష్ణ బియ్యం ఒకటి. ప్రాచీన కాలంలో ఈ వరికి మతపరమైన ప్రాధాన్యం ఉండేది. వీటిని యజ్ఞాలు, ఇతర పండుగల్లో ఉపయోగించేవారు. జీవోత్పత్తి వ్యవస్థను పెంపొందించే గుణాలు కృష్ణ బియ్యంలో పుష్కలమని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు.

Health Benefits of Black Riceబ్లాక్ రైస్ వీటిని చూస్తే అన్నం మాడిపోయిందా అనే విధంగా ఉంటుంది. కానీ ఇవి షుగర్ పేషంట్లకు చాలా మంచిది. అంతేకాదు ఇది కొన్ని రకాల వంటల కోసం ప్రత్యేకంగా వాడతారు. సాధారణ రైస్ లాగా నేరుగా తినకపోయినా కొన్ని రకాల ఫుడ్స్ తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు.

Health Benefits of Black Riceబ్లాక్ రైస్ తో మణిపూర్ కి అరుదైన గుర్తింపు లభించింది. చఖావో రకం బియ్యానికి జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది, ఈ రైస్ మనకు కూడా మార్కెట్లో దొరుకుతాయి. కాని దీనిని పెద్దగా మనవాళ్లు ఇంకా అలవాటు చేసుకోలేదు. శతాబ్దాలుగా మణిపూర్లో సాగులో ఉన్న చాఖవో అనే గ్లూటినస్ వరి మంచి సువాసన కలిగి ఉంటుంది.

Health Benefits of Black Riceదీనితో ఏ వంటకం చేసినా మంచి సువాసన వస్తుంది. అయితే ఈ విత్తనాలు కావాలి అంటే మాత్రం మణిపూర్ వెళ్లాల్సిందే. ప్రత్యేకమైన ఫంక్షన్లు కార్యక్రమాలలో మాత్రమే వీటిని వాడుతూ ఉంటారు.

Health Benefits of Black Riceమామూలు బియ్యం కిలో 35-40 రూపాయలకే దొరుకుతుంటే మణిపూర్ చాఖావో కిలో రూ.100 నుంచి 120 మధ్య ఇంఫాల్ స్థానిక మార్కెట్లో లభిస్తుంది.హోల్ సేల్ గా మనకు కావాలి అంటే ఇంఫాల్ నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇక నాణ్యమైన కృష్ణవ్రీహీ బియ్యం కిలో 300 రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. విదేశీ మార్కెట్లలో కూడా బ్లాక్ రైస్ అందుబాటులోకి రావడం గొప్పవిషయం. తొలిసారి ఆస్ట్రేలియాకు పంపిన కృష్ణవ్రీహీ బియ్యం కిలో 850 రూపాయలుగా నిర్ణయించారు.

 

గోదానం చేయడం వలన పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందా ?

0

మన పురాణాలు, శాస్త్రాలు ఎన్నో రకాల దానాల గురించి వాటి వలన కలిగే పుణ్యకర్మల గురించి వివరిస్తున్నాయి. ఒక్కో దానంతో ఒక్కోరకమైన సత్ఫలితం లభిస్తున్నప్పటికీ అన్ని దానాల్లోకి గోదానం విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అంతటి విశిష్టత కలిగిన గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు అంపశయ్యపై వున్న భీష్ముని దగ్గరకు వెళ్లాడు. గోదాన విశిష్టతను తెలపమని కోరడంతో గాంగేయుడు ఒక పురాణ వృత్తాంతాన్ని వివరించాడు.

గోదానంకొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం యజ్ఞ జపాదులు నిర్వహించేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. కానీ అప్పటికే నది పొంగడంతో అవి న‌దీ గర్భంలో కలిసిపోయాయి. తరువాత నదీ తీరానికి చేరుకున్న నాచికేతుడికి అవి కనిపించలేదు. తండ్రి దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. అప్పటికే ఆకలితో వున్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తిచేయాలన్న నిశ్చయంతో వున్నాడు. ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్టరాని కోపంతో నాచికేతున్ని నరకానికి వెళ్లు అని శ‌పించాడు.

గోదానంతండ్రి ఆజ్ఞను పాటిస్తున్నానని చెప్పి నాచికేతుడు కూలిపోయాడు. వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్లిపోయాయి. తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోదించాడు. ఆ మరుసటి రోజు సూర్యోదయ సమయానికి నాచికేతుని ప్రాణం తిరిగి వచ్చింది. పట్టరాని ఆనందంతో కుమారుడిని కౌగిలించుకున్నాడు. రాత్రి ఏయే లోకాలకు వెళ్లింది వెల్లడించమన్నాడు. నాచికేతుడు ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు.

గోదానంఔద్దాలకి మహర్షి నరకానికి వెళ్లమని శాపం పెట్టాడే గానీ చ‌నిపొమ్మ‌ని శాపం ఇవ్వలేదు కనుక నాచికేతున్ని అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెప్పినట్టు నాచికేతుడు తెలిపాడు. అనంతరం నాచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు. తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభీష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొన్న‌ట్టు అతను తెలిపాడు. అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్యతేజస్సులు కలిగిన పుణ్యపురుషులు వుండటాన్ని గమనించాడు. వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో పుణ్యలోకప్రాప్తి కలిగిందన్నాడు.

గోదానంశుభసమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చని చెబుతూ.. మూడు రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయని వివరించాడు. చిన్న వయస్సులో మంచి ఆరోగ్యంతో వున్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో వుండే వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు తెలిపినట్టు నాచికేతుడు తండ్రికి తెలిపాడు. దీని ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.

 

స్ట్రెస్, డిప్రెషన్ గా ఫీల్ అవుతున్నారా అయితే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి

0

పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, గింజలు, పప్పుధాన్యాలను ఆహారంగా తీసుకుంటాం. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలు, త్రుణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు శరీరానికి ఎంతో అవసరం. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, ఉద్యోగ బాధ్యతలు తీవ్రమైన ఒత్తిడికి కారణమవుతున్నాయి. కానీ ఈ ఒత్తిడి నుంచి బయటపడటం మన చేతుల్లోనే ఉంది. నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లను ఒక దశకు వచ్చేసరికి మార్పులు చేసుకోవాలి. మహిళలు తప్పనిసరిగా సమతుల ఆహారం తీసుకోవాలి. ఒత్తిడికి గురయ్యేవారిలో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉంటున్నారు.

డిప్రెషన్సాధ్యమైనంత వరకూ ఇంటి ఆహారాన్నే తింటే శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యమూ సొంతమవుతుంది. బర్గర్లు, పిజ్జాలు, మాట్ డాగ్స్ వంటి బేకరీ పదార్థాలు తినని వారితో పోలిస్తే తరచూ తీసుకునే వారిలో యాభై ఒక్క శాతం మంది మానసిక ఆందోళనకు గురవుతారు. దాంతో పాటు శారీరక చురుకుదనం కూడా తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నెలలో ఒకటి రెండు సార్లకు మించి బేకరీ పదార్థాలను తీసుకోకపోవడమే మేలు. అదే సమయంలో వ్యాయామానికీ ప్రాధాన్యం ఇస్తే ఎటువంటి ఒత్తడి ఉండదు. మరి ఆహార విషయంలో ఒత్తిడిని పారద్రోళే ఆహారాలేంటో చూద్దాం.

బంగాళ దుంప:

బంగాళ దుంపబంగాళ దుంపలో జింక్‌, విటమిన్‌ సి రోగని రోధకశక్తిని ఇనుమడించి మనస్సును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

బ్లూబెర్రీస్:

బ్లూబెర్రీస్బ్లూబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతే కాదు ఇందులో ఉన్న విటమిన్ సి ఒత్తిడితో పోరాడే ఔషధ గుణాలు అధికంగా ఉన్నందు వల్ల, ఒత్తిడిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తంలోని షుగర్ లెవన్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

టర్కీ చికెన్:

టర్కీ చికెన్టర్కీచికెన్ లో అమినో ఆసిడ్స్ మరియు సెరోటినైన్ ఆనందగా ఉండేందుకు ఉపయోగపడే కెమికల్స్ ఉంటాయి. సెరోటొనైన్ మనస్సును ప్రశాంత పరచడమే కాకుండా తాజాగా పీల్ అయ్యేలా చేస్తుంది.

ఆస్పరాగస్:

ఆస్పరాగస్ఆస్పరాగస్ లో ఫోలిక్ ఆసిడ్స్ అధిక శాతంలో ఉంటాయి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. మీ శరీరం ఒత్తిడికి గురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనస్సుపై ప్రభావం చూపిస్తుంది.

బీఫ్:

బీఫ్బీఫ్ లో ఉన్న విటమిన్ బి మరియు జింక్ ఒత్తిడికి కారణం అయ్యే లక్షణాలను ధరిచేరనివ్వవు. అయితే ఇది వండే విధానంలో తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ఆరోగ్యానికి మంచిది.

బొప్పాయి:

బొప్పాయికెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం. దీనిలో ఉండే కెరోటిన్‌ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే ఒత్తిడి తగ్గిపోతుంది.

కమలాఫలం:

కమలాఫలంవ్యాధి నిరోధక శక్తిని పెంచగలిగే ఫలాలలో కమలాఫలం కూడా ఒకటి. అత్యధికంగా కమలాల్లో లభించే సి విట మిన్‌ వల్ల ఒత్తిడి ప్రభావం చూపే హార్మోన్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది.

అరటిపండు:

అరటిపండుదీనిలో ఉండే అధిక క్యాలరీలు, మెగ్నీషియం టెన్షన్‌ను సులభంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపండు ఎంతో మేలు చేస్తుంది.

చాకోలెట్:

చాకోలెట్వీటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్‌ (పిఇఎ) ఎండార్ఫిన్‌ స్థాయిల్ని తొలగించి సహజసిద్దమైన యాంటీ – డిప్రెస్సెంట్‌గా పనిచేస్తుంది.

పాలు:

Milkపాలలోని ల్యాక్టోస్‌ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి. పెరుగులోని విటమిన్‌ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది.

గోధుమ:

గోధుమగోధుమలో ఉండే ఐరన్‌ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది. నూతనోత్తేజం కలిగిస్తుంది.

ఆప్రికాట్:

ఆప్రికాట్ఆప్రికాట్ ఒక డ్రై ఫ్రూట్, ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో క్యాలరీస్ తక్కువ. ఆప్రికోట్‌లోని కెరోటిన్‌ ఒత్తిడిని తగ్గిస్తుంది.

 

Presenting You 8 Major Differences Between Engineering and Degree

0

“Chadhuvulandhu Engineering chadhuvu veryaa, all student lokam, vinu mama” annadu oka pandipoyina BTech vidyarthi… “Graduation landhu Degree lessa” oka senior degree student… Matter arthamayyindhi kadhaa… Vadhanalu yelaa unnaa ultimate ga andharuu graduates ye kadhaa… Naakendhuko ee roju ee rendu dhaarulanu compare chesesthuu postmartem cheyyaalani undhi… Mari anukunnadhe thadavugaa ilaa article modhalupettesaa… Inkendhuku alasyam..! Nijamenayyaa Pullarao, alasyam yendhuku, let’s move..!

1) Kaalam

Hu… BTech naalugellu chadivithe yenti, Degree moodellu chesthe yenti, renduu under graduation ye kadhaa… Equal kadhaa… Kakapothe okati engineering, rendodhi anything… Present unna situation lo renduu equal ye bhayyaa… Engineering vaallake one year extra bokka… Yendhuku brother alaa antaav ani antaaraa..? Kindha cheppe points choosthe arthamavuthundhile…

1

2) Classy

Engineering vaallu ante posh batch annattu, vaallu peddha engineering colleges lo chaduvuthaaru ane build up ippatikii konni areas lo undhi kadhaa Murthy gaaru… Degree ante thakkuva ga, engineering ante yekkuva ga annattu undedhi okaanoka time lo… Nijam maatlaadukunte, yekkada jarigevi akkada untaay, renduu okate bongulodhi…

2

3) Kalaashala

Okappudu Degree college le undevi, engineering college lu thakkuva… Ippudu engineering college lu Degree colleges ni dhaatesi kuppalu theppalugaa unnaay…. Ee campus lu, bokkaa boshaanam adhanthaa yeppudo poyindhi, ippudu anthaa commerical yugam…

3.

4) Kala

Chadhive chaduvuki kala dhobbindhi masteruu… Okappudu Degree chadivithe goppagaa choosevaallu… Konnaalla tharuavatha engineering chesaaru, engineer ante mahaa goppagaa gowravinchevaallu… Kaani ippudu adhanthaa poyindhi… Karma…

4

5) Kalagaapulagam

Engineering chadivina vaallu engineer lu avvaali gaani, ee groups, banks laanti jobs meedha padathaarenti sir… Degree vaallu vaalla group ki related job vethukkovadam maanesi vaallu koodaa software antaaru yetandi babu… Yentoraa saami, yevaru yem cheyyaalo adhi thappa, annii chesthunnaaru…

5

6) Kaam

Degree ayithe government jobs, engineering ayithe software annattu ayipoyindhi paristhithi… Adhenti Prakash gaaru, Mechanical chadivi koodaa campus interview lo software job kodathaaru, yemannaa ante C language, English vacchu antaaru… Ika Degree ante, frank ga chappaali ante asalu Degree lo bocchedu group lu unnaayi, vaatiki related jobs koodaa untaay… Kaani, “Degree chadivaadaa, ayithe next government or bank job trails yegaa” ani anukuntunnaaru bayata… Alaa settle chesesaaranthe…

67) Competition

Ye graduation ayithe yenti, ye group/branch ayithe yenti… Anthaa okate dhaari, andharuu okate paddhathi… Indhulo asalu oohaku koodaa andhani vishayam yentraa ante, ye Degree-Engineering students duo yekkada meet avuthundho ani… Ante ee madhya anthaa okate ani feeling vacchesindhi ga, so veelladharuu okate chota pani chese scene koodaa start ayyindhi… Veru veru fields lo undaalsina vaallu, okate field lo undi competitors ayyaaru… Vichitram…

78) Kaane ke liye

Manishi brathikedhi jaanedu potta kosam, mooredu batta kosam annattu, manollu graduates ayinaa koodaa konni saarlu thappaka inter qualification jobs ki koodaa apply chesesthaaru… Alaane degree ane chaduvu oka gate pass koodaa ayipoyindhi… Ye interview ki ayinaa vellaali ante Degree undhaa ane prasna mana mundhu untundhi… Anthe adho gate pass… Mallii adhi mana chadivina dhaaniki related ayi undakkarledhu, yedhyinaa kavocchu, degree unte chaalu…

8Ilaa untaay inkaa yevo… Ika Degree, Engineering colleges differences ayithe inkaa boledu rayocchu… Avi common ayipothaay kadhaa ane idhi… Untaa ika…

Jai Jawan – Jai Kisan – Jai Sramik

శ్రీకాళహస్తి ఆలయ విశేషాలు మరియు దాని విశిష్టత ?

0

శ్రీకాళహస్తిశ్వరస్వామి స్వయంభువు,శ్రీ అనగా సాలె పురుగు,కళా అనగా పాము,హస్తి అనగా ఏనుగు,ఈ మూడు జంతువులు శివభక్తి వలన కైవల్యం పొంది శివునిలో గలసిపోయినవి. అందువలన ఇచ్చట స్వామి వారికీ శ్రీ కాళహస్తిశ్వరుడు అని ఈ పురముకు శ్రీ కాళహస్తి అనియు పేరు వచ్చింది.

శ్రీకాళహస్తిసాలె పురుగు- శివ కైవల్యం:

కృతయుగంలో సాలె పురుగు తన శరీరం నుంచి వచ్చే సన్నని దారంతో కొండఫైనున్న శివునికి గుళ్ళ గోపురాలు ప్రాకారములు కట్టి శివునిపూజిస్తుంది. ఒకనాడు శివుడు పరిక్షింపదలచి అక్కడ మండుచున్న ధీపములో తగిలి సాలీడు రచించిన గుడి గోపురములను తగలబెట్టినట్టు
చేసాడు.

శ్రీకాళహస్తిఇది చుసిన సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రతక్ష్యమై దాని భక్తికి మెచ్చి వరము కోరుకోమంటాడు. అపుడు సాలీడు మరల తనకు జన్మ లేకుండా చేయమని కోరుకుంటుంది.అందుకు శివుడు అంగీకరించి సాలిడుని తనలో ఐఖ్యమైనపోవునట్లు చేసాడు.ఈ విధముగా సాలీడు శివకైవల్యం పొంది తరించింది.

నాగు పాము-ఏనుగు-శివారాధన చేసి తరించుట:

ఏనుగు పాముల కథ త్రేతాయుగమున జరిగినది. ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి రోజు శివలింగానికి పూజ చేసి వెళ్ళేది. అదే సమయంలో ఒక ఏనుగు కూడా ఆ శివలింగానికి పూజచేసి వెళ్లిపోయేది. ఏనుగు స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు,పుష్పములు, బిల్వదళములు తెచ్చి,పాము సమర్పించిన మణులను త్రోసివేసి,తాను తెచ్చిన నీటితో అభిషేకం చేసి పుష్పాలతో అలంకరించి పూజించి వెళ్ళేది. మరునాడు ఉదయం పాము వచ్చి చూసి తాను పెట్టి వెళ్ళిన మణులను గానక వాటికి బదులు బిల్వములు,పుష్పములు పెట్టి ఉండటం చూసింది. అప్పడు పాము మనస్సులో చాలా బాధపడింది.

శ్రీకాళహస్తికొంత కాలము వరకు పాము పెట్టిన మణులను ఏనుగు ,ఏనుగు ఉంచిన పుష్పాలను పాము శుబ్రపరచి తమ తమ ఇష్టనుసరముగా పూజచేసి ఈశ్వరుని పూజించేవి. ఒక రోజు పాము విసుగెత్తి తన మణులు త్రోయబడి ఉన్నందుకు కోపానికి గురై ఇలా జరగటానికి కారణము తెలుసుకోవాలని ప్రక్కనే ఉన్న పొదలో దాగి ఉంటుంది. ఆ సమయంలో ఏనుగు వచ్చి మణులను తోసేసి పూలతో ,బిల్వ పత్రాలతో పూజిస్తుంది. అది గమనించిన పాము కోపముతో తన శత్రువుఅయిన ఏనుగు తొండములో దూరి కుంభస్టలమున దానికి ఉపిరి ఆడకుండా అడ్డుపడుతుంది. ఈ భాధకు ఏనుగు తాలలేక ఈశ్వర ధ్యానంతో తొండముతో శివలింగమును తాకి శిరస్సును గట్టిగా రాతికేసి కొట్టుకొని మరణిస్తుంది.

శ్రీకాళహస్తిరాతికేసి కొట్టుకోవడం వలన ఏనుగు కుంభస్థలంలో ఉన్న పాము కూడా చచ్చి బయటపడింది. ఆ విధంగా ఇద్దరు తమ తమ నిజ స్వరూపంతో రుద్ర గణములుగా మారి స్వామిలోపల ఐక్యమైపోయారు. ఈ స్మృతి చిహ్నంగా కాళము పంచ ముఖ పాము ఆకారంలో తల భాగంలో ఏనుగు సూచకముగా రెండు దంతములను,సాలె పురుగు అడుగు భాగంలోనూ,తన లింగాకృతిలో ఐక్యం చేసుకొని శివుడు శ్రీ కాళహస్తిశ్వరుడుగా ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రంక `శ్రీ -కళా- హస్తి అని పేరుతో ప్రసిద్ధి చెందింది.

 

చర్మం కాంతివంతంగా అందంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

0

ఆరోగ్యమైన, అందమైన చర్మాన్ని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ర‌క ర‌కాల క్రీములు రాస్తూ, ఫేస్ ప్యాక్‌లు వేసుకుంటూ మెరుపులు అద్దుతుంటారు . అలా కాకుండా ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. చ‌ర్మంపై ఏర్పడే మచ్చలు మొటిమలు పోయి ఆరోగ్యంగా కనిపించాలంటే ఏం తినాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

health tips for shiny skinపాల‌‌‌‌కూర‌‌:

health tips for shiny skinవిటమిన్‌‌– ఎ, బీటా కెరటిన్‌‌లు పాల‌‌కూర‌‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా నిగనిగలాడేలా చేస్తాయి. పాల‌‌కూర‌‌ను రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో పాలకూర బాగా పనిచేస్తుంది.

క్యారెట్స్:

health tips for shiny skinవిటమిన్ –ఎ అధికంగా ఉండే క్యారెట్స్ తినడం వల్ల కళ్లు, చర్మానికి చాలా మంచిది. వీటిని రోజూ తినడం వల్ల ఇన్‌‌ఫెక్షన్లు దరిచేరవు. ఇందులో ఉండే బీటా కెరటిన్‌‌ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా,కాంతివంతంగా ఉంచుతుంది.

విటమిన్ బి–6:

health tips for shiny skinవిటమిన్‌‌–బి6 ఎక్కువగా ఉండే క్యారెట్‌‌, కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్‌‌నట్స్, అవకాడో హార్మోన్లలోని తేడాల వల్ల వచ్చే మొటిమలను నివారిస్తాయి. అలాగే హార్మోన్ల సమతుల్యత సరిగా జరిగేలా చూసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

బొప్పాయి:

health tips for shiny skinబొప్పాయిలో విటమిన్– సి, ఇ , బీటాకెరోటిన్ అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌‌గా తీసుకోవడం వల్ల చర్మంపైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ దూరమై అందంగా మారతారు.

ఒమేగా త్రీ ఫ్యాటీ:

health tips for shiny skinచేపలు, సోయా ఉత్పత్తు ల్లో ఒమెగా– 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషన్ లాంటివి దూరమవుతాయి. చర్మం తాజాగా నిగనిగలాడుతుంటుంది. తాజా చేపల్లో ఫ్యాటీ యాసిడ్స్‌‌ ఎక్కువ. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మాన్ని మెరిపిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్స్:

health tips for shiny skinయాపిల్, అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్‌‌ ఉంటాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ–రాడికల్స్‌‌ను తొలగిస్తాయి. అందుకే చర్మం యవ్వనంగా ఉండాలంటే ఈ పండ్లు తినాలి. అలాగే ప‌‌ల్లీలు, బీట్ రూట్‌‌, కివీ పండ్లను త‌‌ర‌‌చూ తింటే చ‌‌ర్మ సౌంద‌‌ర్యం మెరుగు ప‌‌డుతుంది.

బాదం పప్పు:

health tips for shiny skinవిటమిన్‌‌– ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదం ప‌‌ప్పుల్లో పుష్కలంగా ఉంటాయి. రోజూ 4బాదం పప్పుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మంచిది. అలాగే కీరదోసకాయను తొక్కతో తినడం మంచిది. అందులోని విటమిన్ –ఎ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు కీరదోస కాయ ముక్కల గుజ్జును ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు దూరమవుతాయి.

టొమాటోలు:

health tips for shiny skinటొమాటోలో విటమిన్– ఎ, కె, బి1, బి3, బి5, బి6, బి7 ఫుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే టొమాటోలో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలు కూడా టొమాటోల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలుష్యం, సూర్య కిర‌‌ణాల నుంచి చర్మాన్ని ర‌‌క్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి.

డార్క్ చాక్లెట్స్:

health tips for shiny skinయాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే డార్క్చాక్లెట్స్ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.అలాగే ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్‌‌లో పీచు పదార్థాలు ఎక్కువ. ఇవి చర్మాన్ని బిగుతుగా చేసి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

 

18 రోజుల కురుక్షేత్ర యుద్ధం యొక్క రహస్యాలు

0

మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు, ద్రుపద మహారాజు, విరాటరాజు మరియు ఏడు అక్షౌహిణీల సైన్యం, కౌరవుల పక్షాన బీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు మొదలగువారు మరియు పదకొండు అక్షౌహిణీల సైన్యంతో యుద్ధాన్ని ప్రారంభించారు. రోజుకొక వ్యూహం నిర్మించి ఆ ఆకారంలో తమ సైన్యాలను నిలిపేవారు.

Kurukshetraఅందులో కొన్ని ప్రముఖమైన వ్యూహాలు:

1. క్రౌంచారుణ వ్యూహం : పాండవ సేనాని ద్రుపద రాజు కుమారుడు దృష్టద్యుమ్నుడు క్రౌంచపక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.

2. గరుడ వ్యూహం : యుద్ధం మొదలైన మూడవ రోజున భీష్ముడు గరుడపక్షి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించాడు. దీనినే సువర్ణ వ్యూహం అని కూడా అంటారు.

Kurukshetra3. శకట వ్యూహం : మహాభారత యుద్ధ పదకొండవ రోజున ద్రోణుడు బండి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించి సైన్యాన్ని నిలిపి తాను కేంద్ర స్థానంలో నిలబడ్డాడు.

4. చక్ర వ్యూహం : పదమూడవ రోజు ద్రోణుడు ఈ వ్యూహాన్ని రచించాడు. దీనినే పద్మవ్యూహం అని కూడా అంటారు. చక్రాకారంలో సైన్యాన్ని నిలుపుతారు. దీనిని చేదించడం అందరికీ సాధ్యం కాదు. అభిమన్యుడు ఈ వ్యూహంలో ప్రవేశించినా బయటకు రాలేక కౌరవుల మోసానికి బలయ్యాడు.

Kurukshetra5. మకర వ్యూహం : ఐదవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మించి మకరాకారంలో సైన్యాన్ని నిలిపి యుద్ధరంగంలో చెలరేగిపోయి పాండవులకు చాలా నష్టాన్ని కలిగించాడు.

6. బార్హస్పత్య వ్యూహం : పదిహేడవ రోజున బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహాన్ని పన్నుతాడు.

7. శృంగాటక వ్యూహం: ఎనిమిదవ రోజు భీష్ముని వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని నిర్మించి త్రికోణాకారంలో సైన్యాన్ని నిలుపుతారు.

Kurukshetra8. శ్యేన వ్యూహం: ఈ వ్యూహాన్ని కూడా భీష్ముడి మకర వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు డేగ ఆకారంలో నిర్మించాడు. ఐదవరోజు నిర్మించిన ఈ వ్యూహాన్ని డేగ వ్యూహం అని కూడా అంటారు.

9. అర్ధచంద్ర వ్యూహం : మూడవ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు అర్ధచంద్ర వ్యూహాన్ని నిలుపుతాడు.

10. మండల వ్యూహం : ఏడవ రోజున భీష్ముడు మండలాకారంలో వ్యూహాన్ని రచించి కౌరవ సైన్యాన్ని నిలుపుతాడు.

Kurukshetra11. మండలార్ధ వ్యూహం : పన్నెండవ రోజు ద్రోణుడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా ధర్మరాజు మండలార్ధ వ్యూహాన్ని నిర్మించి పాండవ సేనను నిలుపుతాడు.

12. వజ్ర వ్యూహం : ఏడవ రోజున భీష్ముడు కౌరవ సేనను మండల వ్యూహంలో నిర్మించగా ధర్మరాజు పాండవ సేనతో వజ్ర వ్యూహంలో రచిస్తాడు.

13. సూచీ ముఖ వ్యూహం : ఆరవరోజు దృష్టద్యుమ్నుడు పాండవ సేనను మకర వ్యూహంలో నడిపింపగా భీష్ముడు కౌరవసేనను క్రౌంచ వ్యూహంలో నిలుపుతాడు. కాని ఈ రెండు వ్యూహాలు భంగపడదంతో అభిమన్యుడు సూచీ ముఖ వ్యూహాన్ని రచించి సూది ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.

Kurukshetra14. వ్యాల వ్యూహం : నాలుగవ రోజు భీష్ముడు కౌరవ సేనను చుట్ట చుట్టుకున్న పాములా నిలుపుతాడు. ఇది చాలా కష్టమైన వ్యూహం. ఈ వ్య్హూహం ద్వారా సైన్యాల స్తంభనను అంచనా వెయ్యడం కష్టం.

15. సర్వతోభద్ర వ్యూహం : తొమ్మిదవ రోజు భీష్ముడు సైన్యాన్ని సర్వతోభద్ర వ్యూహంలో నిలిపాడు.

16. మహా వ్యూహం : భీష్ముడు రెండవ రోజు ఈ వ్యూహాన్ని నిర్మించి అజేయుడై శత్రు సైన్యాన్ని హడలగొట్టించాడు.

 

11 Best Books & Novels To Read In India

0
BEST-NOVELS-TO-READ

“That’s the thing about books. They let you travel without moving your feet”. Jhumpa Lahiri Interesting how books can influence our lives. Isn’t it? India has a novel abstract history and custom that stretches outback more than 3,000 years. Indian English writing may have a moderately shorter account, yet no book lover should miss out whether rich with grant winning and widely praised show-stoppers. To kick your perusing venture off, we’ve gathered together top-notch books by writers from India that have enormously affected the course of the nation’s writing.

  • All roads lead to ganga, Ruskin Bond

All roads lead to gangaRuskin Bond’s affection for the Himalayan life comes into full power in this book pulls at everybody’s heartstrings to visit the Himalayas. Correctly worded, Ruskin shows us the extraordinary excellence and the quality of the slopes and Ganga, India’s holy waterway, through this epic romantic tale. He portrays the straightforward life up in the mountains and has woven in his nostalgic anecdotes about the individuals he has gotten during his coexistence there. The spot has a lot of change since the time he composed this book, however. Nowadays, to observe and encounter what he has written, you tragically need to go outside these urban areas and towns.

  • The god of small things, Arundhati Roy

The god of small thingsArundhati Roy is an ace at catching human feelings and hitting you with her words. This is a tale about twins from a little town in Kerala deprived of their youth with horrendous deaths, pushing the reader to explore their emotional depth. The Syrian Christian existence of the people there, the smell of the wood fire, and fish curry is all honestly woven into a perplexing plot around the caste system and communalism. It is no big surprise this stunning novel won the Man Booker Prize in 1997.

  • The great Indian novel, Shashi Tharoor

The great Indian novelIn this novel, Tharoor has breathtakingly reworked the Mahabharata. He has contrasted the political figures of India and the characters of the Mahabharat. It’s essentially a retelling of the Indian epic; however, it falls in the political parody domain by attracting matches with significant occasions India’s political history during the opportunity development and the post-freedom time.

  • Train to Pakistan, Khushwant Singh

Train to PakistanThis chronicled Indian book by Khushwant Singh was broadly worshipped during its delivery in 1956 for carrying a human point of view to the parcel of British India into India and Pakistan. While most parcel records at the time centred around political angles, Singh described the occasion as far as human misfortune and repulsiveness.
It is the late spring of 1947. Be that as it may, Partition doesn’t mean a lot to the Sikhs and Muslims of Mano Majra, a town on India and Pakistan’s outskirts. At that point, a neighbourhood cash moneylender is killed, and doubt falls upon Juggut Singh, the town criminal who is infatuated with a young Muslim lady. At the point when a train shows up, conveying the assortments of dead Sikhs, the town is changed into a combat zone, and neither the judge nor the police can stem the rising tide of savagery. In clashing loyalties, it is left to Juggut Singh to make up for himself and recover harmony for his town. First distributed in 1956, Train to Pakistan is an example of current Indian fiction.

  • Wise or Otherwise, Sudha Murthy

8 1 (3)It is an assortment of fifty vignettes of Murthy’s natural occurrences, which had a significant impact on her, both in great and terrible ways. After reading this book, the readers will locate another approach to take a gander at life and individuals. This book will allow them to acknowledge how little episodes can be a fateful opening to comprehend people’s horde nature alongside their ideals and indecencies. Simultaneously, a reader can understand how every second and the little occurrences throughout our life can be so inspiring and enhancing on the off chance that we give them our consideration and thought only as the author did.

  • India After Gandhi, Ramachandra Guha

India After GandhiYou know the tale of the introduction of the country of India. In any case, do you know the story of the battles and difficulties that the government needed to experience while growing up? Do you know the people who sustained the framework and this country with their experience and information to give it its shape? The book continually looks at India’s possibility as an investigation in the case of the majority rules system, prophesied at standard stretches to be damned, however, to rekindle back with more apparent fearlessness and quality. It causes us to trust in the intensity of the majority rules system and accomplish a lot of more noteworthy statures.

  • A Suitable Boy, Vikram Seth

A Suitable BoyThis is an account of ordinary people set in a post-independence Indian background searching for an appropriate kid for Lata’s marriage. Lata is 19, and she has faith; she believes in falling in love first. There’s the quest for marriage and satisfaction as well as sorrow and dissatisfaction, which is widespread. There was no feeling left unexplored through its rambling 1474 pages, and no character left misconstrued.

  • The Whit Tiger, Arvind Adiga

The Whit TigerIt is a social editorial on the impacts of India’s massive gap between the wealthy and the poor. This vast gap makes shakiness that frequently prompts ethical quality being undermined for singular addition. The poor are edgy to such an extent that they are happy to do nearly anything to make it out of neediness. Simultaneously, the rich are so far eliminated from the helpless predicament that they become desensitized and corrupt. The perspective from which the story is told, the utilization of humour, the examples of symbolism, and the novel’s finish stress the dissimilarity in riches and the impropriety that outcomes.

  • Ezham Ulagam (seventh world), Jaya Mohan

Ezham UlagamThe tale about the obscure, dim existence of Handicapped Beggars. The story discusses their life, bliss, festivities, torments, love. The author made each character with unique consideration. The operator who deals with these individuals doesn’t even think about them as people. He notices them as “Uruppadigal”(items). But these individuals overlooking every one of their distresses, living as a joint family, live in their separate world. We have to cross numerous difficult pages in this novel. For the drive of a cop, a youngster is sent to him. Another conceived youngster has been put on early afternoon sun, so the people get leniency and give cash. The impaired individuals they think not any more valuable are given over to some different cash specialists.

The peak of the novel had a profound effect. Throughout the story, the woman named Muthammai had to have a sexual relationship with physically disabled people to bring forth genuinely tested youngsters. She had to do this on multiple occasions. In the end, she was again compelled to have sex with a drunk disabled person. While the contacts her, she saw his hand and began yelling, “OTTRAI VIRAL, OTTRAI VIRAL”(one finger, one finger). He was one of her impeded youngsters who were isolated from him, and she understood it. Muthammai was in a condition to have intercourse with his child to part with a debilitated youngster. The tale closes with this.
This story is adapted to the movie “NAAN KADAVUL”(Tamil) “NENE DEVUDNI” (Telugu) by Director Bala, which earned him a National Award.

  • The Argumentative Indian, Amartya Sen

The Argumentative IndianThe Argumentative Indian is a book composed of Nobel Prize-winning Indian market analyst Amartya Sen. It is an assortment of papers that examine India’s history and character, zeroing in on the conventions of open discussion and intellectual pluralism. Martha Nussbaum says the book “exhibits the significance of open discussion in Indian customs for the most part.”
The Argumentative Indian has united a choice of writings from Sen that plot the need to comprehend contemporary India in the light of its long, contentious custom. The comprehension and utilization of this contentious convention are fundamentally significant, Sen contends, for the accomplishment of India’s popular government, the protection of its mainstream legislative issues, the expulsion of imbalances identified with class, rank, sexual orientation, and network, and the quest for sub-mainland harmony.

  • The Shiva Trilogy, Amish Tripathi

The Shiva TrilogyThe Shiva Trilogy is the story of the extraordinary man whose adventures 4000 years ago are recollected today as the Mahadev’s legends, the God of Gods. It is chronicled through three books, The Immortals of Meluha, The Secret of the Nagas, and The Oath of the Vayuputras.
The occupants of that period called it Meluha – a close preface domain made numerous hundreds of years sooner by Lord Ram, one of the best rulers who lived.
This once proud realm and its Suryavanshi rulers face extreme dangers as its essential waterway, the respected Saraswati, is gradually drying to the termination. They likewise face destroying fear-based oppressor assaults from the east, the place known for the Chandravanshis. To aggravate the issues, the Chandravanshi seems to have aligned with the Nagas, a segregated and evil race of twisted people with shocking military aptitudes.

The paramount trust in the Suryavanshis is an old legend – ‘ When insidious arrives at an immeasurable scope when all appears to be lost when your enemies have won, a saint will rise.’
Is the harsh slashed Tibetan outsider Shiva that legend? Also, does he need to be that legend by any means?
Attracted abruptly to his fate, by obligation just as adoration, will Shiva annihilate evil? These questions are replied in Amish Tripathi’s fiction/folklore set of three of Shiva, the straightforward ancestral man whom the legend turned him into a divine being.

Also Read: OTT Movies Which Released During The Pandemic & Deserve Theatrical Release

క్రికెట్ కలిపిన ప్రేమ కథ: Love Story Of The Australian-Indian Couple Who Went Viral

0

India may have lost the One-Day International series to Australia. But Indian man Dipen Mandaliya and his iconic proposal has won hearts all over.

Mandaliya, who hails from Bengaluru moved to Australia four years ago. He stayed in sydney for two years and then moved to Melbourne.

When he moved to Melbourne, Rose happened to be the previous tenant of the house he had rented.

As Rose happened to be the previous tenant of the house, he received letters and mail addressed to her and so he looked for her on Facebook and reached out to her. That’s how they met.

Rose hails from Western Sydney and works as a health and wellbeing promotion worker in Melbourne.

Both are die-hard cricket fans. The first time they met, they talked so much about cricket.

Rose says “We hit it off quite quickly. Cricket bonded us”

As they both are avid cricket fans, he thought it was the right occasion [proposing at India vs Australia game] as they both love cricket

Ezgif.com Gif Maker (2)And he had planned this weeks in advance and kept it a surpirse.

He says

““I reached out to the Sydney Cricket Ground and told them about my plan to propose during the game and that it would be great to receive their support, and to my surprise the Sydney Cricket Ground officials responded positively and they said, we should do it after the 20th over. They told me all cameras will be on me.”

“And he was a bit nervous to propose in front of 25,000 people.”

“When the match started, he was continuously thinking about how it will go. And he Never thought it will go viral like this, and he didn’t inform anything about this to both the families and they were surprised and happy when the moment happened”

Rose about this iconic Love proposal

“I was so overwhelmed but in a good way. It was beautiful. I loved the whole thing,”

Rose, last year travelled to India to celebrate Diwali with Dipen’s family.

The couple is now looking forward to their wedding.

Fb Img 1606826089022

This Short Story About Infosys Sudha Murthy Shows The World Needs Kindness More Than Ever

0
Sudha Murthy

బెంగళూరుకు వెళ్తున్న రైలు, అందులోనూ భయంకరమైన రద్దీతో నిండి ఉంది. సెకండ్ క్లాస్ బోగీలో ఒక పదమూడేళ్ళమ్మాయి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీ చెక్ చేస్తుండగా పట్టుబడింది. ఆ పిల్లను అనకూడని మాటలూ అని వచ్చే స్టేషన్లో దిగిపొమ్మని కటువుగా చెప్పాడు టీసీ.

ఇంతలో అదే బోగీలో ప్రయాణిస్తున్న సుధామూర్తి గారు ఈ సన్నివేశాన్ని చూశారు.

“అంతా చూస్తూనే ఉన్నానండి. ఉన్నట్టుండి ఇలా మధ్యలో ఆ పిల్లను దిగిపొమ్మంటే ఎలా చెప్పండి. ఈ రైలు ఎక్కడి వరకూ వెళ్తుందో అక్కడిదాకా ఈ పిల్లకు టిక్కెట్ ఇవ్వండి. జరిమానాతోపాటు డబ్బు నేనిస్తాను” అని అన్నారు సుధామూర్తి గారు

ఇలాంటి వాళ్ళ పట్ల జాలి , దయా వంటివి చూపకూడదు, ఇవాళ మీరు ఇలా సాయం చేస్తే ఇదే వీళ్ళకి అలవాటు అయిపోతుంది అని టీసీ సుధామూర్తి గారితో వాదించాడు.

అయినా సుధామూర్తి గారు ఇవేమీ పట్టించుకోకుండా చిరునవ్వుతో ఆ అమ్మాయికి టిక్కెట్ తీసిచ్చి, ఆ పిల్లను దగ్గరకి తీసుకొని ఎక్కడి నుంచి వస్తున్నావని,ఎవరూ ఏమిటి అనే వివరాలు అడిగారు.

“అమ్మ చనిపోయాక నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు, నా సవతి తల్లి మా నాన్న బతికున్నత వరకు నన్ను బాగానే చూసుకుంది. ఈ మధ్య నాన్న చనిపోయారు అప్పటి నుంచి ఆమె నన్ను చిత్రహింసలు పెడుతుంది, అవి తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయి ఈ రైల్ ఎక్కేశాన” అని ఆ అమ్మాయి చెప్పింది

సుధామూర్తి గారు ఆ అమ్మాయి చెప్పిన దానిని అంతా ఓపిక గా విన్నారు. ఇంతలోనే బెంగళూరు స్టేషన్ దగ్గర రైలు ఆగింది.

సుధామూర్తి గారు ఆ పిల్లని తనతో పాటు కార్ లు యెక్కించుకొని, దార్లో తన మిత్రుడు నడుపుతున్న అనాథాశ్రమానికి కారును మళ్ళించింది. అక్కడ మిత్రుడితో ఆమ్మాయి విషయం చెప్పి ఆమె మిత్రుడికి థాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు.

ఆ అమ్మాయి అనాధశ్రమంలో చక్కగా చదువుకొని ఒక పెద్ద కంపెనీ లో ఉద్యోగం సాధించింది.

కన్నడ వాళ్ళు అమెరికా లో ఒక ప్రోగ్రాం కి సుధామూర్తి గారిని ఆహ్వానించారు. ఆ ప్రోగ్రోమ్ కోసం అమెరికా వెళ్ళిన సుధామూర్తి గారికి అవసరమైన పనులు అన్నిటిన్ని ఒక అమ్మాయి దగ్గర ఉంది చూసుకుంటున్నారు. ఆఖరికి సుధామూర్తి గారి లాడ్జింగుకి కట్టాల్సిన బిల్లు ని కూడా ఈ అమ్మాయినే కట్టేశారు. ఇదే విషయం కౌంటర్ వాళ్ళు సుధామూర్తి గారికి చెప్పినప్పుడు

“ఎవరా అమ్మాయి? చెప్పగలరా? ” అని సుధామూర్తి గారు అడిగారు

ఇంతలో ఆ అమ్మాయే అక్కడికి రాగా, సుధామూర్తి గారు “మీరెందుకమ్మా నా బిల్లు కట్టారు” అని అడగ్గా

ఆ అమ్మాయి ఒక్కసారి రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీకి దొరికిపోయిన క్షణం నుంచి ఇప్పుడు బిల్లు కట్టడం దాకా తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని సుధామూర్తి గారి కళ్ల ముందు వుంచి, ఆ పిల్ల తానేనని చెప్పింది.

ఆ పిల్లను చూసినా సుధామూర్తి గారి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ అమ్మాయిని గట్టిగా హత్తుకున్నారు.

ఆహరం ఫాస్ట్ గా తింటున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోవాలి

0

వేగంగా పరిగెత్తే కాలంతోపాటే మనుషులు పరిగెడుతున్నారు. ఎంత వేగంగా అంటే కాసేపు ప్రశాంతంగా భోజనం చేసే సమయం కూడా ఉండట్లేదు. వేగంగా తమ పనులు ముగించాలని పనులతో పాటు ఫుడ్ తీసుకోవడం కూడా వేగంగా తీసుకుంటున్నారు, అయితే భోజనం చేసే సమయంలో కూడా ఇలా వేగంగా ఫుడ్ తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు.

ఆహరం ఫాస్ట్ గా తింటున్నారాఇలా చేయడం వల్ల ప్రమాదం ఉంటుందని, సరిగ్గా నమలకుండా ఆహారం తీసుకోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. భోజనం, టిఫిన్ ఏది తిన్నా నెమ్మదిగా తినాలి… బాగా నమిలి తినాలి. సాధారణంగా తినేదానికంటే ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. నమల కుండా తింటే ఆహారం ఎక్కువగా వెళ్లిపోతుంది. వేగంగా ఎక్కువగా ఫుడ్ తింటారు.

ఆహరం ఫాస్ట్ గా తింటున్నారాసరిగ్గా నమలని కారణంగా జీర్ణ సమస్యలు వస్తాయి. పేగుల సమస్యలు కూడా వస్తాయి.. ఇక ఊబకాయం బాగా పెరుగుతుంది, షుగర్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు. ఎక్కిళ్ళు రావడానికి ఇది ప్రధాన కారణం అవుతుంది.

ఆహరం ఫాస్ట్ గా తింటున్నారాతగినంత ఆహరం నిదానంగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి

 

ఫ్రిజ్ లో నిలువ చేసిన గుడ్లని తింటే ఆరోగ్యానికి ప్రమాదమా?

0

ఇదివరకంటే ఎప్పటి కూరగాయలు అప్పుడు తెచ్చుకొని ఫ్రెష్ గా తినేవాళ్ళం కానీ ఫ్రిజ్ వచ్చాక వారానికి సరిపడా కూరగాయలు ఒకే రోజు తెచ్చుకొని వారమంతా వాడుకుంటున్నారు. కూరగాయాలే కాదు కోడిగుడ్డు సంగతి అంతే. చాలా మంది గుడ్డు ట్రే తెచ్చుకుని ఓ వారం తింటున్నారు, వాటిని ఫ్రిజ్ లో పెట్టుకుని ఎప్పుడు ఏ ఆహారం కావాలి అంటే అది చేసుకుంటున్నారు.

eggsఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ స్పైసీ ఆమ్లెట్ , ఎగ్ బిర్యానీ , ఎగ్ ఫ్రై, ఎగ్ కర్రీ, ఎగ్ రోస్ట్, ఇలా అన్నీ ఫ్రిజ్ లో ఉన్న గుడ్లు తీసి ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అప్పుడు చేసుకునే వారే ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఎగ్స్ ని ఫ్రిజ్ లో పెట్టవచ్చా, ఫ్రిజ్ లో పెట్టిన కోడిగుడ్లను తినొచ్చా? దీనిపై వైద్యులు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుందాం.

eggsగుడ్లను ఫ్రిజ్ లో ఉంచిడం వల్ల వాటిలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి తిన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ తప్పవంటున్నారు నిపుణులు. గుడ్లలో క్యాల్షియం, ప్రొటీన్ ఉంటాయి అవి సాధారణ వాతావరణంలో ఉంచినపుడే ఉంటాయి. ఫ్రిజ్ లో పెడితే పోతాయి. ఒకేసారి ఫ్రిజ్ లోంచి తీసిన గుడ్లు అంటే చల్లటి వాతావరణంలో ఉన్న గుడ్లను రూమ్ టెంపరేచర్ కి తీసుకురాగానే బ్యాక్టీరియా పెరిగే ఆస్కారం ఉంది.

eggsఅలా అని మరీ ఎక్కువ వేడి ఉన్న రూమ్ లో పెట్టకూడదు, చలి ఉన్న ఫ్రిజ్ లో ఉంచకూడదు. రూమ్ టెంపరేచర్ వద్ద నిల్వ ఉంచిన కోడి గుడ్లను ఆహారంగా తీసుకోవాలట. ఒకవేళ ఫ్రిజ్ లో నిల్వ ఉంచినా బయటకు తీసాక కనీసం 2 గంటల పాటు వాటిని బయటే ఉంచి, ఆతరువాత ఉపయోగించాలి. అదికూడా ఒక వారం వరకే. గుడ్లని ఒక వారం కంటే ఎక్కువగా స్టోర్ చేయొద్దని ఫ్రెష్ గా వాడాలని చెబుతున్నారు నిపుణులు.

 

What If Movies/Series Which Released On OTT Platforms In 2020 Had Alternate Hollywood Titles

0

Mana Telugu cinema Industry ki marchipoleni year 2020, asalki ippati daaka OTT ne pattinchukoni mana filmmakers ee pandemic debbaki direct OTT releases thone adaragoduthunnaru, different types of conecpts tho manchi movies vachai ee year lo.

Eka asalu vishayaniki vasthe ee year lo release ayyina movies/series ki, vaati titles kakunda veere titles, antey aa movie concept ki daggaraga vunde, (or) aa movie feel ki apt ayye hollywood movie titles pettinam, so ey movie ki ey hollywood movie title set avuddo chuddam padandi……

1) Color Photo – Titanic

1

2) Aakasam Nee Haddu Raa – The Aviator

2

3) Scam 1992 – Catch Me If You Can

3

4) Middle Class Melodies – Eat Pray Love

4

5) Andhaghaaram – Memento

5

6) Mirzapur – City Of God

6

7) C U Soon – Searching

7

8) V – The Departed

8

గ్రహణకాలంలో దర్భకి ఎందుకు అంత ప్రాముఖ్యత ?

0

మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన “దర్భ” ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భనుశుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి.

దర్భకొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువుశరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపమని భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Vishnu Murthyవీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వాటికి మందుగా వాడుతున్నారు.అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.

దర్భఅసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రంనిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితోకప్పుకొమ్మని శాసనం చేశారు. బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు. కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.

దర్భదర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి. వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవచ్చునని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.

Vedhaluదర్భల కొనలు విడుదల చేసే తేజము – దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.

కాలభైరవుడు ఎలా ఉద్భవించాడు? దానికి గల కారణం ఏంటి ?

0
కాలభైరవుడు

కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక.

kalabhairavaశివపురాణమూ, కాశీఖండమూ కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి. భైరవుడిని స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలంటారు. పక్కనే కాలభైరవక్షేత్రం ఉన్నా చాలా సందర్భాల్లో మనం పట్టించుకోం. లోపలికెళ్లాలన్న ఆలోచనా రాదు. అందుకో కారణం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు. పరమశివుడు మనల్ని ఓరకమైన మాయాలో పడేస్తాడట. దీంతో కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామట. ఆ మాయాపొర తొలగిననాడు పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు కళ్లెదుట దర్శనమిస్తాడు. కాలభైరవ ఉపాసన ప్రాచీనమైంది. భైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది. కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి.

kalabhairavaఇంతకీ ఎవరీ కాలభైరవుడు? శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది. ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న కోరిక కలిగింది. ఎవరు చెబుతారా అని ఆలోచించారు. సృష్టికర్తను మించిన బ్రహ్మజ్ఞాని ఎవరుంటారు? నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు కూడా ఆనిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు.

kalabhairavaఅంతలోనే సృష్టికర్త చుట్టూ ఓ మాయాపొరను సృష్టించాడు పరమేశ్వరుడు. దీంతో, మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది. పిచ్చి మహర్షులూ పరమతత్వం గురించి చెప్పేదేముంది. నేనే ఆ మహాతత్వాన్ని. స్వయంభువును నేను. విధాతను నేను. సృష్టిస్థితిలయ కారకుడినీ నేను. మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే అంటూ ప్రగల్బాలు పలికాడు. అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి.

kalabhairavaమాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయాపొర కమ్మేసింది. కాదుకాదు… నేనే గొప్ప అంటూ వాదానికి దిగాడు. ఇద్దరూ కలసి వేదాల దగ్గరికెళ్లారు. వేదాలు పురుషరూపాన్ని ధరించి సకల ప్రాణుల్నీ తనలో లీనం చేసుకున్నవాడైన రుద్రుడే పరమతత్వం అంటూ ఆ వేదపురుషుడు పరమేశ్వరుడిని కొనియాడాడు. ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడని నిర్ధారించింది. అంతలోనే దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షం అయ్యాడు.

kalabhairavaఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల ఫక్కున నవ్వింది. దీంతో శివుడు ఆగ్రహంతో వూగిపోయాడు. కనుబొమ్మలు ముడిపడ్డాయి. అందులోంచి భయంకరమైన ఆకారంతో ఓ కాలపురుషుడు ఆవిర్భవించాడు. అతడే కాలభైరవుడు. భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడన్న పేరొచ్చింది. పాపాల్ని పరిహరించేవాడిగా ‘పాపభక్షు’ అయ్యాడు. కాలభైరవుడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. శివుడి ఆదేశాన్ని అనుసరించి తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగ నరికేశాడు కాలభైరవుడు. కానీ, ఆ తల కిందపడిపోకుండా భైరవుడి చేతికి అంటుకుపోయింది.

kalabhairavaఅంతలోనే విష్ణువు చుట్టూ తిరుగుతున్న మాయ కూడా తొలగింది. శివతత్వాన్ని నోరారా మెచ్చుకున్నాడు. దీంతో, నాగభూషణుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు. చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేకపోయాడు. ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కాశీనగరంలో కాలుపెట్టగానే, మహాద్భుతం జరిగినట్టు కపాలం వూడిపడింది. దీంతో కాలభైరవుడు ఆనంద తాండవం చేశాడు. కాశీక్షేత్రంలోని ఆ ప్రాంతమే ‘కపాలమోచన’ దివ్యతీర్థంగా ప్రసిద్ధమైంది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుదీరాడు. పరమశివుడి ఆదేశం ప్రకారం కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి.

 

విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి చేసే మేలేంటో తెలుసా ?

0
విటమిన్ సి

సిట్రస్ ఫలాల్లో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని మనందరికీ తెలిసిందే. బత్తాయి, నారింజ, నిమ్మ మొదలగు వాటిల్లో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే విటమిన్ సి ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికీ మేలు చేస్తుంది. విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి చేసే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సిట్రస్ ఫలాలువిటమిన్ సి ని ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా అంటారు. సిట్రస్ ఫలాల్లో ఉండే ఈ విటమిన్, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సాయపడుతుంది. దెబ్బతిన్న చర్మ కణాలని ఆరోగ్యవంతం చేయడానికి, వాతావరణ మార్పుల వల్ల చర్మంపై వచ్చే మార్పులని నిరోధించడానికి, నల్ల మచ్చలని తగ్గించడానికి సాయపడుతుంది. ఇంకా స్కిన్ టోన్ ని బయటకి తీసి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.

సిట్రస్ ఫలాలుకొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. చర్మం తయారు కావడంలో కొల్లాజెన్ పాత్ర కూడా ఉంటుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా మారి అందంగా ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల కొల్లాజెన్ దెబ్బతిని చర్మం అనారోగ్యంగా తయారైనప్పుడు విటమిన్ సి కొలాజెన్ కి హాని కలగకుండా చూస్తుంది. అంతే కాదు చర్మానికి రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ మెలనిన్ అధికంగా ఉత్పత్తి అయితే చర్మం నల్లగా మారుతుంది.

అక్కడ పూజ చేస్తే అత్తాకోడళ్లు గొడవపడకుండా కలిసిమెలిసి ఉంటారట

0

రెండుగాని అంతకన్నా యెక్కువ నదులు సంగమించే ప్రదేశాన్ని ప్రయాగ అని అంటారు. ప్రయాగ అన్న పదానికి మరో అర్థం కూడా ఉంది. తపస్సు చేసే ప్రదేశం అని. చాలా చోట్ల రెండునదులు వేరువేరు రంగులలో వుండి వాటి సంగమం ఒక అధ్భుతం అని అనిపిస్తూ వుంటుంది. అలాంటి ఒక ప్రదేశమే దేవప్రయాగ.

Devprayagసరస్వతీ నదికి ఉపనదలుగా ఉన్న నందాకిని, దౌళి గంగ , పిండారి గంగ , మందాకిని కలసి అలకనందగా మారి దేవ ప్రయాగ చేరుతుంది. మరోక నది గంగోత్రి హిమనీ నదము నుండి ఉధ్బవించి ప్రవహిస్తూ సోన్ గంగ మొదలయిన నదులతో సంగమించి టెహ్రీ మీదుగా భగీరథ నది రూపంలో ప్రయాగ చేరుతుంది. ఈ రెండు నదులు కలిసే ప్రదేశం ఆధారంగా ఏర్పిడిందే దేవప్రయాగ.

Devprayagఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం తెహ్రి గర్వాల్ జిల్లాలో ఉంది. ఋషికేశ్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల ప్రయాణిస్తే దేవప్రయాగ వస్తుంది. దేవతలు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశానికి దేవప్రయాగ అనే పేరు వచ్చినట్లుగా చెప్తారు. హిందువులు దీనిని పరమ పవిత్రంగా భావిస్తారు.

Devprayagఇక్కడ ఒక నమ్మకం కూడా ఉంది. ఇక్కడ పూజలు చేస్తే అత్తా కోడళ్ళు సఖ్యతగా ఉంటారట. అందుకే దీనిని సాస్ బహు సంగమ్ అంటే అత్తా కోడళ్ల సంగమం అని కూడా అంటారు. ఎందుకంటే అలకనంద విష్ణపత్ని లక్ష్మీ స్వరూపమని, గంగ శివుని భార్య కాబట్టి వీరు అత్తాకోడళ్ల వరస.

Devprayagఅలా అత్తాకోడళ్ల సంబంధాలు బాగులేని వారు ఈ సంగమంలో పూజలు చేసుకొని పసుపు కుంకుమ సమర్పించుకుంటే వారి సంబంధాలు బాగుపడి కలకాలం కలిసుంటారని అంటారు.

 

These Common Coincidences Between Our Stars Are Quite Suprising

0

Devarakonda brothers first major successful films madhya common connection FOOD.

Idhi plan chesi chesindha ante kaadhu, it’s just coincidence, ala jarigipothu untai anthe. So ikkada ee Food ane kismat coincidence connection nunchi inka mana movies lo coincidental ga jarigina situations emana unnaya ante konni mind loki vacheyi…

So Aa common coincidental things between our heroes yevo oka sari look veddam padandi…

P.s: Just Saradha, Helanu Cheyyaku Bro…

1) Jr. NTR – Pawan Kalyan – Mahesh Babu

1Bhumika is the heroine for their 7th movie

Simhadri – Kushi – Okkadu

2) Vijay Devarakonda – Anand Devarakonda – Food Connection

2Got their first major success through Food.

Vijay Devarakonda (Pelli Choopulu)

Anand Devarakonda (Middle Class Melodies)

3) Jr. NTR – Pawan Kalyan – Mahesh Babu – The 7th Movie Connection

3These 3 star heroes achieved huge stardom with their 7th movies.

Simhadri – Kushi – Okkadu

4) Vijay Devarakonda – Anand Devarakonda – Heroine Father’s Connection

4Arjun Reddy lo Daaba pai kiss chesthu Arjun dorikipothe, Tammudu Middle Class Melodies lo heroine ki hug ichi papam sandhya ni book chesesadu…

Movayya lu antha kalisi raala mana Devarakonda Brothers ki…

5) Jr. NTR – Pawan Kalyan – Mahesh Babu – The Police Connection

5Strong Comeback films aina Temper, Dookudu & Gabbar Singh lo mugguru Police ye

6) Jr. NTR – Pawan Kalyan – Mahesh Babu – The 25th Film Connection

6Their father dies in their 25th movie (Nannaku Prematho, Agnyaathavaasi, Maharshi) & Mugguru stars 25th films lo CEO ga chesaru

7) Jr. NTR – Victory Venkatesh – The Meher Connection

7Tarak and Venki careers lo biggest disasters ichina director Meher Ramesh and more over ee idddari hero career lo worst looks Shakthi & Shadow movies. And both movies are directed by Meher Ramesh

8) Jr. NTR – Prabhas – Ram Charan – The Jakkana Connection

8Simhadri, Chatrapathi, Magadheera – Rajamouli is behind their huge first mass success and Jakkanna is heavily responsible for their Mass following

9) Ram Charan – Mahesh Babu – The Cult Classic Connection

9Charan’s Orange and Mahesh’s Khaleja, ee two movies prathi okkariki most loved movies, cult movies ga ippudu veetiki following undhi, but Box-Office daggara rendu bayamakaramina disasters… What a daridram kadha!!! Two most loved films of both the heroes in present are disasters in the past

Ila raasukunte pothe chalane untai kabatti ikkaditho aapeddam, meeru konni movie coincidences ni comment kotteyandi P.R.E.N.D.S

11 Times When Our Heroes Got Severly Injured During Filming

0
heroes accidents

World lo andarini okati chese oka okka common point cinema. Inka yedhi manushulani daggara cheyyaledu cinema chesinattu.

Oka cinema ni mana mundhuki teesuku ravali ante dani venaka lekkapetta leni antha mandi kastam untundi and mana heroes kuda yentho kastapadi mana kosam manchi output ivvadaniki try chestaru kani sometimes work out avutundi konni sarlu kaadu, but valla 100 percent efforts matram confirm ga pedataru prathi cinema ki.

And dangerous risky stunts kuda chestaru, dupes tho cheyyagalina stunts kuda reality kosam mana heroes ye try chestaru chala sarlu ila try chesi mana heroes shooting times lo severe ga injure kuda ayyaru. And konthamandi heroes ki aithe goramaina accidents kuda jarigeyi, by gods grace vallaki em kakunda manalnni inka entertain chestunnaru.

So ila shooting time lo severe ga injure aina stars yevaro chuddam padandi…..

1) Jr. NTR – Brundavanam

1Ee movie shooting time lo Tarak oka chinna paati accident ki guriayyaru…

2) Ramcharan – Racha

2Racha movie loni train sequence appudu oka devastating accident nunchi chinna gayalatho Charan tappinchukunnaru..

3) Manchu Manoj – Bindass

3Inka tana stunts ni tane own ga compose chesukune dynamic hero Manchu Manoj, Bindass movie lo fight sequence chesteappudu koddi paati gayalatho bayata paddadu…

4) Allu Arjun – Varudu

4Ee movie climax shooting lo Allu Arjun ki hand fracture aindi…

5) Jr.NTR – Adhurs

5Oka brutal accident jarigindi Tarak ki, aa devudu daya valla theevramaina gaayalatho bytapaddadu and intha severe injuries unna kuda Adhurs cinema shooting finish chesaru…

6) Sharwanand – Jaanu

6Jaanu movie kosam, Thailand lo skydiving classes tisukuntunna time lo Sharwa shoulder ki injury aindi

7) Naga Shourya – Ashwathama

7Ashwathama lo oka stunt chestunnappudu Naga Shourya leg severe ga fracture aindi

8) Sundeep Kishan – Tenali Ramakrishna BA BL

8Inka Sundeep Kishan ki aithe Tenali Ramakrishna BA BL shooting time Face injury aindii…

9) Dhanush – Maari 2

9Maari 2 shooting fight sequence lo Dhanush ki thana right leg and left arm ki injuries ayyayi…

10) Vishal – Action

10Action movie shooting lo Vishal yekamga gaali lo unna bike nunchi kindaki padipoyadu and adi oka devastating accident, luckily Vishal just fracture tho byta paddadu

11) Ajith – Valimai

12Inka thala Ajith ki aithe yenno sarlu injuries jarigeyi, he also underwent severe surgeries regarding this, but ippatiki Bike stunts own gane chestadu, and tana latest movie Valimai shooting lo kuda Bike stunt chestu gaayapaddadu…

15 Popular Movie Character Names That Became A Part Of Our Daily Life

0
chari

Kathi anduko Janaki nunchi Saroja Vadhu Sarojaa daaka ila movies loni konni character names thega famous aipothayi.

Yentha famous ante aa names mana daily life lo oka baagam aipothai. Ey range lo famous avutai ante aa famous aina names ye kontha kaalam chuttu vinapaduthu untai.

So, Movies valla ‘O’ range lo trend ayina names pai oka look eddam padandi…

1) Ramana

1

2) Sarojaa

2

3) Bujje

3

4) Venky

4

5) Sharadha

5

6) Janaki

6

7) Papa. P. Suseela

7

8) Sathi Reddy

8

9) Samba

9

10) Babu Chitti

10.

11) Santhoshh

11.

12) Prasaduu

12.

13) Pandu Gadu

13.

14) Chanti Gadu

14

15) Chary

15Rasukunte pothe inka chala untai, avi meeru comment kottandi P.R.E.N.D.S

ముఖంపై మొటిమలు, ముడుతలు రాకుండా ఆవనూనె ఎలా ఉపయోగపడుతుందో తెలుసా

0
ఆవనూనే

ముఖంపై వచ్చే మచ్చలు, మొటిమలు, ముడుతలు చికాకు కలిగించి మానసికంగా చాలా ప్రభావితం చేస్తుంటాయి. అందువల్ల వాటిని పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఏ ప్రయత్నమైనా చేస్తుంటాం. మార్కెట్లో వీటిపై ఎన్నో రకాల ప్రోడక్టులు అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ చాలా ఖరీదైనవి. ఒక్కోసారి ఖరీదైన వాటిని వాడినా ఉపయోగం లేక పక్కన పడేస్తుంటారు.

ఆవనూనేఅలా కాకుండా ముఖంపై వచ్చే సమస్యలని పోగొట్టడానికి ఇంట్లోనే ఔషధం చేసుకోవచ్చు. దీనికి ఆవనూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖంపై వచ్చే మచ్చలు, మొటిమలు, ముడుతలు రాకుండా ఆవనూనె ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

ఆవనూనేరోజూ స్నానం చేసే ముందు ఆవాల నూనెని ముఖానికి రాసుకుని కొద్దిసేపయ్యాక కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే ముడుతలు తగ్గుతాయి. ముఖంపై నల్లమచ్చలు పోగొట్టడానికి ఆవాలనూనె కి కొంచెం శనగపిండీ, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా ఒక మూడు వారాల పాటు చేస్తూ ఉంటే నల్లమచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి.

ఆవనూనేముఖం అందంగా కనిపించడానికి చర్మంపై మచ్చలు, మొటిమలు లేకపోవడమే కాదు, పెదాలు, పళ్ళు అందంగా కనిపించాలి. పెదాలు ఎండిపోయి, పళ్ళు పచ్చగా ఉంటే ముఖం అందంగా కనిపించదు. ఆవాల నూనెని నాభి దగ్గర రోజూ పడుకునే ముందు రాసుకుంటే పొడిబారిన పెదాలు తేమగా తయారవుతాయి. పగులుతూ కనిపించే పెదాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి.

ఆవనూనేపళ్ళు తెల్లగా మెరిసిపోవాలంటే… బ్రష్ చేసుకునేటపుడు కొంచెం ఆవనూనె బ్రష్ కి తగిలించి, ఆ తర్వాత దానికి రెండు నిమ్మరసం చుక్కలు కలిపి, కొద్దిగా ఉప్పు మిక్స్ చేసి బ్రష్ చేస్తే కొద్ది రోజుల్లోనే పళ్ళు మిల మిలా మెరుస్తుంటాయి.

 

ఇంట్లో ఫ్రెష్నర్, పెర్‌ఫ్యూమ్స్‌ను వాడితే ఆరోగ్యానికి మంచిదేనా?

0

బయటికి వెళ్లి రాగానే మంచి సువాసన వస్తే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకోసం కొంతమంది ఇంట్లో స‌హ‌జ సిద్ధ‌మైన వాస‌న‌ను ఇచ్చే పెర్‌ఫ్యూమ్స్‌ను వాడుతారు. మరికొంతమంది ప‌రిమ‌ళాన్ని వెద‌జ‌ల్లే అత్త‌రు, పూలు వంటి వాటిని ఇంట్లో ఉంచుతూ, ఎటు చేసీ ఇంట్లో సువాస‌న వ‌చ్చేలా చూసుకుంటారు. మరి ఇలాంటి పరిమళాలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రయోజనాలు చూపుతాయి? అనేది తెలుసుకుందాం.

effect do perfumes have on health?ఇంటిని నింపితే ఇల్లు తాజాగా ఉంటుంది. బ‌య‌ట‌కు వెళ్లి రాగానే ఇంట్లోకి అడుగు పెడితే ఓ ఫ్రెష్ ఫీలింగ్ మ‌న‌కు క‌లుగుతుంది. మ‌న‌స్సు ఉత్సాహంగా మారుతుంది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న అల‌స‌ట‌, నిస్స‌త్తువ ఒక్క‌సారిగా మాయ‌మైపోతాయి. శ‌రీరానికి ఉత్తేజం ల‌భిస్తుంది.

effect do perfumes have on health?ఇంటిని సువాస‌న వ‌చ్చే విధంగా తీర్చిదిద్దుకోవ‌డం వ‌ల్ల ఇంట్లో ఉన్న అంద‌రి మాన‌సిక స్థితి స‌రిగ్గా ఉంటుంది. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి వంటివి త‌గ్గుతాయి. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఇంట్లోని కుటుంబ సభ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు రాకుండా ఉంటాయి. అంద‌రూ ప్ర‌శాంతంగా ఉంటారు.

effect do perfumes have on health?స‌హ‌జంగానే మ‌న చుట్టూ ఉండే వాతావ‌ర‌ణంలో బాక్టీరియా, కాలుష్య కార‌కాలు, వైర‌స్ లు ఉంటాయి. అలాంట‌ప్పుడు ప‌రిమ‌ళాల‌ను వాడితే ఆ క్రిముల‌న్నీ నాశ‌న‌మై మ‌నకు శుభ్ర‌మైన వాతావ‌రణం ల‌భిస్తుంది. రోగాలు కూడా రాకుండా ఉంటాయి. మ‌న చుట్టూ ఉండే ప‌రిస‌రాలు శుభ్రంగా ప‌రిమ‌ళాన్ని వెద‌జ‌ల్లుతూ ఉంటే.. దాంతో ఆ సువాస‌న మ‌న‌కు అరోమాథెర‌పీలా ప‌నిచేస్తుంది. ఈ క్రమంలో మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఫ‌లితంగా ఏకాగ్ర‌త పెరుగుతుంది. చేసే ఏ ప‌నినైనా శ్ర‌ద్ధ‌గా చేస్తాం.

effect do perfumes have on health?సాధార‌ణంగా మ‌నం హోట‌ల్స్‌, థియేట‌ర్లు వంటి ప్ర‌దేశాల‌కు వెళ్లినప్పుడు ఆ ప్ర‌దేశాలు మ‌న‌కు సువాస‌న‌ను అందిస్తుంటాయి. సువాస‌న వ‌చ్చేలా ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తారు. దీంతో మ‌న‌కు ఎప్పుడూ ఆ ప్రాంతాలు అలా గుర్తుండిపోతాయి. అలా ఇల్లు కూడా గుర్తుండిపోవాలంటే.. ఇంట్లో ఎప్పుడూ ప‌రిమ‌ళం వెద‌జ‌ల్లేలా ఏర్పాటు చేసుకోవాలి.

 

పంచభూత లింగాలు యొక్క ప్రాముఖ్యత ఏమిటి ?

0
పంచభూత లింగాలు

పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

1. పృథ్విలింగం:

పృథ్విలింగంఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఈ క్షేత్రంలో లింగాన్ని ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:

ఆకాశలింగంఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-

జలలింగంఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం:

తేజోలింగంతమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం:

వాయులింగంఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.

 

శ్రీరాముడు అయోధ్యను ఎన్ని సంవత్సరాలు పాలించాడో తెలుసా ?

0
Sri Ramudu

ఈ ప్రశ్నకు సమాధానం కాళిదాసు రఘువంశంలోనే దొరుకుతుంది. శ్రీ రాముడు తన అవతార సమాప్తికి ముందే తన కుమారులైన కుశ లవులకు, తమ్ములకుమారులకు చిన్న చిన్న రాజ్యాలు ఇచ్చాడని తెలుసు. వారంతా రాముడు జీవించియుండగానే ఆయా రాజ్యాల పాలనను స్వీకరించారు. అందులో కుశునికి కుశావతి అనే నగరం కేంద్రముగా చిన్న రాజ్యం లభిస్తుంది. ముందు లక్ష్మణుడు తరువాత శ్రీరాముడు తమ మానవదేహాలను త్యజించి వైకుంఠవాసులౌతారు. అయోధ్యానగర పౌరులు అనేకులు కూడా శ్రీరామునితోబాటుగా సరయూనదిలో జలప్రవేశం చేసారు. అయోధ్య కళావిహీనమయిపోయింది. కొంతకాలానికి కుశావతిలో రాజభవనంలో నిద్రిస్తున్న కుశునికి ఒక రాత్రి ఒక కల వస్తుంది. అయోధ్యానగర ఆధిదేవత దర్శనము ఇచ్చినది. అయోధ్యకు తిరిగివచ్చి పాలనను చేపట్టమని, పూర్వవైభవం చేకూర్చమని ఆదేశిస్తుంది.

శ్రీరాముడుఆమెకోరికను శిరసావహించి కుశుడు అయోధ్యకు తిరిగి వస్తాడు. సింహాసనం అధిష్ఠిస్తాడు. కొన్ని రోజులలోనే అయోధ్య తిరిగి కళకళలాడుతుంది. ప్రజలు ఆనందంగాఉంటారు. ఒక దినం కుశుడు సరయూనదిలో జలక్రీడలు జరుపుతుండగా అతడి కేయూరమనే ఆభరణం నదిలో పడిపోతుంది. వెదకినా దొరకదు. ఆనదిలో నివాసం ఏర్పరచుకున్న నాగవంశీయుడు కుముదుడు ఆ ఆభరణాన్ని తీసి ఉంటాడని అనుమానించి కుశుడు అస్త్రప్రయోగం చేయబోతాడు.

శ్రీరాముడుకుముదుడు ఆభరణంతో నది వెలుపలికి వచ్చి తాను కేవలం కుతూహలంతో దానిని తీసినట్లు చెబుతాడు. తరువాత తన సోదరి కుముద్వతిని వివాహంచేసుకొమ్మని అడుగుతాడు. కుశుడు అంగీకరించి ఆమెను తన రాణిగా చేసుకుంటాడు. వారికి అతిథి అనే కుమారుడు కలుగుతాడు. కుశుని తరువాత అతడు అయోధ్యను పాలిస్తాడు. గొప్ప రాజనీతికోవిదుడు. కాని దుర్జయుడనే అసురునిచేతిలో మరణిస్తాడు.

అయోధ్యతరువాత 21 తరాలు గడిచిపోతయాయి. 21వ తరము రాజు సుదర్శనుడు. అతడికుమారుడు అగ్నివర్ణుడు. స్త్రీలోలుడు. క్షయ వ్యాధితో మరణిస్తాడు. తరువాత ఆవంశంలో గుర్తుంచుకోవలసిన వారులేరు. మహాభారత కాలంలో వారి వంశీయుడు కౌరవులతరఫున యుద్దంచేసి మరణించాడని మహాభారత కథలు చెబుతున్నాయి. ఆధునిక కాలం వరకు అయోధ్య సప్త పుణ్యనగరాలలో ఒకటిగా కీర్తి పొందింది. బాబరు అయోధ్యపై దాడిచేసిన ఆధునిక అసురుడు.

 

15 Disturbing Pics From Farmers Protest In Delhi Is Proof That The Slogan ‘Jai Jawan Jai Kisan’ Is A Big LIE

0

రైతు పొద్దున లేచి పొలం పని మొదలు పెడితే కానీ మన ఐదు వేళ్ళు నోట్లో పెట్టలేము. మన రాష్ట్రం, దేశంలో ఎక్కడైనా కూడా రైతు బాగుంటేనే ప్రజలు బాగుంటారు, తద్ద్వార దేశం బాగుంటుంది…ఈ ప్రపంచమే బాగుంటుంది. కానీ మన దేశంలో రైతులు పొలాన్ని వదిలి రోడ్ ఎక్కారు….అన్నం పెట్టిన రైతు రోడ్ మీద వండుకుని తింటున్నాడు, మన ఆకలి తీర్చిన రైతుని అదే చేతితో కొడ్తున్నారు….

రైతు గోడు విని ఆ సమస్య పరిష్కరించాలి కానీ ఇలా మాత్రం చేయొద్దు. దేశ రాజధాని సాక్షిగా రైతన్నలను హింసిస్తున్న తీరు చూసి…ఈ చేత కానీ ప్రబుత్వాలని ఎం అనాలో కూడా అర్ధం కావడం లేదు…వాళ్ళ సమస్యలు తీర్చక పోయిన పర్వాలేదు కానీ ఇలా మాత్రం చేయొద్దు….దయ చేసి చేయొద్దు…

గోడు చెప్పుకోడానికి వచ్చిన రైతుని…గొడ్డుని కొట్టినట్టు కొడ్తున్నారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి రైతు కన్నెర్ర చేస్తే…శివుడి మూడో కన్ను తెరిచిన దానితో సమానం.

1.

7.

2.

13.

3.

6.

4.

10.

5.

1.

6.

2.

7.

8.

8.

15.

9.

4.

10.

5.

11.

9.

12.

3.

13.

14.

14.

12.

15.

11.

Dear Hyderabadis If You Take Note To Vote Then You Don’t Have A Right To Demand These Basic Things

0

Dear Hyderabadis…repu GHMC Elections lo meeru evariki vote estaru ante andaru em undi evaru ekkuva paisal isthe vallaki anne vallu 90% untaru. YEs, mana andariki ila note tisukoni vote veyadam anedi tara taraluga vastunna rajyangam icchina elections sampradayam andulo thappu em undi antaru.

Correct eh kani 2020 lo unnamu…Hyderabad ante almost andaru educated people eh ekkuva untaru. Last 5 years lo Hyderabad chala revolutionary changes ni chustundi kani some places lo inka ave roads, adhe drainage system poor ga unnayi. Enduku ante mana Hyderabadis politicians icche dabbu ki asha padi vote veyadam…gelichaka aa corporators idhe advantage ga tisukuni mana dabbulu dobbeyadam, development ni apeyadam lantivi some part of Hyderbads lo jaruguthu vastundi.

Ala kakunda mana Hyderabad, mana colonies, mana streets manchiga undali ante manam note tisukokunda vote veyali…appude mana ee kindha icchina basic things ni manam elect chesukunna corporators ni adigi cheyinchukogalamu…

1.Potholes on roads in your constituency

1.Manam daily offices ki vellai ante vacche roads bagundali…kani ela untayi eppudu potholes eh…so manam money tisukokunda vote esthe epudaina corporator no questions cheyochu.

2.Nalas & Drainage management in your constituency

2.Ika chianna rain padithe chalu mana colonies anni cheruvulu laga aipothayi. Idi inka enni rojulu manam ippud u note tisukokapothane repu vacche varsha kalam lo vallani question cheyagalamu.

3.Street lights and security cameras set up in your colonies

3.Ika colonies lo street lights undavu…unna avi velagavu. Intlo dongalu, bike theftings, chain snatchers, ivi regular ga Hyderbad lo jarige crime scenes as a result of no street lights and no security cameras in our colonies.

4.Garbage issues

4.Ika Hyderbad lo chala areas some years nundi face chestunna issues lo idi main. Assala garbage collection leni colonies and areas chala unnayi…konni areas lo aithe garbage kuppalu kuppaluga untu some pungent smell vasthu untundi adigithe care chesevaru undaru.

5.Roads, Committee Halls, Parks Etc !

5.Ika roads, committee halls, parks lantivi kavali ani adige hakku naku undali ante notes tosukovaddu and correct pani chese corporator ni elect cheyadam mana mundhu undu unna major issue.

So Dear Hyderabadis wise ga think cheyandi and Think Twice Before You Take Note & Vote !

చిరు ధాన్యాలు వలన ఆరోగ్యానికి కలిగే మేలు ఏంటో తెలుసా ?

0
చిరు ధాన్యాలు

మన తాతలు, అవ్వలు వృద్ధాప్యంలో కూడా బాగా ఆరోగ్యం జీవించడం మనం చూశాము. కారణం వారు ధాన్యంతో చేసిన సాంప్రదాయ ఆహారాలను మాత్రమే తీసుకునేవారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ మరియు విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సాంప్రదాయక ఆహారాలు అంటే సిరిధాన్యాలు లేదా చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు. వీటినే ఇంగ్లీష్ లో మిల్లెట్స్ అని పిలుస్తారు.

Health benefits with whole grainsప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు వాడకం పట్ల ఎక్కువగా మక్కువ చూపుతున్నారు, వాటిలో అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. మీరు ఎవరైనా ఫిట్‌నెస్ ఔత్సాహికుడితో మాట్లాడి చూడండి వారు చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల పొందుతారని మీకు హామీ ఇస్తారు. ఇవి మీ ఆరోగ్యాన్ని పెంచుతాయి మరియు బరువు తగ్గడంతో పాటు గ్లూటెన్ రహితంగా ఉంటాయి.

Health benefits with whole grainsఆరోగ్యకరమైన ఆహారం మన చుట్టూ ఉన్నాకానీ మనం మాత్రం ప్యాశ్చాత్య పోకడలకు అలవాటు పండి జంక్ ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయినప్పటికీ, దీర్ఘకాలిక ప్రాతిపదికన జంక్ ఫుడ్ వినియోగం, మనందరికీ తెలిసినట్లుగా, మన ఆరోగ్యానికి చాలా హానికరం. మీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఆరోగ్యకరంగా ఎంపిక చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. సిరిధాన్యాలు లేదా చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు(మిల్లెట్లు) వివిధ రకాలుగా లభిస్తాయి, ప్రతి దానిలో వాటికవే ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సంవత్సరంలో ఏ సమయంలోనైనా మీరు సూపర్ మార్కెట్‌లో పొందవచ్చు మరియు ఇప్పటికీ చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు(మిల్లెట్ల)ను స్టాక్‌లో కనుగొనగలుగుతారు.

Health benefits with whole grainsరోజువారీ ఆహారంలో భాగంగా చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు(మిల్లెట్ల)ను తీసుకోవడం ఇప్పుడేమీ కొత్త కాదు, పూర్వ కాలం నుండే వీటి వినియోగం ఎక్కువగా ఉండేది. వాస్తవానికి, హరిత విప్లవం బియ్యం మరియు గోధుమలను మరింత అందుబాటులోకి తెచ్చే వరకు మధ్య మరియు దక్షిణ భారతదేశ జనాభా చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు(మిల్లెట్ల)ను ప్రధాన ఆహారంగా తీసుకునెవారు.

సిరిధాన్యాల వలన ప్రయోజనాలు:

ఈ ధాన్యాలు ఏవైనా సరే బాగా నమిలి తినాలి. దాని వలన ప్రతి గంటకొకసారి ఏదో ఒకటి తినాలి అని అనిపించదు. అతిగా తినటం అనే అలవాటు తగ్గుతుంది.

వీటిని ఆహారంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోస్ శాతం తగ్గుముఖం పడుతుంది. దీని వలన మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Health benefits with whole grainsకాల్షియమ్ వీటిలో చాలా అధికంగా ఉంటుంది. కాల్షియమ్ వల్ల దంతాలు, ఎముకలు గట్టిగా ఉంటాయి.

Health benefits with whole grainsసిరిధాన్యాలు పీచుని అధికంగా కలిగి ఉంటాయి. అందువలన వీటిని తింటే కిడ్నీలో, పిత్తాశయంలో రాళ్ళు రావటం వంటి సమస్యలు తగ్గుతాయి.

Health benefits with whole grains

  • వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, కొవ్వు తగ్గుతుంది. ఇప్పటికే అసిడిటీ ఉన్నవారు వీటిని తినటం వలన చాలా మేలు చేస్తాయి.
  • వీటిలో ఎలర్జీ కలిగించే గుణం ఉండదు కనుక చిన్న పిల్లలకు కూడా ఇవచ్చు.
  • ఊబకాయం, కాన్సర్ మరియు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా వీటిని రోజు తీసుకోవచ్చు.
    తక్కువ తినగానే పొట్ట నిండుగా అనిపించటం వలన ఊబకాయం కూడా తగ్గుతుంది.

health benefits of eating thotakura

  • వీటిలోని పీచు పదార్ధం వలన ఉదర సమస్యలు తగ్గుతాయి. బాగా నమిలి తినటం వలన ఆహారం జీర్ణం అవుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
  • రక్తహీనత కూడా తగ్గుతుంది. రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. దీని వలన హార్మోన్ల అసమానం తగ్గి సమస్యలు దరిచేరవు. హార్మోన్లు సరిగా ఉంటే సంతానలేమి సమస్య కూడా తగ్గుతుంది. ఇలా వీటి వలన ఒక్కో సమస్య దూరం అయి ఆరోగ్యం మెరుగు అయి మన జీవనం హాయిగా సాగుతుంది.
  • శరీరంలో వ్యర్ధాలు బయటకి పోవటానికి ఇవి ఉపయోగపడతాయి.
  • సిరిధాన్యాలు తినటం వలన చెడు కొవ్వు బాగా తగ్గుతుంది. మనకి అవసరమైన కొవ్వు పదార్దాలు (good cholestrol) లభిస్తాయి.

Health benefits with whole grains

  • అతి భయంకరంగా చెప్పబడే కాన్సర్ వ్యాధి బారిన పడకుండా మనల్ని కాపాడుతాయి ఈ ధాన్యాలు. రక్త పోటు ఉన్నవారు వీటిని తీసుకోవటం వలన అది అదుపులో ఉంటుంది.
  • శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి.
  • కాలేయం, పిత్తాశయం పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.
  • గాస్ట్రిక్, పొట్ట ఉబ్బరం లాంటి ఉదర సమస్యలు దరిచేరవు.

 

కార్తీకపౌర్ణమి రోజున 365వత్తులతో దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు?

0

సాధారణంగా కార్తీక మాసం ముగిసే వరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగించి దేవతలను పూజిస్తారు. అందులో కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా అంటారు. ఈ కారీక పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు.

కార్తీకపౌర్ణమిరోజూ దీపాలు వెలిగిస్తారు కదా మరి కార్తీక పౌర్ణమి రోజు 365వత్తులతో దీపాన్ని వెలిగించడానికి కారణం ఏంటి? కార్తిక పౌర్ణమి రోజున గుత్తి దీపాలు పెట్టడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒక ఇల్లు కడితే ఆ ఇంట దీపం లేకుండా ఒక్క రోజూ ఉండకూడదు. మనం కట్టుకున్న ఇంటికి తాళం పెట్టి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఇంటి పురోహితుణ్ణి పిలిచి- ‘‘మా పూజామందిరంలో దీపం వెలిగించి, స్వామికి నైవేద్యం పెట్టండి’’ అని చెప్పి, ఇంటి తాళం ఇచ్చి వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది.

కార్తీకపౌర్ణమిఎందుకంటే ఇంట దీపం వెలగలేదు అంటే అది పరమ అమంగళకరమైన గృహం అని చెబుతారు. ‘స్వగృహే’ అని ఎక్కడ కూర్చొని సంకల్పం చెప్పుకుంటామో అక్కడ అన్ని చోట్లా దీపం వెలగాలి. అలా దీపం వెలగకపోతే దోషం మనకే వస్తుంది. ఆ ఇంట్లో తిరిగినందుకు కలిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా లభించిన అద్భుతమైన తిథి కార్తిక పౌర్ణమి. అందుకే కార్తిక పౌర్ణమి నాడు 365 వత్తులను ‘గుత్తిదీపం’ గా ఆవునేతిలో ముంచి వెలిగిస్తారు.

కార్తీకపౌర్ణమిరోజు దేవునికి దీపారాధన చేయలేని వారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తం పూజించిన పుణ్యఫలం ఈ రోజు వత్తులు వెలిగించడం వలన వస్తుంది.

కార్తీకపౌర్ణమికొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.

 

12 Times Our Heroes Set A Benchmark In Hairstyling With Their Trendy Long Hair Look

0
Heroes Hair Styles

Mana heroes character kosam yelaa ayinaa transorm avuthaaru… Konni saarlu marii naatugaa, marikonni saarlu super stylish ga… Kaani sudden ga yedho alochisthuu unte manilla long hairstyles ye gurthocchaayi… Avunu ee madhya long hair cut ayipoyinattu undhi, yevaruu penchadam ledhugaa anipinchindhi… Ante konchem unna hair lone styles yekkuvagaa prachuryam loki vacchaay kadhaa, so andhulone different shades choopinchesthunnaaru… Ayithe inko doubt yem vacchindhante, asalu mana hero s andharuu yeppudo okkasaarayinaa long hair tho cinema chesaaraa ani… Sare check cheddhaama anipinchi choosaa, andharuu alomost chesaaru… Sarele alaasyam yendhuku, yem article ra idhi ani oo padhi mandhi thittinaa parledhu ani fix ayyi asalu manolla ee long hair style looks choopincheddhhaam ani pattukocchesaa… Have a look…

Gamanika: Annii original ani nenu cheppadam ledhu, adhi meeru gamaninchaali… Oiginal aa kaadhaa annadhi pakkana pedithe asalu long hair lo yelaa unnaaru annadhi point… Ika choosukondi…

1) Chiranjeevi – Rikshavodu &SyeRaa

1Rendu cinema lonuu aa venuka mudi maathram common… Okaanoka shot lo aa mudini theesesthaaru kodaa… SyeRaa lo may be wig ayyi undocchu gaani, Rikshavodu lo real yemo… Yedhayinaa mana Megastar ni long hair lo choosaam…

2) Balakrishna – Pandurangadu, Gauthami Putra Sathakarni &slightly Ruler

2Mari BhakthiRasa chitram ante aa maathram undaali kadhaa… Andhulake idhi…Alaane Sathakarni koodaa historical kabatti long hair… Kaani recent Ruler lo maathram chaalaa different hairstyle try chesaarante cheppaali mama Balayya…

3) Nagarjuna – Annamayya, Super, Sriramadasu, Jagadhguru Aadhi Sankara & more

3Cheppalante nijaaniki mana evergreen young hero Nag sir appatlo venuka junapaalathone undevaaru… Adhi almost alaane kanipinchevi… Kaani pakkagaa ayithe ye get-up lo ayinaa alaa set ayipoye aayana, mass ga chesinaa, stylish ga chesaa, bhakthudigaa kanipinchinaa long hair tho baagaane undevaaru…

4) Venkatesh – Shadow

4Oo maadhirigaa indhulone aayana konchem long hair tho kanipisthaaru… Stylish ga try chesaaru andhulo… Kaani movie motthaam alaa undaru… Venkatesh gaaru koodaa appatlo venuka junaapalu gattigaane maintain chesevaallu…

5) Mahesh Babu – Athidi

5Only one… Cinema sangathi yelaa unnaa koodaa aayana aa look tho mesmerize chesaaru… Cheppalante long hair tho Hollywood hero la kanabade shots konni untaay… Baaguntundhi kadhaa baabay…

6) NTR.Jr – Yamadonga &Shakti

6Yamadonga lo super level changeover kanipisthundhi… Slim ga avadamtho paatu hair koodaa konchem penchi crazy look lo kanipinchaaru… Ika Shakti lo koodaa kanabaddaaru gaani, fans ayina memu koodaa theesulekapoyaam…

7) Allu Arjun – Desamuduru, Badrinath, Arya2, Varudu &Vedam (Ala Vaikuntapuram lo)

Whatsapp Image 2020 11 30 At 11.55.21 AmPaivannii okay… Kaani Ala Vaikuntapuram Lo koodaa untundhi gaani, yekkadaa aa hair specific ga kanabadadhu, kaani venuka yekkuva gaane untundhi, chaalaa baaguntundhi koodaa… Yedhayinaa Bunny anna long hair lo adhiirpothaaru… Mari stylish star tag oorike vacchesthundhaa yenti…

8) Ram Charan – Chirutha &Magadheera

8First two movies lonuu long hair thone kanabaddaaru… Nijaaniki alaane baagundhi koodaa… Konthamandhiki long hair baagaa set avuthundhi, andhulo Charan anna okaru…

9) Prabhas – Munna, Yogi &Baahubali

9Baahubali lo aa character ki thaggattu untundhi… Ika Munna super stylish ane cheppocchu… Ayithe Yigi movie lo konchem mixed look untundhi… Alaa konni scenes varaku untundhi aa long hair…

10) Vijay Devarakonda – Arjun Reddy &World Famous Lover

10Vijay anna almost movies lo ilaa yekkuva hair thone kanipinchaaru… But Arjun Reddy lo vacation ki vellinappudu, and World famous lover konni scenes varaku aa long hair clear ga kanipisthundhi… Yemundhi, almost movies lo anthe… Repu raaboye Fighter lo koodaa anukuntaa…

11) Ram – Unnadhi Okate Zindagi

11Asalu super crazy ga untundhi ee look maathram… Ante Ram anna ni chaalaa cinema lalo aa normal hairstyle thone choosaam kadhaa, so indhulo alaa kanipinchadam kotthagaane anipinchindhi… Ready movie lo koodaa untundhi gaani marii antha kaadhemo…

12) Pawan Kalyan – Outside

12Manam Kalyan gaarini movies lo antha long hair tho choodaledhu gaani, bayata maathram choosaam… Ante aayana ilaa politics loki vacchaaka deeksha kosamano, vere reasons tho alaa penchaaru… Ayithe Vakeel Saab lo koodaa konchem long hair thone unnattu posters choosthe arthamavuthundhi… Choodaali, solid ga waiting kadhaa…

Sare mari, inkaa yevarinanna miss chesaanaa..! Leka dhaanni mi oorlo long hair antaaraa ane laanti dialogues unnaaya.! Kaanivvandi comments lo…

Jai Jawan – Jai Kisan – Jai Sramik

 

8 Recent Movies That Are Beautifully Set In Telugu Places

0
regional movies

Telugu cinema ante urike ticket vesukoni US ki shooting velle rojulu poyayi. Ippudu vache naya filmmakers antha mana Telugu places lo beautiful cinemalu teesutunnaru.

Appudu C/o Kancharapalem, ippudu Middle Class Melodies mana oorulani entha baga chupincharo kadhaa…

Mostly Hyderabad lekunte Vizag ni matrame chupinche mana filmmakers vere places loni soul capture cheyyadam lo baga success avutunnaru.

So mana Telugu places ni beautiful portray chesina recent movie list mee kosam…

1) Middle Class Melodies – Guntur

1

2) Dear Comrade – Kakinada

2

3) Agent Sai Srinivas Athreya – Nellore

3

4) Mallesham – Bhongir

4

5) Care Of Kancharapalem – Kancharapalem

5

6) Fidaa – Banswada

6

7) Shatamanambhavati – Athreyapuram

7

8) RX 100 – Athreyapuram

8

Deverakonda To Bellamkonda: 11 Tollywood Actors & Others Who Are All Set For Bollywood Debut Soon

0

Baahubali lanti gamechanger taruvatha mana Tollywood ki Tollywood stars ki, movies ki, content ki and technicians ki PAN India approach vacchesindi. Andhuke Tollywood heroes nundi directors varaku chala mandi remakes and original movies tho Bollywood debut ki ready aipoyaru.

Mari mana Tollywood nundi Bollywood debut ki ready aipoina aa actors evaro once chuseddamma ?

1.Vijay Deverakonda with Fighter

1Puri direct chestunna ee movie tho VD Bollywood debut ki ready aipoyadu. Indulo heroine ga Bollywood heroine Ananya Pandey chestundi.

2.Shalini Pandey with Jayeshbhai Jordaar

2Arjun Reddy tho itu Tollywood and PAN India wide gaa fans ni earn chesukunna Shalini Ranveer Singh act chestunna ‘Jayeshbhai Jordaar’ lo act chestundi.

3.Gowtam Tinnanuri (as director) with Jersey Remake

3Telugu audience ki masterpiece icchina Goutham Hind vallaki adhe master piece ni avvadaniki ready aipoyadu Shahid as hero.

4.Adivi Sesh with Major

4Ika Major Sundeep Unnikrishnan real life story ni Major dwara cheppabotunarru undulo lead role lo Adivi Sesh chestunaru.

5.Mahesh Babu (as producer) with Major

5Adivi Sesh chestunna Major ki mana Mahesh Babu one of the producers along with Sony Pictures.

6.Samantha Akkineni with The Family Man

6Indian OTT lo oka storm create chesina The Family Man series. Ee series season 2 lo Samantha oka major role play chestundi.

7.JR NTR with RRR

7Mana Rajamouli garu chestunna PAN India RRR project dwara Jr NTR bollywood debut ki ready aipoyaru.

8.Sailesh Kolanu (as director) with HIT Remake

8Viswak Sen hero ga Nani produce chesina HIT movie ni Rajkumar Rao tho remake chestunaru and Hindi lo kuda Shailesh Kolanu eh direct chestunaru.

9.VV Vinayak (as director) with Chatrapathi Remake

9Telugu lo mass movies ki care of address aian Vinayak garu Chatrapathi remake tho Bollywood debit ki ready aipoyaru.

10.Bellamkonda Srinivas with Chatrapathi Remake

10North lo mass craze and following unna Bellamkonda Srinivas ippudu Prabhas chesina Chatrapathi remake tho Bollywood debut ki ready aipoyadu.

11.G. Ashok (as director) with Durgamati (Bhagamathie Remake)

11Telugu lo Anushka tho Bhagamathie lanti blockbuster tisina Ashok garu idhe movie remake in Bollywood lo hindi version ki direction chesaru.

14 Characters In Movies That Overshadowed Almost Every Other Character In That Film

0

Hero chuttu tirige commercial films manavi mostly stories anni hero chuttune tiruguthu untai kani konni sarlu yentha pedda hero unna story yedaina movie loni konni characters picha highlight avutai, ilanti movies chusaka evaraina em nachindi ani adigithe ventane aa character ye gurtostundi. Alanti konni adargottesina characters pai oka look veddam padandi…

1) Kondal Rao – Middle Class Melodies

1

2) Gaali Seenu – Gamyam

2

3) Yesu Dasu – Mathu Vadalara

3

4) Bhikkhu Matre – Satya

4

5) Khader – Vennela

5

6) Khan Dada – Money & Money Money

6.

7) Kishore – Ekkadiki Pothavu Chinnavada

7

8) Kishore – Manmadhudu 2

8

9) Ram Murthy – C/O Kancharapalem

9

10) Uday Bhaskar – Oohalu Gusagusalade

10

11) Sesham – Sontham

11

12) Nellore Giri – Prema Katha Chitram

12

13) Padmasri -Dookudu

13

14) Bokka Venkata Rao – Dookudu

14

These 8 Songs Of Anurag Kulkarni In 2020 Is The Only +Ve We’re Addicted Too

0

Anurag Kulkarni….ee peru vinagane music ;lovers andariki Asha Paasam, Pilla Raa lanti hit and instant chartbusters ventane hum chesestaru. Tollywood lo one of the best and most happening playsingers lo Anurag top anadam lo elanti doubt ledu. Tollywood lo edaina movie release aindi chalu andulo Anurag Kulkarni thomin okka song padistunaru mana makers. Ee okka example chalu anukunta Anurag elanti singer oo and athaniki unna demand elantido cheppadaniki.

Ika ee year pandemic valla maximum movies release avvaledu anedi andariki telusu. Aithe movies teasers, trailers and songs matram release ayyayi inka avtunnayi. Konni movies emo OTT release chesaru kuda ila release agipoina, release aina movies lo Anurag Kulkarni padina songs konni songs instant hits ayayi for all the right reasons.

Simple ga cheppali ante ee pandemic lo Anurag padina songs konni loopmode lo manchi kickass feel ni icchayi…avento oo sari malli vineddam padandi…

1.Pilla Puli – Aksame Nee Haddu Raa

2.Arere Aakasham – Colour Photo

3.Chukkala Chunni Lyrical – SR Kalyana Mandapam

4.Tholi Tholi – Amaram Akhilam Prema

5.Nee Peru – Ksheera Sagara Madhanam

6.Nuvve Nuvve – Red

7. Kallara Chusthunna – That Is Mahalakshmi

8. Kadhile Kaalaga – Kannulu Kanulanu Dochayante

15 Popular Commercial Telugu Ads Which Were Actually Directed By Trivikram

0
Trivikram

Trivikram anagane Oka Nuvve Nuvve, Athadu, Oka Khaleja lanti ayana direct chesina cinemale kakunda ayana story and adiripoye paunch lu rassina Manmmadhudu, Nuvvu Naku Nacchav, Malliswari lanti cinema manaki gurthu vasthayi. Amma, Anjali, Avakaya eppudu bore kottavu anattu mana Guruji gurinchi ayana cinemala gurinchi, ayana cinemallo unde punchu la gurinchi, cinema events lo ayana icche goosebumps speech lu gurinchi entha matladukunan bore kottadhu.

Ivi anni kakunda mana Guruji Trivikram gurinchi meeku inkonni teliayni vishayalu cheptha. Trivikram garu atu movies, movie production, lantivi matrame kakunda some popular commercial ads kuda direct chesaru. Indulo chala ads mana andariki telisinave ayana avi Trivikram direct chesaru ane vishayam anedi chala mandiki teliyadhu…

Mari mama Guriju direct chesina aa ads ento oo sari chuseddam padandi…

1.Life lo Konchem Aha undali – Ft Allu Arjun Aha Ad

2.Navratna Oil – Ft Jr NTR

3.IPL Ad – Ft Jr NTR

4.Celkon Ad – Ft Tamannah

5.Pepsi Ad – Ft Pawan Kalyan

6.Pepsi Ad – Ft Dhoni & Ram Charan

7.Abhi Bus Ad – Ft Mahesh Babu

8.Jos Alukkas Ad – Ft Mahesh Babu

9.Airtel Ad – Ft Ram Charan

10.Santoor Ad – Ft Mahesh Babu

11.TVS Ad – Ft Mahesh Babu

12.Mahindra Tractor Ad – Ft Mahesh Babu

13.Thums Up Ad – Ft Mahesh Babu

14.LLOYD Ad – Ft Mahesh Babu

15. Byju’s Ad – Ft Mahesh Babu

నిద్ర బాగా పట్టాలంటే ఈ ఆహార పదార్ధాలు తినాల్సిందే

0
నిద్ర

మంచి నిద్ర కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చాలా మంది ప్రజలు తగినంత నిద్ర పొందడానికి కష్టపడుతున్నప్పటికీ, ప్రతి రాత్రి మీరు 7 నుండి 9 గంటల నిద్ర పొందాలని సాధారణంగా సిఫార్సు చేయబడింది. మంచి నిద్రను ప్రోత్సహించే కొన్ని ఆహారపదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రకు ఉపయోగపడే ఆహార పదార్థాలుబాదం :

బాదం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన డ్రై ఫ్రూట్. రోజూ బాదంపప్పు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

eating habits to keep bones strongబాదం నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయని అంటారు. ఎందుకంటే ఇతర ఎండుద్రాక్షల మాదిరిగా బాదం కూడా మెలటోనిన్ యొక్క మూలం. మెలటోనిన్ మీ అంతర్గత గడియారాన్ని నియంత్రిస్తుంది మరియు నిద్ర కోసం మిమ్మల్ని సిద్ధం చేయడానికి మీ శరీరానికి సంకేతాలను ప్రసారం చేస్తుంది. బాదం బాండ్స్ మెగ్నీషియం అని పిలువబడే పోషకాల యొక్క అద్భుతమైన మూలం. ఇది మీ రోజువారీ అవసరాలలో 19% కేవలం ఒక ఔన్సులో అందిస్తుంది. ముఖ్యంగా నిద్రలేమి ఉన్నవారికి మెగ్నీషియం తగినంత మొత్తంలో తీసుకోవడం నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

టర్కీ చికెన్:

నిద్రకు ఉపయోగపడే ఆహార పదార్థాలుటర్కీ చికెన్ మాంసం రుచికరమైన మరియు పోషకమైనది. కాల్చిన టర్కీ చికెన్ లో అధిక మొత్తంలో ప్రోటీన్ కలిగి ఉంటుంది. దీనిలోని ప్రోటీన్ మీ కండరాలను పెంచడానికి మరియు మీ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. టర్కీ చికెన్‌లో నిద్రను ప్రోత్సహించే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా, ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. నిద్రకు ముందు మితమైన ప్రోటీన్ తీసుకోవడం మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుందని ఆధారాలు ఉన్నాయి. ఇది రాత్రుళ్లు నిద్ర లేవడాన్ని కూడా తగ్గిస్తుంది. నిద్రను మెరుగుపరచడంలో టర్కీ చికెన్ యొక్క పాత్రను నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరం.

చమోమిలే టీ:

నిద్రకు ఉపయోగపడే ఆహార పదార్థాలుచమోమిలే టీ ఒక ప్రసిద్ధ మూలికా టీ. ఇది వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఫ్లేవోన్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఫ్లేవోన్స్ అనేది యాంటీఆక్సిడెంట్ల తరగతి, ఇవి దీర్ఘకాలిక వ్యాధులకు, ముఖ్యంగా క్యాన్సర్ మరియు గుండె జబ్బులకు కారణమయ్యే మంటను తగ్గిస్తాయి. చమోమిలే టీ తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఆందోళన మరియు నిరాశను తగ్గిస్తుంది మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా, చమోమిలే టీలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఇవి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి ముఖ్యంగా, చమోమిలే టీలో ఎపిజెనిన్ అనే పోషకం ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్ మీ మెదడులోని కొన్ని గ్రాహకాలతో నిద్రను ప్రోత్సహిస్తుంది మరియు నిద్రలేమిని తగ్గిస్తుంది. మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి మీరు పడుకునే ముందు చమోమిలే టీ తాగడం ఖచ్చితంగా విలువైనదే.

కివి పండు:

నిద్రకు ఉపయోగపడే ఆహార పదార్థాలుకివి పండ్లలో తక్కువ కేలరీలు మరియు ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఒక పండులో 42 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది మంచి మొత్తంలో ఫోలేట్ మరియు పొటాషియం మరియు అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. అదనంగా, కివి పండ్లు తినడం మీ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మంటను తగ్గిస్తుంది. మరియు మీ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యంపై అధ్యయనాల ప్రకారం, పడుకునే ముందు తినడానికి కివి పండ్లు ఉత్తమమైన ఆహారాలలో ఒకటి. నిద్రపై కివి పండ్ల ప్రభావాలు కొన్నిసార్లు సెరోటోనిన్ కారణంగా ఉంటాయి. సెరోటోనిన్ అనేది మీ నిద్రను నియంత్రించడంలో సహాయపడే రసాయనం. విటమిన్ సి మరియు చెవిలోని కెరోటినాయిడ్లు వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీఆక్సిడెంట్లు నిద్రను ప్రోత్సహించే ప్రభావాలకు దోహదం చేస్తాయని కూడా సూచించబడింది.

చెర్రీ పండ్ల రసం:

నిద్రకు ఉపయోగపడే ఆహార పదార్థాలుచెర్రీ పండ్ల రసంలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొదట, ఇది మెగ్నీషియం మరియు భాస్వరం వంటి కొన్ని ముఖ్యమైన పోషకాలను మితంగా అందిస్తుంది. ఇది పొటాషియం యొక్క మంచి మూలం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, వీటిలో ఆంథోసైనిన్స్ మరియు ఫ్లేవనోల్స్ ఉన్నాయి. చెర్రీ జ్యూస్ నిద్రను ప్రోత్సహించడానికి ప్రసిద్ది చెందింది. నిద్రవేళకు ముందు చెర్రీ జ్యూస్ తాగడం వల్ల మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. చెర్రీ జ్యూస్ నిద్ర ప్రభావాలకు మెలటోనిన్ అధికంగా ఉంటుంది. నిద్రను మెరుగుపరచడంలో మరియు నిద్రలేమిని నివారించడంలో చెర్రీ పండ్ల రసం పాత్రను నిర్ధారించడానికి మరింత విస్తృతమైన పరిశోధన అవసరం. అయితే, మీకు నిద్ర పట్టడం లేదా రాత్రి పడుకోవటానికి ఇబ్బంది పడుతుంటే, నిద్రవేళకు ముందు కొంత చెర్రీ జ్యూస్ తాగడానికి ప్రయత్నించండి.

చేప :

నిద్రకు ఉపయోగపడే ఆహార పదార్థాలుసాల్మన్, ట్యూనా, ట్రౌట్ మరియు బంగీ వంటి చేపలు చాలా ఆరోగ్యకరమైనవి. కొవ్వు చేపలలో అధిక మొత్తంలో ఆరోగ్యకరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అదనంగా, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయి మరియు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు విటమిన్ డి కలయిక నిద్ర నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఎందుకంటే రెండూ సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయని తేలింది. చేపలు తినే వారికీ విటమిన్ డి అధిక స్థాయిలో ఉంటుంది, ఇది నిద్ర నాణ్యతలో గణనీయమైన మెరుగుదలతో సంబంధం కలిగి ఉంటుంది. నిద్రవేళకు ముందు కొన్ని ఔన్సుల కొవ్వు చేప తినడం వల్ల మీరు త్వరగా నిద్రపోవచ్చు మరియు మరింత గాడంగా నిద్రపోతారు. నిద్రను మెరుగుపరచడానికి కొవ్వు చేపల సామర్థ్యంపై ఖచ్చితమైన నిర్ధారణకు రావడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.

వాల్ నట్:

నిద్రకు ఉపయోగపడే ఆహార పదార్థాలునిద్రకు ఇది కూడా చాలా ముఖ్యమైనది. వాల్‌నట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం, వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు లినోలెయిక్ ఆమ్లం ఉన్నాయి. ఇందులో ఔన్స్‌కు 4.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది వాల్‌నట్స్ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. వాల్నట్ తినడం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది అని కొంతమంది పరిశోధకులు వెల్లడించారు. ఎందుకంటే అవి మెలటోనిన్ యొక్క ఉత్తమ ఆహార వనరులలో ఒకటి. ఇవి మంచి నిద్రకు దారితీస్తాయి.

పాషన్ ఫ్లవర్ టీ:

నిద్రకు ఉపయోగపడే ఆహార పదార్థాలుపాషన్ ఫ్లవర్ టీ అనేది మరొక మూలికా టీ. దీనిని సాంప్రదాయకంగా అనేక రోగాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఫ్లేవనాయిడ్లు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అదనంగా, ప్యాషన్ఫ్లవర్ టీ ఆందోళనను తగ్గించే సామర్థ్యం కోసం అధ్యయనం చేయబడింది. పాషన్ ఫ్లవర్‌లో ఎపిజెనిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఆందోళనను తగ్గిస్తుంది. పాషన్ ఫ్లవర్ టీ యొక్క ప్రశాంతమైన లక్షణాలు నిద్రను ప్రోత్సహిస్తాయి. కాబట్టి నిద్రవేళకు ముందు తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.

తెల్ల బియ్యం అన్నం :

నిద్రకు ఉపయోగపడే ఆహార పదార్థాలువైట్ రైస్ అనేది ఒక ధాన్యం, ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో ప్రధాన ఆహారంగా వినియోగించబడుతుంది. తెలుపు మరియు గోధుమ రంగు బియ్యం మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే తెలుపు బియ్యం దాని సూక్ష్మక్రిములను తొలగించింది. ఇందులో కరిగే ఫైబర్, పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ, తెల్ల బియ్యంలో కొన్ని విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి. తెల్ల అన్నం వంటి ఆహారాన్ని నిద్రవేళకు కనీసం 1 గంట ముందు తినడం నిద్ర నాణ్యతను మెరుగుపర్చడానికి సహాయపడుతుందని సూచించబడింది.

పాల ఉత్పత్తులు:

నిద్రకు ఉపయోగపడే ఆహార పదార్థాలుపాల ఉత్పత్తులు, ఒక గ్లాసు పాలు, చీజ్ మరియు సాదా పెరుగు వంటివి ట్రిప్టోఫాన్ యొక్క మూలాలు. వృద్ధులు రాత్రిపూట పాలు తాగితే మంచి నిద్ర పొందడం ఎక్కువ.

అరటి:

అరటి తొక్కలో ట్రిప్టోఫాన్ మంచిది. మరియు పండు మెగ్నీషియం పోషకాల యొక్క మూలం. ఈ రెండు లక్షణాలు మీకు మంచి నిద్ర పొందడానికి సహాయపడతాయి.

నిద్రకు ఉపయోగపడే ఆహార పదార్థాలుమీ ఆరోగ్యానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం. అనేక ఆహారాలు మరియు పానీయాలు నిద్రపోవడానికి సహాయపడతాయి. ఎందుకంటే వాటిలో స్లీపింగ్ ఏజెంట్లు మరియు మెలటోనిన్ మరియు సెరోటోనిన్ వంటి మెదడు రసాయనాలు ఉంటాయి. కొన్ని ఆహారాలు మరియు పానీయాలలో కొన్ని యాంటీఆక్సిడెంట్లు మరియు మెగ్నీషియం మరియు మెలటోనిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి, ఇవి నిద్రను పెంచడానికి మరియు నిద్రను పొందడానికి సహాయపడతాయి.

 

గర్భవతులు తక్కువ నీటిని తీసుకోవడం వల్ల వారిలో వచ్చే సమస్యలు ఏంటి?

0

చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి ఆరోగ్య రహస్యం నీళ్లు. నీళ్లు ఎక్కువగా తాగే వారు అనారోగ్యాల బారిన పడరు. అందుకే వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకోవాలని చెబుతుంటారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే అధిక నీరు అవసరం అవుతుంది. ఇక మనం బయటికి వెళ్లి పనులు చేస్తున్నప్పుడు మన శరీరంలోని నీటి శాతం చెమట రూపంలో బయటకు వెళుతుంది.

ow water intake in pregnant womenఅందుకోసం మనం ప్రతిరోజు ఐదు నుంచి ఆరు గ్లాసుల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. మరి గర్భవతులు రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తీసుకోవాలి? తక్కువ నీటిని తీసుకోవడం వల్ల వారిలో వచ్చే సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ow water intake in pregnant womenసాధారణంగా గర్భిణీ స్త్రీలు రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. అదే బిడ్డకు పాలు ఇస్తే ఆ సమయంలో రోజుకు 13 గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఎందుకంటే? గర్భవతులుగా ఉన్నప్పుడు శరీరానికి అధిక రక్తం, ఉత్పత్తి చేయడానికి అధిక ద్రవాలు అవసరమవుతాయి.

ow water intake in pregnant womenగర్భిణీ స్త్రీలు ఎక్కువగా నీటిని తీసుకోవడం వల్ల అంతర్గత వ్యవస్థలన్నీ బాగా పనిచేస్తాయి, ఇంకా శరీర వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా మూత్రపిండాల ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. నీటిని మాత్రమే కాకుండా అధిక మోతాదులో పండ్ల రసాలను కూడా తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలు డీహైడ్రేట్ కాకుండా ఉంటారు.

ow water intake in pregnant womenఅయితే అధిక మొత్తంలో నీటిని ఒకేసారి తీసుకోవడం వల్ల కూడా సమస్యలు తలెత్తుతాయి. అలా కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు నీటిని తీసుకునేలా చూసుకోవాలి. ఇలా నీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల శిశువు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది.

ow water intake in pregnant womenవీలైనంతవరకు గర్భిణీ స్త్రీలు ఎండలో తిరగకపోవడం మంచిది. అలా వెళ్ళినప్పుడు తొందరగా డీహైడ్రేట్ అవుతారు. అంతేకాదు డీహైడ్రేట్ అయిన గర్భిణీ స్త్రీలు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగడం ద్వారా తొందరగా రీహైడ్రాట్ అయ్యే అవకాశం ఉంటుంది.

 

8 Crazy Raps By Noel In BB4 House Is A Proof That He Is ‘Rap Ka Baap’

0

Navvinchaado, yedipinchaado, motthaaniki ayithe Biggboss lo yedho okati alarinchaadu… Andharinii kakapoyinaa kondharikayinaa favourite ayyi untaaru kadhaa… Title choosaruga, Noel anna gurinche chebuthundhi… Konni saarlu emotional ga, konni saarlu manchigaa, konni saarlu crazy ga kanipinche aayana Biggboss lo unna rojullo appatikappude konni raps spontaneous ga paadesevaaru… Character assassination, adhii idhii anthaa pakkana padithe spontaneous ga chesinaa koodaa chaalaa varaku baagunnaay… Adhii goppa vishayam… So avento chooddhaam… Padhandi ika…..

1) Bigg Boss uu

2) 1st Elimination – Nagarjuna gaaru

23) Boat elimination task

34) Biggboss talent show

45) Detthadi – Elimination

56) Bandheeni kaadhu nenu – Noel in Jail episode

67) Manishalle manasetti aadaamandi

78) Kashtapadi Telugu – Monal

8Inkaa yemannaa miss ayithe mari comment box mi kosamegaa…

Jai Jawan – Jai Kisan – Jai Sramik

15 Memes Which Perfectly Sum Up The ‘Winter & Rainy’ Situation In Mana Telugu States

0

2020 ippudu appude vadilelea ledu…corona valla jaragalsina damage antha jarigindi…ending aina manchiga untundi anukunnaru antha. Kani ala aithe nenu 2020 enduku avtha anukundemo mna 2020 Nivar Toofan roopam oka headache ni techi pettindi.

Already winter chali ki chastunname babu ante mallli deeniki thodu vaana, challa gaali assala Telugu states lo unnamo North states lo unnamo ane range lo climate change aipoindi.

Mari mana telugu states lo unna e situation ni some hilarious memes dwara chusi relate chesukundam padandi…

1.

3.

2.

10.

3.

1.

4.

6.

5.

7.

6.

13.

7.

15.

8.

12.

9.

8.

10.

2.

11.

14.

12.

9.

13.

4.

14.

5.

15.

11.

తోటకూర తినడం వలన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

0

మార్కెట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుతున్న తోటకూరలో లెక్కలేనన్ని పోషకాలు ఉన్నాయి. వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీల శక్తి శరీరానికి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు ఒక్కతోట కూరలోనే లభిస్తాయి.

health benefits of eating thotakuraఅయితే తోటకూర గడ్డిలా ఉంటుందనే కారణంతో చాలామంది దీన్ని దూరం పెడుతున్నారు. దాంతో శరీరానికి లభించే ఎన్నో పోషకాలను మిస్ అవుతున్నారు. మనం తినే ఆహారంలో తోట కూరను చేసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..

health benefits of eating thotakuraతరచూ తోటకూరను తినడం వల్ల బరువు తగ్గిపోవచ్చు. శరీరంలోని అనవసరమైన కొవ్వును ఇది హరిస్తుంది. తక్షణ శక్తికి తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుని తిన్న తోటకూర అయితే చాలా ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.

  • ఇది అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుంది.
  • హైపర్ టెన్షన్‌తో బాధపడేవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
  • తోటకూరలోని ‘విటమిన్ సి’ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్ నుంచి మరో సీజన్‌కు వాతావరణం మారినప్పుడు శరీరం తట్టుకుంటుంది.

health benefits of eating thotakura

  • తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.. తలకు పట్టించుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు రాలదు. మాడు పై ఉన్న చుండ్రు తగ్గుతుంది.
  • కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్ఫరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి.
  • ఇవి రక్తనాళాన్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలుచేసి సోడియం, పొటాషియం వంటివన్నీ సమకూరుతాయి.

health benefits of eating thotakura

  • విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్ ఎ, సి, డి, ఇ, కె, విటమిన్ బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు.. ఇవన్నీ సమకూరుతాయి.

 

తథాస్తు దేవతలు అంటే ఎవరు? వాళ్ళు నిజంగా ఉంటారా?

0
తథాస్తు దేవతలు

ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. కానీ తధాస్తు నిజంగా ఉంటారా? వాళ్ళు తథాస్తు అంటే అది నిజమైపోతుందా? అది తెలుసుకోవాలంటే పురాణాల్లోని ఓ కథ తెలుసుకోవాలి.

తథాస్తు దేవతలువేదాలలో ‘అనుమతి’అనే దేవతలు ఉండేవారు. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతలను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించేలా సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. తథాస్తు దేవతలనే అశ్వినీ దేవతలని కూడా అంటారు.

తథాస్తు దేవతలువీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్ రూపంలోనున్న సూర్యుడు, ఛాయాదేవిలకు వీరు జన్మించారు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. అందుకే వారిని తథాస్తు దేవతలు అంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు.

తథాస్తు దేవతలుఉదాహరణకు కొంతమంది ఎంత డబ్బు ఉన్నా తరచూ డబ్బు లేదు లేదు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు.

తథాస్తు దేవతలుకొన్ని సార్లు అనారోగ్యానికి గురైనపుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్లండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. అయితే హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీని వల్ల మంచి పేరు రావడం జరుగుతుంటుంది.

 

కార్తీకమాసంలో దానాలు చేయడం వలన కలిగే అద్భుత ఫలితాలు

0

కార్తీక మాసం అంటే స్నాన, దాన, జపాలు, పూజలు, దీక్షలు ,ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వలన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం. కార్తీకమాసం శివ,కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం.

కార్తీక మాసంకార్తీకమాసంలో ప్రతీరోజూ తెల్లవారు ఝూమునే కార్తీక స్నానమాచరించడం, నిత్యం దీపాన్ని వెలిగించడం, ఆరాధించడం, నదిలో దీపాలను వదలడం, ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించడం వలన పాప దోషాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది.

కార్తీక మాసంహిందూ సాంప్రదాయంలో కార్తీక మాసానికి పెద్ద ప్రాధాన్యత ఉంది. ఈ కార్తీకమాసంలో దానాలు చేయడం వలన అద్భుత ఫలితాలు ఉంటాయి. అదే సమయంలో జీవితం కూడా సార్థకమవుతుందని వేదాలు చెబుతున్నాయి. అవేమితో చూద్దాం..

కార్తీక మాసం1. గోదానం చేస్తే – ఋణ విముక్తులవుతారు. ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.

2.భూ దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది.

3.వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతుంది.

4.బంగారం దానం చేస్తే – దోషాలు తొలుగుతాయి.

5. వెండిని దానం చేస్తే – మనశ్శాంతి కలుగుతుంది.

6.పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.

7.పెరుగు దానం చేస్తే – ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.

8. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్యంగా ఉంటారు.

9. తేనె దానం చేస్తే – సంతాన ప్రాప్తి కలుగుతుంది.

10. టెంకాయ దానం చేస్తే – అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.

11. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.

12. పండ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.

13. అన్న దానం చేస్తే – పెదరికం పోయి, ధన వృద్ధి కలుగుతుంది.

14. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

15. దీపాలు దానం చేస్తే – కంటి చూపు మెరుగు పడుతుంది.

 

దత్తాత్రేయుడు జంభాసురుణ్ణి ఎలా సంహరించాడు?

0
దత్తాత్రేయుడు

గురు అవతారం దత్తాత్రేయుడు పరమాత్మ ఒక్కో సమయంలో ఒక్కో అవతారంలో వచ్చి ప్రజల్ని ఉద్ధరిస్తాడు. ధర్మావతారాల్లో రాముడిగా, కృష్ణుడిగా రాక్షస సంహారం ద్వారా ధర్మసంస్థాపన జరిపిన నారాయణుడే దత్తాత్రేయుడి అవతారంలో సమర్థ గురువుగా జ్ఞానప్రబోధ చేశాడు. దత్తాత్రేయుడు శ్రీమన్నారాయణుడి ఆరో అవతారమని భాగవతమూ, విష్ణుపురాణమూ ఘోషిస్తున్నాయి. అత్రి మహర్షి, అనసూయ దంపతుల తనయుడిగా జన్మించాడు బాలదత్తుడు. ఆ దంపతులు ఓంకారాన్ని ధ్యానిస్తూ మహాతపస్సు చేశారు. ఆ సాధనకు మెచ్చి ఓ దివ్య తేజస్సు ప్రత్యక్షమైంది.

దత్తాత్రేయుడుఆ కాంతిపుంజంలో త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఆ ముగ్గురు మూర్తుల అంశగా దత్తుడు వారికి జన్మించాడు. అత్రి అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడని అర్థం. అతడి అర్ధాంగి అనసూయ అసూయలేనిది. నిజానికి ఇవి పేర్లు కాదు ఆ ఆలూమగల సుగుణాలు. ఆ సద్గుణ సంపన్నుల బిడ్డగా జన్మించాడు దత్తుడు. దత్తం అంటే సమర్పించుకోవడం. దత్తుడు జ్ఞానబోధ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు. అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడన్న పేరూ వచ్చింది.

దత్తాత్రేయుడుదత్తుడిది జ్ఞానావతారం పిచ్చివాడిలానో, వ్యసనపరుడిలానో కనిపించి పైపై మెరుగులకు భ్రమపడిపోయే అజ్ఞానులకు బుద్ధిచెప్పిన ఉదంతాలు అనేకం. దేవతలకు కూడా చేతిలో కల్లుముంతతో, ఒడిలో ప్రియురాలితో దర్శనమిచ్చాడోసారి. అది సుర కాదు, బ్రహ్మజ్ఞానం. ఆమె శ్రీలక్ష్మి. దత్తుడు ఓపట్టాన అర్థం కాడు. దత్తతత్వాన్ని తెలుసుకోవాలంటే అహాన్ని వదిలిపెట్టాలి. శరణాగతి సూత్రాన్ని పాటించాలి.

దత్తాత్రేయుడుపూర్వం జంభాసురుడనే రాక్షసుడు ప్రజల్ని హింసించేవాడు. దీంతో దేవతలంతా విష్ణు స్వరూపుడైన దత్తాత్రేయుడిని ప్రార్థించారు. ఆ రాక్షసుడిని నా దగ్గరికి తీసుకురండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని మాటిచ్చాడు. దీంతో దేవతలు జంభాసురుడి మీద కయ్యానికి కాలుదువ్వుతున్నట్టు నటించారు. ఆ అసురుడికి కోపం తన్నుకొచ్చింది. ఇంతకుముందే చావుదెబ్బ తీశాను.

దత్తాత్రేయుడుఅంతలోనే ఇంత ధైర్యం ఏమిటి? అంటూ కోపంగా మళ్లీ రంగంలో దూకాడు. దేవతలు ఉద్దేశపూర్వకంగా వెన్నుచూపారు. జంభాసురుడు వాళ్లను తరుముతూ వెళ్లాడు. దత్తుడి సమక్షంలోకి వెళ్లగానే ఠక్కున మాయమైపోయింది దేవగణమంతా. ఎదురుగా ఒడిలో అందాల రాశితో, మహాభోగిలా దర్శనమిచ్చాడు దత్తాత్రేయుడు. జంభాసురుడి కళ్లు ఆ సౌందర్యరాశి మీదికి మళ్లాయి. ఆమె శ్రీమహాలక్ష్మి అన్న ఇంగితం కూడా లేకుండా బలవంతంగా తీసుకెళ్లి నెత్తిమీద పెట్టుకున్నాడు. సంపద నెత్తికెక్కిందంటే, పతనం మొదలైనట్టే. జంభాసురుడి బలం క్షీణించసాగింది. దేవతల పని సులువైపోయింది. అసుర సంహారం జరిగిపోయింది.

 

ఎముకలు బలంగా ఉండాలంటే మీ ఆహార అలవాటులో ఇవి తప్పనిసరి

0
ఎముకలు బలంగా

కింద జారిపడగానే కాలో, చెయ్యో సులభంగా విరిగిపోతుంది కొందరికి. పిల్లలైతే ఆడుకుంటూ ఎముకలు విరగ్గొట్టుకునే సందర్భాలు ఎన్నో. వయసు మీద పడిన వాళ్లైతే చాలా సార్లు బాత్రూముల్లో జారి పడి గాయాలపాలవుతారు. వయసు మీరాక కీళ్లు, మోకాళ్ల నొప్పులు మామూలే. ప్రమాదాల్లో దెబ్బతగిలేది ఎముకలకే. అయితే ఎముకలు బలంగా ఉన్నప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరిగినా ఎముకలు విరిగి పోకుండా ఉంటాయి. అందుకే ఎముకల్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం.

2 Mana Aarogyam 222శరీరానికి అసలైన నిర్మాణాన్ని ఇచ్చేవి ఎముకలే. ఇవి బలంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు. ఇవి కూడా ఎప్పటికప్పుడు కొత్తగా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. ముప్పయ్యేళ్ల వరకు ఎముకల అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఆ తర్వాత వాటిలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆపై వయసు పెరిగేకొద్దీ ఎముకలు బలహీనమవుతాయి. అయితే సరైన పోషకాహారం తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వయసుతోపాటు వచ్చే కీళ్లు, మోకాళ్ల అరుగుదలకి చెక్ పెట్టొచ్చు. పిల్లల్లో ఎముకలకు తగిన పోషణ అందిస్తే వాళ్లలో ఎదుగుదల బాగుంటుంది. వృద్ధులైతే గాయాలపాలు కాకుండా చూసుకోవచ్చు.అయితే మనం రోజు తీసుకునే ఎటువంటి ఆహారంలో కాల్షియం లభిస్తుందో చూద్దాం.

ప్రొటీన్:

eating habits to keep bones strongఎముకల్లో యాభై శాతం ప్రొటీన్ ఉంటుంది. అందువల్ల ఎముకల ఆరోగ్యానికి ప్రొటీన్ తప్పనిసరి. ప్రొటీన్ తగ్గితే క్యాల్షియం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ప్రొటీన్ తగ్గడం వల్ల శరీరం క్యాల్షియంను గ్రహించే శక్తిని కోల్పోతుంది. పెద్దవాళ్లు సగటున రోజుకు వంద గ్రాములకుపైగా ప్రొటీన్ తీసుకోవాలి. ప్రొటీన్ తగినంత తీసుకుంటే స్త్రీలలో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

పాలు:

eating habits to keep bones strongపాలలో కాల్షియం ఎక్కువ. రోజూ పాలు తాగితే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా అవుతాయి.

నారింజ:

eating habits to keep bones strongనారింజల్లో కాల్షియం ఎక్కువ. ఒక నారింజ పండులో 60 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే వాటిలోని విటమిన్ D, సిట్రస్ శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

బాదం:

eating habits to keep bones strongబాదం పప్పులు తింటే ఎన్నో లాభాలు. ఓ కప్పు వేపిన బాదం పప్పుల్లో 457ml కాల్షియం ఉంటుంది. ఇది బోన్లకు బలమే కాదు, బాడీలో ప్రోటీన్లను కూడా పెంచుతుంది

అంజీర పండ్లు:

eating habits to keep bones strongతరచుగా అంజీర పండ్లు డ్రై అంజీర అయినా సరే తింటే బాడీలో కాల్షియం పెరుగుతుంది. ఓ కప్పు అంజీరలో 242ml ఉంటుంది. తరచూ అంజీర తింటే ఎముకలు గట్టిగా అవుతాయి.

పెరుగు:

eating habits to keep bones strongపెరుగులో కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. కొంత మందికి పాల రుచి నచ్చదు. వారు పెరుగు తినడం ద్వారా కాల్షియం పెంచుకోవచ్చు. అంతే కాకుండా పాలతో తయారుచేసే సీట్లు, జున్ను ఇతర పదార్థాల్లో కాల్షియం ఉంటుంది. వెన్నలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎముకల్ని పటిష్టంగా చేస్తుంది.

 

డెలివరీ తరువాత బరువు పెరగకుండా ఈ చిట్కాలు పాటించండి ?

0

గర్భవతిగా ఉన్నప్పుడు బరువు పెరగడం అనేది సాధారమైన విషయమే. కొంతమంది ప్రసవం తరువాత బరువు తగ్గిపోతారు. కానీ, కొంతమంది మహిళలు మాత్రం ప్రసవం అయిన తరువాత కూడా బరువు తగ్గకపోగా ఇంకా బరువు పెరుగుతారు.

tips to not gain weight after deliveryబరువును అదుపులో పెట్టుకోడానికి చాలామంది వ్యాయామం చేయాలనుకుంటారు. కానీ, ప్రసవం తరువాత ఎటువంటి ఒత్తిడి పడకూడదని, అలాగే విశ్రాంతి కూడా తీసుకోవాలని డాక్టర్లు చెబుతారు. ఇలా రెస్ట్ తీసుకోవడం వల్ల శారీరక శ్రమ ఉండదు. కాబట్టి దాని వల్ల డెలివరీ తర్వాత ఎక్కువ బరువు పెరుగుతారు. మరి ప్రసవం తరువాత బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

tips to not gain weight after deliveryబరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సాధారణంగా చాలామంది చేసే పెద్ద తప్పు భోజనం తినకుండా ఉండటం లేదా తక్కువ తీసుకోవడం. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతామని అనుకుంటారు. నిజానికి అది పొరపాటు. రోజులోని ముఖ్యమైన భోజనాన్ని తీసుకోకపోవడం వల్ల శరీరం ఆకలితో ఉంటుంది. శరీరంలోని జీవక్రియ ప్రక్రియ కూడా మందగిస్తుంది. ఇలా మందగించడం వల్ల మీరు తినే పరిమిత ఆహారం నుండి ఎక్కువ కొవ్వును తీసుకోవడమే కాకుండా దాన్ని శరీరంలో నిల్వ చేస్తుంది. ఇది మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది.

tips to not gain weight after deliveryఇలా భోజనాన్ని మానెయ్యటానికి బదులుగా ఆహారంలో కావలిసిన పోషకాలు ఉండేలా భోజనాన్ని మార్చుకోవచ్చు. ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం కంటే, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం బరువు తగ్గే విషయంలో మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రసవం తరువాత షుగర్, వేయించిన ఆహార పదార్ధాలను తినడం పూర్తిగా మానెయ్యాలి. ఈ సమయంలో శరీరానికి విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు వంటి సరైన పోషకాలు అవసరం, వీటిని ఆరోగ్యకరమైన ఆహారాల నుండి సులభంగా పొందవచ్చు.

tips to not gain weight after deliveryఇంకా చాలా మంది నిద్ర ఎక్కువ పోవడం వల్ల శరీర బరువు పెరుగుతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. తగినంత నిద్రపోవడం వల్ల ఎనర్జీ రావడమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. ప్రసవం తర్వాత ఆరోగ్యకరమైన ధాన్యాలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల బరువు తగ్గుతారు.

 

గుడికి వెళ్లడం వలన మనసు ఎందుకు ప్రశాంతంగా మారుతుంది ?

0

పుట్టినరోజు పూట మనం ముందుగా చేసే పని ఏంటి? తలారా స్నానం చేసి గుడికెళ్ళి దేవుడి ఆశీర్వాదాలు తీసుకుంటాం. ఇక ఏదైనా పండగ వచ్చిందంటే ఉదయాన్నే వెళ్లి భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకోమని చెబుతారు. తరుచూ గుడికి వెళ్లడం అనేది చాలా మందికి అలవాటుగా ఉంటుంది. గుడికి వెళ్లడం అనేది పెద్దలు ఎంతో అనుభవంతో మనకు నేర్పిన సలక్షణం.

Templeఅయితే గుడికి వెళ్ళడం వెనుక మర్మమేమిటో తెలియకుండా మనం పెద్దలు చెప్పిన ప్రకారం గుడికి వెళ్ళి పూజలు చేస్తుంటాం. మరి నిజంగా గుడికి వెళితే మనకు అంతటి ప్రేరణ, ప్రశాంతత వస్తుందా? గుడిని దర్శించుకోవడం వెనుక ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Templeఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలాగే భూమిలో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తూ ఉంటుంది. అది భూమి స్వభావం. ఆ ప్రాంతంలో ఉండే ఖనిజాలు, లోహాలను అనుసరించి ఉంటుంది. అందుకే ఆలయం నిర్మించడానికి అప్పట్లో కొన్ని ప్రత్యేక ప్రదేశాలను మాత్రమే ఎన్నుకునేవారు. ఆ గుళ్లలోకి వెళ్లగానే శరీరం ఒక్కసారిగా చల్లబడుతుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇది కావాలంటే పరిశీలించి చూడడండి.

Templeఎంపికైన ప్రదేశంలో దేవాలయం, ఆకర్షణ శక్తి అధికంగా ఉన్న కేంద్రంలో మూలవిరాట్టును ప్రతిష్టింప చేస్తారు. వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు)ను విగ్రహం కింద నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.

Templeఅందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూలవిరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ప్రతి రోజు గుడికి వెళ్ళేవారిలో దివ్యశక్తి చేరడాన్ని మనం గమనించవచ్చు. గుడి వెళ్ళి వచ్చేవారు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది.

Templeఅందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే. ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు మరింత శక్తిని సమకూరుస్తాయి.

 

పెళ్లి అయిన తరువాత “అరుంధతి” నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు ?

0

పెళ్లి అయిన తరువాత “అరుంధతి” నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు. ఈ ప్రశ్న నేటిదికాదు, నాటిదేనని చెబుతున్నది సూత సమ్హితా శౌనకాది మహర్షి గణాలకు ఒకసారి ఇదే సందేహం కలిగింది. దీనిని వారు త్రికాలవేత్త సమస్త పురాణ వ్యాఖ్యానదక్షుడు అయినటువంటి సూతుని ముందుంచగా ఆయన అరుంధతీ దేవి ప్రాముఖ్యతను ఇలా వివరించాడు.

అరుంధతి నక్షత్రాన్నిఅరుంధతీ, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది. ఈ అయిదుగురు స్త్రీ మూర్తులు సదా పూజించదగిన పతివ్రతలు . అరుంధతిదేవి పతివ్రతలో అగ్రగామి. ఈమె చరిత్రను స్మరించినంతనే పుణ్యం కలుగుతుందని ‘నైమిసమ్హితా పేర్కొంటోంది. అసక్తికరమైన అరుంధతి జన్మవౄత్తాంతాన్ని ఇపుడు మీకు చెప్పబోతున్నాను అన్నాడు సూత మహాముని. ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత తేజోవితయైన ఒక కన్యను, వర్ణింప శక్యంకానీ ఓక సుందరుని సౄష్టించాడు. ఆ కన్య పేరు సంధ్యా. యువకుని పేరు మన్మథుడు. సౄష్టికార్యంలో తనకు సాయపదమని చెబూతూ బ్రహ్మ ఆ యువకునికి అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు సమ్మోహన బాణాలను అందించాడు.

అరుంధతి నక్షత్రాన్నిబాణశక్తిని పరీక్షింపదలచిన మన్మథుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టగా, బ్రహ్మతో సహా అందరూ అక్కడే ఉన్న ‘సంధ్యా ను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుని ప్రార్థించగా, స్వామి అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచాడు. రెప్పపాటుకాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సౄష్టికర్త కోపించి మన్మథుని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు.

అరుంధతి నక్షత్రాన్నితనవల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో ‘సంధ్యా చంద్రభాగా నదీతీరంలో తపస్సు పేరిట తనువు చాలించదలచి పయనమై పోయింది. అపుడు బ్రహ్మ వశిష్టమహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించమని కోరగా, వశిష్టుడు ఆమెకు ‘శివా మంత్రానుష్టానమును వివరించి తన ఆశ్రమానికి వెల్లిపోయాడు. సంధ్య తదేకనిష్టలో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మని కోరగా ఆమె ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాదనే వరాన్ని అనుగ్రహించమంది.

అరుంధతి నక్షత్రాన్నిశివుడు ఆమె లోకోపకార దౄష్టికి సంతోషించి మరో వరాన్ని కోరుకోమన్నాడు. అపుడు సంధ్య నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదౄష్టిలో చూచినట్లయితే, వారు నపుంసకులుగా మారాలి, అంతేకాదు నేను పుట్టగానే అనేకమందికి కామవికారాని కల్గించాను. కాబట్టి ఈ దేహం నశించిపోవాలీ అని కోరింది. శివుడు తథాస్తూ అని మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదౄశ్యురాలివై శరీరాన్ని దగ్దం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్థానమయ్యాడు.

అరుంధతి నక్షత్రాన్నిశివాజ్ణ్జగా సంధ్యా శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుండి తిరిగి జన్మించింది. సంస్కౄత భాషలో ‘అరుం’ అంటె అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. ‘ధతీ అంటె ధరించినది అనే అర్థం వున్నది. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె అరుంధతీ అనబడింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి వశిష్టునకు ఇచ్చి వివాహం జరిపించాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వలన త్రిలోకపూజ్యురాలైంది.

అరుంధతి నక్షత్రాన్నిఈ దంపతులకు పుట్టినవాడే శక్తీ. శక్తికి పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు జన్మించారు. అరుంధతిని మనవారు ‘ఆరని జ్యోతీ అని ‘అరంజ్యోతీ అని పిలుస్తూంటారు. విష్ణుసహస్రనామాల్లో సైతం అరుంధతి సంతతి గురించి, మనమలు, మునిమనమలు గురించి ప్రస్తావించబడివుంది.

అరుంధతీ నూతన దంపతులకు ఇచ్చే దీవెనలు:

అరుంధతి నక్షత్రాన్నికొత్తగా పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తఋషి మండలంలో వున్న వశిష్టుని తారకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు. దీనివెనుక ఒక ప్రధాన కారణమున్నది. వశిష్ట, అరుంధతీ స్వయం ఆదర్శ దంపతులకు ఒక ప్రతీక. కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు ఆ దంపతులిద్దర్ని తారారూపంలో వీక్షింపచేస్తూ రావడం ఒక సాంప్రదాయమైంది

 

15 ‘Jetix’ Shows Every 90’s Kid Was Madly In Love With

0

– Describe your Childhood?

– Cartoon Network and Jetix.

Anthe mana balyam lo Cartoon Network and Jetix channels tho spend chesina time inka denitho chesi vundam. Appati cartoons ni ippatiki gurtuku thechukunna happy tears vasthai. Mukyamga Jetix channel (2004 – 2009) 5 years ye unna manaki yenno memorable shows ni anthaku minchi happy memories ni migilchindi.

So, let’s go back to our childhood and recollect all those memories

1.Galactik Football

2.Dragon Booster

3.Martin Mystery

4.Super Robo Monkey Team Hyper Force Go!

5.Goosebumps

6.Power Ranger Series

7. George of the jungle

8.Inspector gadget

9. Tutenstein

10. Legend Of Tarzan

11. Timon And Pumba

12. Duck Tales

13. Uncle Teddy

14. Gargoyles

15. American Dragon

https://youtu.be/yOR4llXDNhc

గ్యాస్ ప్రాబ్లెమ్ ఉందా అయితే ఈ చిట్కాలు తప్పక పాటించండి

0
Tips for reducing gas

ప్రస్తుత ఆహారపు అలవాట్లతో చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్య గ్యాస్ ప్రాబ్లెమ్. గ్యాస్ అనేది రెండు విధాలుగా సంభవించవచ్చు. ఒకటి తిన్నప్పుడు రెండోది త్రాగినప్పుడు. ఈ సమస్య వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, ఉదర భారము, గుండెల్లో మంటకు దారితీస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆహారం జీర్ణం అయినప్పుడు హైడ్రోజన్, మీథేన్ లేదా కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులను బహిష్కరించి కడుపులో నిల్వ చేయవచ్చు.

Tips for reducing gasఅటువంటి వాయువు సరిగా లేదా అధికంగా బహిష్కరించబడకపోతే, అది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు, ముఖ్యంగా బీన్స్, క్యాబేజీ, చిక్కుళ్ళు లేదా చక్కెర పానీయాలు కడుపు ద్వారా సులభంగా జీర్ణమయ్యేవి కావు. అందుకనే అటువంటి ఆహార పదార్ధాలను దూరం పెట్టండి. వాటితో పాటు మరికొన్ని చిట్కాలు పాటిస్తే గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

Tips for reducing gasవాము అందరి ఇళ్లల్లో దోరికేదే. ఈ విత్తనాలలో థైమోల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కాబట్టి ఆహారాన్ని తినడం వల్ల వచ్చే గ్యాస్ ని నివారించాలనుకుంటే, 1/2 టీస్పూన్ వాము విత్తనాలను నీటిలో వేసి రోజూ ఉడకబెట్టి ఈ నీటిని త్రాగాలి.

Tips for reducing gasఅలాగే జీలకర్ర కూడా గ్యాస్ సమస్యకు ఉపశమనం ఇస్తుంది. జీలకర్రలోని ముఖ్యమైన నూనె లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తుంది, ఆహారాలను బాగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను 2 కప్పుల నీటిలో ఉంచండి, 10-15 నిమిషాలు ఉడకబెట్టి, తిన్న తర్వాత దాన్ని తాగాలి.

Tips for reducing gas1/2 టీస్పూన్ ఇంగువ పొడి 1 స్పూన్ వెచ్చని నీటితో కలిపి త్రాగాలి. ఇలా చేయడం ద్వారా గ్యాస్ సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు.

Tips for reducing gasఒక టీస్పూన్ నిమ్మరసంతో ఒక టీస్పూన్ మెత్తగా తురిమిన అల్లం కలపండి దాన్ని భోజనం తర్వాత తినండి, తద్వారా గ్యాస్ సమస్య ఉండదు.

Tips for reducing gasఉదయాన్నే టీ తాగేటప్పుడు కొంచెం అల్లం ముక్కను అందులో వేసుకుని తాగినా త్వరిత ఉపశమనం ఉంటుంది.

 

శ్రీలక్ష్మీ ఫలం లక్ష్మీదేవి స్వరూపంగా ఎందుకు కొలుస్తారు ?

0

శ్రీఫలాన్నే ఏకాక్షి నారికేళం,లఘు నారియల్,లక్ష్మీ నారికేళం,పూర్ణఫలం అనికూడ అంటారు.చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ అని పెద్దల వాక్యం. మనస్సే అన్నింటికీ కారణం. ఆ మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుని కళలతో మనస్సు ప్రభావితం అవుతుందని పెద్దలు చెబుతారు. రక్త హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యాధులు, వరబీజము, బేదులు, మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, కేన్సర్(రాచ పుండు) మొదలైన వాటికి చంద్రుడు కారకుడు.

శ్రీలక్ష్మీ ఫలంచంద్రుని ఆధారంగా ఆ నక్షత్రం యొక్క ప్రభావంతో వారి వ్యక్తిత్వాన్ని అంచనావేస్తాం. అంటే మనస్సు, తెలివితేటలు, గ్రహణశక్తి, మతిమరుపు, చిత్తచాంచల్యం, ఇంద్రియనిగ్రహం, సౌందర్యం, లావణ్యం, శరీరసౌఖ్యం మొదలైనవి. సూర్యచంద్రకాంతుల ప్రభావం మనపై ఉంటుంది. సూర్యకాంతి వల్ల శారీరక ఆరోగ్యం, చంద్రకాంతి వల్ల మానసిక ఆరోగ్యం కలుగుతాయని గుర్తించాలి. అందుకే ఇంటిలోకిసూర్య, చంద్రకాంతి పడేలా చూసుకోవాలని శాస్త్రం చెబుతోంది. క్షార వృక్షములకు చంద్రుడు అధిపతి. జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వాళ్ళు ,బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించాలి. శ్రీపలాన్నే లఘు నారికేళం అని కూడ అంటారు.సముద్ర తీర ప్రాంతాలలో క్షార వృక్ష జాతికి చెందిన వృక్షాలయందు దొరుకుతాయి.

శ్రీలక్ష్మీ ఫలంశ్రీలక్ష్మీ ఫలాలు కొన్నిబూడిద రంగులో ఉంటాయి.కొన్ని తెలుపు రంగులో ఉంటాయి.శ్రీలక్ష్మీ ఫలం చూడటానికి చిన్న సైజులో ఉన్న దీనిప్రభావం చాలా శక్తి వంతమైనవి. శ్రీలక్ష్మీ ఫలం అనేది కొబ్బరికాయ ఆకారంలో పెద్దసైజు ఉసిరికాయ ఆకారంలో ఉంటాయి.కొబ్బరికాయలాగే దీనికి కూడా పీచు ఉంటుంది.పీచు దిగువున మామూలు కొబ్బరికాయలకు ఉండే విధంగానే మూడు బిందువులు ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు.

శ్రీలక్ష్మీ ఫలంశ్రీలక్ష్మీ ఫలాన్ని ఏదైనా శుభముహూర్తంలో ఇంటికి తెచ్చుకొని శుభ్రమైన నీటితో కడిగి పవిత్ర గంగాజలంతో అభిషేకించాలి.ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పసుపు,గంధం శ్రీలక్ష్మీ ఫలానికి మొత్తం పూయాలి.తరువాత కుంకుమతో బొట్ట్లు పెట్టాలి. శ్రీఫలమ్ చుట్టు పుష్పాలతో అలంకరించాలి. లవంగాలు,యాలకులు,పండ్లు నైవేద్యం ఇవ్వాలి.కర్పూరం,సాంబ్రాణితో ధూపం చూపాలి.తరువాత పసుపు గాని,ఎరుపు గాని,తెలుపు గాని వస్త్రాన్నితీసుకొని శ్రీలక్ష్మీ ఫలాన్ని ,కొన్ని నాణేలను గుడ్డలో చుట్టి పెట్టి లక్ష్మీ దేవి ప్రతిరూపంగా భావిస్తూ ధూపదీపనైవేద్యాలతో పూజించాలి.శ్రీలక్ష్మీ ఫలంతో పాటు పెట్టిన నాణేలను అప్పుడప్పుడు తీసుకొంటు,నాణేలను అప్పుడప్పుడు చేరుస్తూ ఉంటే ఇంట్లో ఎల్లప్పుడు ధనాభివృద్ధి ఉన్నట్లే. “ఓం శ్రీం శ్రియై నమః”అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపమాలతో జపం చేయాలి.

శ్రీలక్ష్మీ ఫలంజాతకంలో చంద్రుడు పాపస్థానాలలో ఉన్న నీచంలో ఉండి శుభగ్రహ దృష్టి లేకపోయిన మానసిక సమస్యలు ఎదుర్కొంటారు.అమావాస్య పౌర్ణమి రోజులలో ఉద్రేకాలకు లోనవుతారు.ఇలాంటి వారు ఎల్లప్పుడు శ్రీఫలాన్ని దగ్గర ఉంచుకుంటె మంచిది.శ్రీ ఫలం తాంత్రిక ప్రయోగాలకు ఎంతో ఉపయోగపడుతుంది. జాతకంలో చంద్రుడు అష్టమంలో ఉంటే బాలారిష్ట దోషం అంటారు.బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీపలాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి మెడలో గాని ,నడుముకి గాని కట్టుకోవాలి. ప్రజాపయోగ వ్యాపారసంస్థలలో,వాటర్,రియల్ ఎస్టేట్,పాల వ్యాపారసంస్థలలో తప్పనిసరిగా శ్రీపలాన్ని పూజించాలి. ఈ ఫలాన్ని నిత్యం పూజించే వారికి ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.శ్రీ ఫలాన్ని వ్యాపారస్ధలంలోను, ఆపీసుల్లో ఉంచిన సత్వర ఆర్ధికాభివృద్ధి ఉంటుంది. శ్రీ ఫలాన్ని పూజచేసుకొని దగ్గర ఉంచుకొనేవారికి డబ్బు వృధాగా ఖర్చు అవ్వవు. శ్రీ లక్ష్మీ ఫలంతో పాటు ఎల్లప్పుడు నాణేలను ఉంచాలి.

శ్రీలక్ష్మీ ఫలంశ్రీ ఫలాన్ని వ్యవసాయం చేసే వారు వ్యవసాయ సమయంలో భూమిలో ఉంచిన పంటలు బాగా పండుతాయి. వాయువ్య దిక్కు దోషం ఉన్నవారు 11 శ్రీపలాల్ని తెల్లగుడ్డలో చుట్టి వాయువ్య దిక్కున ఉంచిన దోష నివారణ జరుగుతుంది. పిట్స్,మతిమరుపు,స్త్రీలకు ఋతు సమస్యలు,గర్బాశయ సమస్యలు ఉన్న వారు శ్రీపలాన్ని పూజించి దగ్గర ఉంచుకోవాలి.

 

8 Present & Past BB Contestants Who Are Nothing But ‘ఆటలో అరటిపండులు’ For All The Right Reasons

0

Season 1 nundi Season 4 ante ippudu air avtunna Bigg Boss show anni seasons lo housemates andaru tama game tmau aduthu respective fame techukunnaru. Aithe prathi season lo assala game em adakunda…adina mostly vere valla game meedha depend avthu ‘ఆటలో అరటిపండులు’ ayyaru thappa game lo,house la peddga sadinchindi em ledu.

Season 1 nundi ippudu air avthunna Season 4 varaku ila ‘ఆటలో అరటిపండులు’ ani anipinchukunna players evaro oo sari chusthe…

Season 1

1.Jyothi

1Assala season 1 lo ime contribution em ledu…ala vacchi ila game adesi eliminate aipoyi vellipoyindi.

2.Diksha Pant

2Wild Card ga entry icchi konchem glamor dose tho Prince tho game adindi. Kani ee game ameki ekkada use avvaledu cheppalante Diksha ni addam pettukuni Prince eh konchem game play chesadu.

Season 2

3.Ganesh

3Bigg Boss season lo eppudu lenidi for the first time oka common man ki entry iccharu. Ee opportunity ni proper chesukovadam pakkana pedite assala house lo em cheyakunda evict aiyyadu Ganesh.

4.Tejaswi

4Kaushal vs House episode lo….Tanish, Samrat, Deepthi Sunanina tho friendship maintain chesi last bakra aindi Tejaswi. Ila kakunda own game adi unte one of the strong contestants ayyi undedi.

Season 3

5. Jaffar

5Ika tana interviews tho politicians ni and celebs ni mppu thippalu pette Jaffar show lo oragadisthadu anukunnaru. Kani assala em cheyakundane show lo nundi chala takkuva time lo eliminate aiyyadu.

6. Hema

7Ala vacchi ila vellipoyindi mana hema akka ee season lo for no reasons arati pandu tookala tisi avathala esaru.

Season 4

7. Surya Kiran

Whatsapp Image 2020 11 28 At 10.17.47 AmSeason 3 lo Hema lagane ee season loi Surya Kiran ala vacchi ila vellipoyadu.

8. Swathi Deekshith

8Wild card entry icchina housemates the worst evaraina unnaru ante adi ime ne ani cheppali. Vacchina one week ke em cheyakundane ila vacchi ala vellipoindi.

From Jallikattu To Swathi Muthyam: 13 South Indian Films That Got Nominated For The Oscars

0

Every year prapancham loni cini premikulu andaru excitement tho chusedi oke okka program ade Oscar ceremony. Ee Oscars daggara andaram okati aipotham, Oscar gelavadam anedi highest form of cinematic achievement.

Mana Indian films ki matram Oscars yeppudu doormagane unnayi chala mandi chala sarlu manchi indian films ni select cheyyakunda mediocre films pampadam valle Indian cinema ki Oscars rakapovadam reason antaru. Last year Tumbbad lanti film ni select cheyyakunda Gully Boy ni India entry ga Oscars ki pampinappudu pedda rachaye jarigindi. And most of the time Bollywood films ni yekkuva Oscar entries ki pampistaru.

But ee year Malayalam ‘Jallikattu’ ni Indian Oscar entry ga pampadam andari lo hope kaligistundi. Ila past lo south indian films evi Indian Oscar entries ki vellayo chuddam padandi…

1) Deiva Magan (1969)

2) Swati Mutyam (1986)

3) Nayakan (1987)

4) Anjali (1990)

5) Thevar Magan (1992)

6) Kuruthipunal (1995)

7) Indian (1996)

https://youtu.be/QLorNHCRAZI

8) Guru (1997)

9) Jeans (1998)

10) Hey Ram (2000)

11) Adaminte Makan Abu (2011)

12) Visaranai (2016)

13) Jallikattu (2020)

పీరియడ్స్‌లో వచ్చే నొప్పి తగ్గాలంటే ఇలా చేయండి

0
పీరియడ్స్‌

మహిళలను ఇబ్బంది పెట్టే ప్రధాన సమస్య నెలసరి. చాలా మంది స్త్రీలు రుతుస్రావం సమయంలో కడుపు నొప్పి, నడుం నొప్పితో బాధపడుతుంటారు. నాలుగు రోజులపాటు తీవ్ర వేదన అనుభవిస్తారు. నెలసరి వచ్చినప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా కడుపు నొప్పి, మాటిమాటికీ కోపం రావడం, చిరాకు అధికమవుతాయి. హార్మోన్ల మార్పుల కారణంగా మూడ్ కూడా వెంట వెంటనే మారుతుంది.

2 Mana Aarogyam 219

పీరియడ్స్ రావడానికి 14 రోజుల ముందు అండం విడుదల అవుతుంది. కానీ అది ఫలదీకరణ జరగకపోవడం వల్ల క్షీణించిన అండం పీరియడ్స్ సమయంలో బయటకు వెళ్లిపోతుంది. చాలామందికి ఈ టైమ్‌లో పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. కానీ కొందరిలో నొప్పి అధికంగా ఉంటుంది.

పీరియడ్స్‌ఈ నొప్పులు చాలా అలసటతో కూడుకుని ఉంటాయి. మానసిక కల్లోలం, ఆహారం పై కోరిక, డయేరియా లేదా కడుపునొప్పి, ఒళ్ళు నొప్పులు, చికాకు మొదలైనవి కూడా కలుగుతాయి. ప్రతినెల ఐదు రోజుల పాటు నొప్పినివారణ మందులు తీసుకోవడం కూడా సమంజసం కాదు. అలాంటి వారు కింది జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నొప్పి తగ్గించొచ్చు.

హాట్ బ్యాగ్ ఉపయోగించండి:

పీరియడ్స్‌మీ పొత్తికడుపు మరియు నడుము వద్ద కొంచెం వేడితో కాపడం పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇలా చేస్తే కండరాలు వ్యాకోచించి శరీరానికి సులువుగా అనిపిస్తుంది. ఒక హాట్ వాటర్ బ్యాగ్ లో వేడి నీరు నింపి లేదా స్టోన్ పిల్లో తో గాని నొప్పి ఉన్న చోట కాపండి. స్టోన్ పిల్లోలో చిన్నచిన్న రాళ్లు మాదిరిగా ఉంటాయి. దీనితో మర్దన చేసుకుంటే నొప్పులు తగ్గుతాయి.

మర్దన:

పీరియడ్స్‌మీ శరీరాన్ని మర్దన చేసుకుని తేలికపరచుకుందామని ఎప్పుడైనా అనుకున్నారా? అయితే ఇదే సరైన సమయం. నెలసరి సమయంలో మీ శరీరం మరియు మనసు విశ్రాంతి కోరుకుంటాయి. మీ నడుము, కడుపు భాగం మరియు పక్కలలో పదిహేను నిమిషాలు మర్దన చేసుకుంటే 90 శాతం నొప్పులు తగ్గుతాయి. సువాసన కలిగిన నూనెతో మర్దన చేసుకుంటే ఇంకా హాయినిస్తాయి. ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనెలో కొన్ని చుక్కల సువాసన కలిగిన నూనె కలపడం వలన ఆరోమాథెరపి వలన కలిగే ప్రయోజనాలు పొందవచ్చు.

దూరం పెట్టవలసిన ఆహార పదార్థాలు:

కడుపుబ్బరం మరియు శరీరంలో నీరు నిలుపుదల చేసే ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది. కార్బనేటెడ్ పానీయాలు, కెఫిన్, కొవ్వు పదార్థాలు, అధిక ఉప్పు ఉన్న ఆహారం మరియు మద్యం సేవించకపోవడం ఉత్తమం. ఈ ఆహార పదార్థాలు మీ రక్తంతో చక్కెర స్థాయిని గజిబిజి చేసి నొప్పులను ఇంకా ఎక్కువగా చేస్తుంది.

బొప్పాయి:

Boppayపీరియడ్స్ రావడానికి ముందు బొప్పాయి పండు తినడం ఉపకరిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ప్లేమటరీ గుణాలు ఉంటాయి. ఐరన్, కాల్షియంతోపాటు విటమిన్ ఎ, విటమిన్ సి కూడా అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి సంకోచించిన పొత్తి కడుపు కండరాలను తిరిగి సాధారణ స్థితికి తెస్తాయి.

తులసి:

Thulasiఆరోగ్య పరంగా తులసికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పీరియడ్స్ టైంలో నొప్పి తగ్గడానికి ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. తులసి ఆకుల్ని కప్పు నీటిలో కలిపి వేడి చేయాలి. తర్వాత దాన్ని చల్లార్చి కొద్ది కొద్దిగా రెండు మూడు గంటలకోసారి తాగాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది.

అల్లం:

పీరియడ్స్‌అల్లం తురుమును కప్పు నీటిలో కలిపి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత దాన్ని వడగట్టి తగినంత నిమ్మ రసం, తేనె కలపాలి. పీరియడ్స్ టైంలో రోజుకు రెండు మూడు సార్లు తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

శుభకార్యాల్లో అక్షింతలు ఎందుకు చల్లుతారో తెలుసా?

0
అక్షింతలు

హిందూ సంప్రదాయానికి అక్షింతలకు విడదీయరాని సంబంధం ఉంది. ప్రతి శుభకార్యంలోనూ తలమీద అక్షింతలు వేసి ఆశీర్వదించడం సాంప్రదాయం. మన సంస్కృతిలో ఆశీర్వచనానికి ఎంత ప్రాముఖ్యం ఉందో, ఆ సందర్భంలో ఉపయోగించే అక్షింతలకూ అంతే ప్రాధాన్యం ఉంది.

అక్షింతలుబారసాలయినా, అన్నప్రాశన అయినా, పెళ్లయినా, పేరంటమైనా చివర్లో పెద్దలు నాలుగు అక్షింతలు చల్లుతారు. అక్షింతలు తయారు చేసి మంత్రాలు చదువుతూ, అర్చకులు, గురువులు పిల్లలకు ఆశీర్వచనాలు అందజేస్తారు. అసలు ఎందుకు అలా చేస్తారు? ఆ అక్షింతల వలన ఏమిటి ఉపయోగం? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అక్షింతలుఅక్షింతలు అంటే క్షయం కానివీ పరిపూర్ణమైనవీ అని అర్థం. విరిగిపోని మంచి ధాన్యాన్ని ఎంచుకొని, పొట్టుతీసి, పసుపు, ఆవునెయ్యి కలిపి అక్షింతలు తయారుచేస్తారు. ఇందులో బియ్యాన్ని చంద్రుడికి ప్రతీకగా చెబుతారు. ‘మనః కారకో ఇతి చంద్రః’ అంటే చంద్రుడు మనసుకి కారకుడు లేదా అధిపతి అని అర్థం.

అక్షింతలుమనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి చిహ్నంగా బియ్యాన్ని ఉపయోగిస్తాం. అంతే కాదు బియ్యంలో కలిపే పసుపు గురువుకు ప్రతీక. గురు గ్రహం శుభ గ్రహం. అందుకే శుభానికి సంకేతంగా పసుపు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు.

అక్షింతలుపసుపు యాంటీ బయాటిక్, నెయ్యిలోనూ దివ్యమైన ఔషదగుణాలు ఉన్నాయి. భక్తితో కూడిన ఆరోగ్యాన్ని మనకందించడానికి మన పెద్దలు ఇలాంటి ఎన్నో మార్గాలను మనకు చూపారు.

 

These GIFs Sum Up The Life Of Guys Who Are Messed Up With ‘❤️Da La Jobs’

0

Middle Class job ante middle class vaallu chese jobs kaadhu… Atu top class ki, itu poor class ki madhyalo unde rakam jobs… Avem jobs ra saami ani meeru nannu adigithe, meeru ee bhoomiki kotthagaa vacchaaru ani nenu anukuntaa… Anthe kadha Murthy gaaru… Job laanti job, Salary laanti salary anipinche pani chesthe vaatine alaane pilisthaaru ani meeku theliyakapothe ‘Hathavidhi’ ani nenu thala pattukovadam thappa nenu inkokati cheyyalenu… Sarele, yelaano intha dhooram vacchaaru kadhaa, poorthigaa chepthaa padhandi…

1) No Interest

Job interest undadhu, kaani cheyyaali… Yendhuku ra ante dabbula kosam, yes, kevalam dabbula kosame… Ante manam chese pani mana chaduvuku thaggattu undhaa ledhaa annadhi kaadhu, dabbulu vasthunnaayaa ledhaa annadhe mukhyam… Yendhukante manaki badhyathalu yekkuva kadhaa…

2) Passion Paarahushaar

Nacchani pani chesthuu unte, inkekkadi nacchina pani… Ilaanti vaallani boledu mandhini choopinchocchu… Konthamandhiki business cheyyalani aasa, kondhariki foreign studies, inkondhariki sports, mari kondhariki cinema lu, ilaa inkaa yenno… Kaani, mana paristhitula nimittham manam vaatiki konni saarlu kontha kaalamo, poorthi gaano managalam paadaalsi vasthundhi… Thappadhu brother…

3) This money is Enough!

Thokka saripoddhi… Thikka dhobbuddhi, manaki vacche salary ki manaki unde kharchulaki yeppuduu sardhukupovadame… Over time lu chesthe dabbulu konnni chotla vasthaayi, konni chotla asalu OT ki place ye undadhu… Aa vishayam pakkana pedithe, choosevaadiki manamedho yekkabodusthunnaam anipinchinaa manam peekuthundhi yemii ledhani manaki maathrame thelusu…

4) Part Time – Extra fittings

Ivannii koodaa middle class jobs lo bhagame… Kooti koraku koti vidhyalu annattu, yennayinaa chesthaam… Pani raavaale gaani, yedho okati cheyocchu anedhi mana middle class vaalla main and solid principle… So alaane chesthaam…

5) Job Trails

Job vacchinavaadu mallii job ki try cheyyadam ante ikkade choosthaam… Manam chese job ye moolaki raadhu manaki money making ki… Manaki government job lo, peddha corporate job lo kaavaali settle avvaali ante… So oka pakka job chesthuune maro pakka Job ki trails…

6) Job laanti Job

Anthegaa mari… Paina cheppina point ye idhi… Computer language lu nerchukunnaa koodaa mallii BPO lo work chesthaaru… Veetine antaaru… Nuvvu job chesthaav, kaani vacche money thakkuva… Yelaa ante, “Kshanam theerika undadhu, paisa aadhayam undadhu” ani na friend yevado cheppindhi gurthosthundhi, adhi dheeniki apt…

7) Santings

Nirmohamaatangaa cheppocchu, sigge ledhu… Prathee intlo unde gole idhi… Nuvvu job chesinaa adhoka job aa ani annattu choosthaaru… Ye mi intlo ledhaa ilaa, lucky fellows ye ayithe meeru… Nenu na laanti vaalla gurinchi chebuthuunaale… Neeku vacche dabbulu gaani, chese pani gaani assalu vishayam kaadhu, yendhukante vaallaki chuttuu government job holders, software 60-80k employees kanipisthuu untaaru… Vaalladhi koodaa thappuledhu, vaalla avedhana vaalladhi…

8) Middle Class Job

Adhegaa ippati varaku cheppindhi… Avannii middle class job laki unde lakshanaalu… Nenu middle class gurinchi cheppadam ledhu, andhulo job chese mana thori pourula brathukula gurinchi chebuthuunaa… Atu poor annattu konni panulu manam cheyyalem, itu peddha peddhavi velagapettalem… Thappaka konni jobs, annii moosukoni mukkuthuu chesthaam… Navvaalo yedavaalo koodaa theliyadhu… It’s fate re, cheyyaali…

Ilaa meeku koodaa yevo anipisthaayi ga… Anni points okate kadha mama antaaraa, anthe guru, annii okelaane anipisthaay mari… Yendhukante manam middle class job chesevaallam…

Jai Jawan – Jai Kisan – Jai Sramik

కిడ్నీలో రాళ్లు తగ్గాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసా ?

0
tips to reduce kidney stones?

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఈ కాలంలో చాలామందిని ఇబ్బంది పడుతున్న సమస్య కిడ్నీలో స్టోన్స్. యూరిన్ లో ఉండే యూరిక్ ఆసిడ్, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, ఆక్సాలిక్ ఆసిడ్స్ నుండి ఇవి తయారవుతాయి. అయితే ఈ రాళ్లు ఐదు మిల్లీ మీటర్ల కంటే తక్కువున్నట్లయితే యూరిన్ లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. కానీ పెద్ద స్టోన్స్ మాత్రం యూరిన్ నుండి బయటకు వెళ్లవు. బాధని కలుగ చేస్తాయి. ఇవి యూరిన్ యొక్క ఫ్లో ని అడ్డుకుంటాయి. అలాగే, యూరిన్ లో బ్లడ్ వంటి లక్షణాలను కలుగ చేస్తాయి. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా ఈ స్టోన్స్ తో బాధపడతారు.

tips to reduce kidney stones?కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటానికి మెడికల్, జెనెటిక్ కండిషన్స్ కూడా కారణం కావచ్చు. బ్లడ్ లో ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల, కాల్షియం లేదా విటమిన్ డీ సప్లిమెంట్లని ఎక్కువ కాలం పాటూ తీసుకోవటం, పాలకూర, నట్స్, చాకొలేట్ వంటి ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం, అధిక బరువుని కలిగి ఉండడం, ఫైబర్, మెగ్నీషియం తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం కూడా కిడ్నీ లో రాళ్లు ఏర్పడడానికి కారణం కావొచ్చు.

tips to reduce kidney stones?కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లయితే కిడ్నీ నుండి బ్లాడర్ కు యూరిన్ ని తీసుకువెళ్ళే ట్యూబ్ లోకి చేరి భరించలేనంత నొప్పి వస్తుంది. వీపు కింద భాగం నుండి పొట్ట కింద భాగంలోకి వచ్చే నొప్పి, వికారం, వాంతులు, ఎక్కువ సార్లు బాత్రూం కి వెళ్ళాల్సి రావడం, యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు నొప్పి, మంట ఉండడం, యూరిన్ పాస్ చేయాలనిపించడం కానీ పూర్తిగా పాస్ చేయలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

tips to reduce kidney stones?మరి కిడ్నీలో రాళ్లు తగ్గాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకుందాం.

కిడ్నీ లో రాళ్లు కరిగిపోవాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజుకి కనీసం ఆరు నుండి ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. అలాగే కాల్షియం ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వంటివి చేయాలి. అంటే పాలు, పాల పదార్ధాలు వంటివి తీసుకోవాలి. అలాగే పాలకూర తినడాన్ని వీలయినంత తగ్గించాలి. అలాగే ఉప్పు తక్కువగా తీసుకోవడం వంటివి చేయాలి. షుగర్, ఆర్టిఫీషియల్ స్వీటెనర్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు. అలాగే రెడ్ మీట్ తినడాన్ని తగ్గించాలి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. బరువుని అదుపులో ఉంచుకోవాలి.

tips to reduce kidney stones?పండ్లూ కూరగాయలు బాగా తీసుకోవడంతో పాటు రోజుకు నాలుగు టేబుల్ స్పూన్ల తాజా నిమ్మరసం తీసుకోండి. ఇలా రోజుకి రెండు మూడు సార్లు మూడు రోజుల వరకూ చేయవచ్చు. దానిమ్మ గింజలు, రసం రెండూ మంచివే. రోజుకి ఒక దానిమ్మ పండు తినవచ్చు, లేదా అప్పుడే తీసిన దానిమ్మ రసం ఒక గ్లాసు తాగవచ్చు. ఫ్రూట్ సలాడ్ లో దానిమ్మ గింజలు కూడా కలపవచ్చు.

tips to reduce kidney stones?

రెగ్యులర్ గా పుచ్చకాయ తీసుకోవడం కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ లోనే కాదు, అసలు స్టోన్స్ ఫార్మ్ అవ్వకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది.

tips to reduce kidney stones?రాజ్మా కూడా ఈ సమస్యకి చాలా మంచి పరిష్కారమే. రాజ్మా సూప్, సలాడ్ వంటివి తీసుకోవచ్చు. కొంతమంది రాజ్మా తినకూడదు అని అనుకుంటారు. కానీ ఎలాంటి జంకు లేకుండా రాజ్మా తినవచ్చు.

 

కృష్ణుడి తన దేహమును విడిచిపోవడానికి గల కారణం ఏమిటి ?

0
Dwaraka

కురుక్షేత్ర సంగ్రామం అనంతరం, ఒకనాడు కణ్వ, విశ్వామిత్ర, నారద మహర్షులు శ్రీ కృష్ణుని సందర్శనార్దం ద్వారకకు వచ్చారు. వీరు పురవీధుల్లో సంచరిస్తూ ఉండగా కొందరు ద్వారక యువకులకు చిలిపి ఊహ తట్టింది. ఆ యువకులు ఒకడికి స్త్రీ వేషం వేసి ఆ మునుల వద్దకు తీసుకుని పోయి ఈ చిన్నదానికి ఆడ బిడ్డ పుడతాడో, మగ బిడ్డ పుడతాడో చెప్పమన్నారు. ఆ మహర్షులు అమాయకులు కాదు కదా, దివ్యదృష్టి తో మొత్తం కనుక్కుని ఆగ్రహంతో, ఆడబిడ్డా కాదు మగబిడ్డా కాదు ఒక ముసలం(రోకలి) పుడుతుంది, అది మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ విషయం శ్రీ కృష్ణునికి తెలిసింది. విధి రాతను ఎవరూ తప్పించలేరు, యాదవ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు.

Kurukshetramమహర్షుల తపశ్శక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది. ఆ యువకులు దానిని శ్రీ కృష్ణుని వద్దకు తీసుకుపోయారు. శ్రీ కృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఆయుధంలా కనిపించింది. దానిని పిండి చేసి సముద్రం లో కలపమని ఆ యువకులకు చెప్పాడు. వారు దానిని పిండి చేసి సముద్రంలో కలిపారు. చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రం లోనికి విసిరివేశారు. పిండి చేసిన ముసలం మనల్ని ఎలా నాశనం చేస్తుంది లెమ్మని సంతోషం గా ఇళ్ళకు పోయారు. కానీ మునుల వాక్కు వృధా పోదు కదా. మిగిలిన ఆ రోకలి ముక్క తీరానికి కొట్టుకు వచ్చి ఒకానొక చోట ఇసుకలో దిగబడింది. సముద్రంలో కలిసిన రోకలి పిండి బడబాగ్ని వలె కాచుకుని ఉంది. శ్రీ కృష్ణునికి ఇవన్నీ తెలిసినా విధి రాతను తప్పించే శక్తి లేక మిన్నకుండి పోయాడు.

Sri Krishnaఅది మొదలు ద్వారక నగరంలో అనేక సమస్యలు సంభవించాయి. ఎపుడూ లేని విధంగా యాదవులు సజ్జనులను బాధించడం మొదలుపెట్టారు. స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు. యాదవవంశ నాశనం దగ్గరలోనే ఉందని కృష్ణునికి అర్ధం అయ్యింది. తను ఎంతో ప్రేమించే ద్వారకలో యాదవులు నాశనం అవ్వడం ఇష్టం లేని కృష్ణుడు యాదవులు అందరినీ ఒక్క చోట చేర్చాడు. సముద్రానికి జాతర చెయ్యాలని అందరినీ బయలుదేరమని చెప్పాడు. అందరూ కావలసిన సరంజామా అంతా తీసుకుని బయలుదేరారు. బలరాముడు అరణ్యమునకు బయలుదేరాడు. శ్రీ కృష్ణుడు ఒక్కడే యాదవులతో పాటు వెళ్ళాడు. వెళ్ళే ముందు తండ్రియైన వసుదేవునితో ఇలా అన్నాడు.

Dwaraka“తండ్రీ కొద్ది రోజులలో ద్వారకను సముద్రం ముంచెత్తనున్నది. అర్జునుడు వస్తాడు మిమ్ములను అందరినీ ఉద్ధరిస్తాడు. అతను వేరు నేను వేరు కాదు. అందరూ అతని ఆజ్ఞను పాటించండి.” అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా సముద్ర తీరానికి వెళ్ళిన యాదవులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అన్నీ తెలిసినా కృష్ణుడు ఏమీ చెయ్యలేని వాడయ్యాడు. అంతలో ఒకడు ఆనాడు సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకుని ఒకడిని మోది చంపేశాడు. అది మొదలు అందరూ ఒకరిని ఒకరు చంపుకున్నారు.

Arjunaమిగిలిన దారుకుడిని, భబ్రుడిని తీసుకుని బలరాముడు ఉన్న చోటికి బయలుదేరాడు శ్రీ కృష్ణుడు. అక్కడ బలరాముడు అరణ్యంలో ధ్యానం లో ఉన్నాడు. శ్రీ కృష్ణుడు అర్జునుడిని ద్వారకకు తీసుకురమ్మని దారుకుడిని పంపాడు. భబ్రుడిని ద్వారకలోని స్త్రీలను, మిగిలిన వాళ్ళని ప్రయాణమునకు సిద్దం చెయ్యమని పంపాడు. కానీ మార్గమధ్యం లో ఒక ఆటవికుడు అతనిని అదే రోకలి తుంగతో సంహరించాడు.

Pandavuluదారుకుడు ఏడుస్తూ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అతనిని ఆ పరిస్థితి లో చూసి పాండవులు చలించిపోయారు. అపుడు దారుకుడు జరిగిన విషయం చెప్పి బలరామకృష్ణులు అరణ్యం లో ఉన్నారని, అర్జునుడుని ద్వారకకు తీసుకువెల్లమన్నారని చెప్పాడు. అది విని పాండవులు ఆశ్చర్యపోయారు. శ్రీ కృష్ణ భగవానుడు అచట ఉండగా ఇలా ఎందుకు జరిగిందా అని చాలా భాధపడ్డారు. అర్జునుడు వెంటనే ద్వారకకు పయనమయ్యాడు.

Balaramaఅరణ్యంలో బలరాముడు తన దేహమును విడిచి తన అంశ అయిన మహా సర్పరూపం ధరించి సముద్రం లో కలిసిపోయాడు. తన అన్న లేని లోకంలో ఉండటం వృధా అని తలచి, తను చెయ్యవలసిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తన శరీరం వదలడానికి ఏ కారణం దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు తనకు అరికాలితో మరణం సంభవిస్తుందని దుర్వాస మహాముని శాపం ఇవ్వడం గుర్తుకువచ్చింది. అపుడు శ్రీ కృష్ణుడు ఒక మహా వృక్షం నీడన మేను వాల్చి, అక్కడకు వస్తున్న ఒక బోయవానికి, తన పాదం లేడి పిల్ల లాగా భ్రమింపచేశాడు. అది తెలియని బోయవాడు గురి చూసి కృష్ణుని పాదానికి బాణం వదిలాడు. తర్వాత వచ్చి చూసి దేవదేవుడైన వాసుదేవునికా నేను బాణం వేసింది అని రోదించడం మొదలు పెట్టాడు. శ్రీ కృష్ణుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు.

Sri Krishna“త్రేతాయుగాన వాలి వైన నిన్ను చెట్టు చాటునుండి చంపిన ఫలితం ఇపుడు అనుభవిస్తున్నాను. కర్మ ఫలమును భగవంతుడైనను అనుభవించవలసినదే. నీవు నిమిత్తమాత్రుడవు.” అని శ్రీ కృష్ణుడు తన శరీరమును త్యజించాడు. ద్వారకకు చేరుకున్న అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకను చూసి దుఃఖించాడు. అర్జునుడిని చూడగానే శ్రీ కృష్ణుని భార్యలు పలు విధాల రోదించారు. వసుదేవుడు శ్రీ కృష్ణుడు తనకు చెప్పినదంతా అర్జునుడికి చెప్పి తన యోగనిస్ఠతో శరీరం వదిలాడు.

SriKrishnaవసుదేవుని మరణవార్త శ్రీ కృష్ణునికి చేరవేయడానికి అర్జునుడు అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యం లో శ్రీ కృష్ణ భగవానుని మృతదేహం చూసి కన్నీటిపర్యంతం అయ్యాడు. మృతదేహానికి చెయ్యవలసిన కార్యక్రమాలు చేసి తను ద్వారకకు పయనమయ్యాడు. సిద్ధంగా ఉన్నవారిని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు. అర్జునుడు ద్వారక విడిచిన మరుక్షణం అప్పటివరకు కాచుకుని ఉన్న సముద్రం ద్వారకను ముంచెత్తింది. ఇపుడు సముద్రంలో బయటపడిన ద్వారక అదేనని అధికుల విశ్వాసం.

 

15 Memes Which Sum Up Mana Bellam Anna’s Mass Bollywood Debut With Chatrapathi Remake

0

Couple of weeks nundi Prabhas chesina Chatrapathi movie ni Hindi lo mana Bellamkonda Srinivas remake cheastharane buzz vintunnam. Aithe ee buzz ni official ga announce chesaru makers and ee movie ki VV Vinayak director ga debut cheyabotunaru. Bellamkonda ee movie remake cheyadaniki gala main reason athnaiki north lo unna image and following. Adi athani Hindi dubbed telugu movie views chusthe anmdariki ardam avtundi.

Ee news meedha Bellam anna north fans excited ga unte….mana Telugu audience lo mixed talk nadustundi. Mari Bellam anna debut meedha mana audience emantunaro memes roopam lo chuseddam…

1.

9.

2.

5.

3.

3.

4.

14.

5.

8.

6.

4.

7.

11.

8.

12.

9.

15.

10.

6.

11.

13.

12.

2.

13.

7.

14.

10.

15.

1.

11 Masth Liked Characters & Their Special Talent Which Made Us Say ‘Wah, Kya Baath Hai’

0

Yentha sepu heroes annaka aadini narakadam eedini narakadamenaa, manishi annaka kasantha kala pochana undali.

Mukyamga movie loni main characters kastha reality ki daggara lo untu kastha realistic ambitions tho characters unte audience ki inka jill jill jiga jiga.

Like Anand Devarkonda’s Character in Middle Class Melodies. Aa Bombay Chutney pai mana Raghava ki unna confidence chuste jealous puttindi..

Ila past lo konni movie characters reality ki daggara ga unde special talents tho manaki jealous kaliginchela chesaru, atuvanti characters and their jill jill jiga jiga talents yento chuddam padandi…

1) Raghava – Bombay Chutney

1

2) Michael Velayudham – Making Italian Pasta

2

3) Seenu – Painter

3

4) Prasanth – Cooking (Spcl: Prashant’s Recipe)

4

5) Uma Maheswar – Photo Studio

5

6) Arjun – Cricket

6

7) Lilly – Cricket

7

8) Manasa Samyuktha – Chai

8

9) Gautham – Writer

9

10) Ram – Photography

10

11) Gnaneshwar Bhai – Painter

11

రెడ్ వైన్ లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా ?

0
రెడ్ వైన్

“మద్యపానం ఆరోగ్యానికి హానికరం” ఇది అందరికి తెలిసిన మాటే. అతిగా తాగడం మంచిది కాదు లివర్ పాడైపోతుందని పెద్దలు, వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు దీని గురించి మరో కొత్త విషయం తేలింది. అదేంటంటే… రోజూ కాసింత వైన్ తాగితే అందంగా తయారవుతారట. వృద్ధాప్యం కూడా త్వరగా ధరిచేరదట.

Health Benefits of Red Wineఅయితే, తాగమన్నాం కదా అని ఏ వైన్ పడితే ఆ వైన్‌ని తాగకూడదట. ఈ విషయంలో కచ్చితంగా సూచనలు పాటించాలని చెబుతున్నారు. బ్లాక్ బెర్రీ, వోట్స్ వంటి వాటితో చేసిన వైన్ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందట. ఇందులో కార్బనెట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి కూడా చాలా మంచిదని పరివోధకులు చెబుతున్నారు.

Health Benefits of Red Wineకెమికల్ బేస్డ్ ఆల్కహాల్ కు బదులుగా గ్రేప్ వైన్, యాపిల్ వైన్ వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు. వైన్ అనేది దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదం చేస్తుంది. అయితే అది కూడా లిమిట్‌లోనే ఉండాలని చెబుతున్నారు.

ముఖ్యంగా ఆల్కహాల్ బెవరేజెస్ లో రెడ్ వైన్ సేవించ‌డం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు క‌ల‌గ‌చేస్తుంది. అలాగే చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంపొందిండ‌చంలో రెడ్ వైన్ చేసే మేలు అంతా ఇంతా కాదు. మరి రెడ్ వైన్ లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

  • రెడ్‌వైన్‌లోని ప్రత్యేక గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వృద్ధ్యాప్య ఛాయలను దూరం చేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

Health Benefits of Red Wine

  • రెడ్‌ వైన్‌ తాగటం వల్ల చెడు కొల‌స్ట్రాల్ త‌గ్గించి మంచి కొల‌స్ట్రాల్ పెంచుతుంది. దీంతో గుండెకు సంబంధించిన వ్యాధుల దారిచేర‌కుండా స‌హాయ‌ప‌డుతుంది.
  • ముఖానికి ప్ర‌తి రోజు రెడ్ వైన్ మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల మెరిసేటి క్లియర్ స్కిన్ సహజంగా పొందడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.
  • రెడ్‌ వైన్ తాగ‌డం వ‌ల్ల అందంగా ఉండడంతో పాటు ఎలాంటి చర్మ సంబధిత వ్యాధుల బారిన‌ప‌డ‌కుండా చూస్తుంది. అలాగే సూర్యరశ్మి కారణంగా కలిగే చర్మ వ్యాధులను కూడా దూరం చేస్తుంది.
  • రెడ్ వైన్ ను రాత్రి తాగడం వల్ల నాడీవ్యవస్థకు విశ్రాంతి స‌హాయ‌ప‌డి స్ట్రెస్ త‌గ్గిస్తుంది. దాంతో సుఖ‌వంత‌మైన నిద్ర పొంద‌వ‌చ్చు.

Health Benefits of Red Wine

  • మతిమరుపు, దంత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ నుండి రక్షణ పొందడానికి రెడ్ వైన్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.
  • రెడ్ వైన్ జలుబు, ఫ్ల్యూ వంటి జ‌బ్బుల‌ నుండి కాపాడ‌డంతో పాటు బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

Health Benefits of Red Wine

  • డయాబెటీస్ వారికి ఈ వైన్ అమృతం అనే చెప్పాలి. ఎందుకంటే ఎంత ఫుడ్ డైట్ చేసిన ఎన్ని ఔషదాలు వాడినా ఈ డయాబెటీస్ కంట్రోల్ అవ్వడం లేదు. అలాంటి డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి వైన్ చాలా మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

 

విభూతి ఎందుకు అంత పవిత్రమైనది ? దాని విశిష్టత ఏమిటి

0

విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారిని పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. నరక బాధలకు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మంలో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జపాలు, యజ్ఞాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము.

విభూతిమన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి అని శాస్త్రము చేప్తోంది. కాని ఈ కాలము లో అలా చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు నశించి పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

విభూతిఈ భస్మ ధారణ చేయడానికి శాస్త్రాలలో కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి. బ్రాహ్మణ, క్షత్రీయులు “మానస్తోకే మంత్రము ” తో, వైశ్యులు ” త్ర్యయంబక ” మంత్రముతో, ఇతరులు శివపంచాక్షరితో భస్మ ధారణ చెయాలి. ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది.

విభూతిమహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో పవిత్రంగా తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు. షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని పౌష్ఠికం అని అంటారు. బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని కామదం అని అంటారు.

విభూతిభస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి. యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మండించడం ద్వార వచ్చిన అగ్నితో, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండము లో వేసి హోమము చెయ్యాలి. అనంతరం శుభ్రమైన పాత్రలో విభుతిని నింపాలి.

 

What If… These Telugu Movie Characters Have Real Jobs

0
movie charecters jobs

Prathi movie loni hero character ki oka speciality untundi. Aa speciality ni chala effective ga gani director present cheste audience ki kick ostundi. Okavela sarriga present cheyyakunte audience ki glucose yekkinchalsi vastundi.

Anyway main matter loki vaddam mana hero characters movies lo nunchi real life loki vasthe…… Okavela vachina real world lo aa characters ey job chestu bathukutaruu??? Emo Mari!!!

Okavela real world lo aa movie characters job chestu bathakalai vasthe ey jobs chestaro chuddam padandi….

1) Srinivas – Pravachanalu

1The True Heir Of Relangi Mavoyya

2) Shiva – Fitness Trainer

2Recommendation: Rx 100 Indu

3) Ajay – Family Reunion Get Together Planner

3Idi future market lo create ayye Job. Mana Ajay appude prepare aipoyadu ee job ki

4) Siddhant Nandan Sahoo – Scuba Diving & Bungee Jumping Trainer

4How to fly? – A Masterclass by Sahoo

5) Rishi – Entrepreneur/Motivational Speaker/Philanthropist

5All in one!!!

6) Abhiram – Stockbroker

6Scam Krishnamurthy

7) Raghuvaran – H.O.D of Civil Engineering Department

7The perfect HOD students deserve

8) Vijaykrishna – Android App Developer

8Intelligent fellow…

9) Raja – Martial Arts Master For Blind People

9I am blind, but I am trained

8 South Directors Who Were Hired By B-Town To Remake Their Own Movies In Bollywood

0

Recent ga mana south movies ni remake cheydam lo mundu unnaru Bollywood janalu. Cinema hit talk vacchindi ante chalu rights konesi akakda stars ki movie reel esi dates tisukoni remake cheyadaniki ready aipotunaru.

Aithe remakes ni proper ga handle chesthene hit avthayi anna lessons nerchukunna Bollywood makers remakes ki original movies tisina directors tho tiyadaniki try chestunaru. Sandeep Reddy Vanga nundi recent ga Bahagamthie tho hit kottina Ashok idhe movie ni Durgamati ga direct chesaru and aa trailer kuda release aindi.

Mari ila recent times lo original version directors ni hre chesukuni remake ki opt chesukunna list lo mana south directors and vallu chessina, cheyabotunna moviesento oo sari chuseddam…

1.Sandeep Reddy Vanga – Arjun Reddy & Kabir Singh

1Telug lo Arjun Reddy lanti game changer tisina Sandeep ne malli hire chesukuni Kabir Singh tho akkada kuda hit kottaru.

2.Raghava Lawrence – Kanchana & Laxmi Bomb

2Ika Kanchana movie rights tisukuni vere director tho chepiddam anukunna…last ki Lawrence thone chesaru.

3.Sudha Kongara – Irudhi Suttru – Saala Khadoos

3Madhavan tho Tamil lo Irudhi Suttru tisina director Sudha Kongara idhe movie ni hindi lo kuda simultaneous ha direct chesi double hits kottindi.

4.Shailesh Kolanu – HIT – HIT

4Debut movie HIT thone HIT andukunna Shailesh Kolanu ippudu idhe movie ni Hindi lo Rajkumar Rao ni petti remake chestunnadu.

5.Goutham Tinnanuri – Jersey & Jersey

5Telugu audience ki Jersey roopam lo oka marchipoleni masterpiece ni icchina Goutham…Shahid tho hindi lo tie panilo unnadu under Geetha Arts banner.

6.Ritesh Rana – Mathu Vadalara -(Untitled)

6Path breaking content tho path breaking hit kottina Ritesh Rana idhe movie in Hindi audience cheppadaniki ready avtunnadu.

7.G. Ashok – Bhagamathie & Durgamati

7Anushka tho Bhagamathie ni tisi andarni bayapettina Ashok ee movie in Hindi Durgamati ga direct chesi release ki ready chesaru kuda.

8.A.R. Murugadoss – Thuppaki & Holiday

8Tamil lo Vijay tho tisina Thuppaki ni Hindi Lo Akshay tho tisi hitt kottadu mana Muruga.

10 Middle Class Father Characters Who Entertained Us & Are Too Close To Fathers in Real Life

0

Manam chuse ceinemallo characters rokko sari fiction ane line daati arey mana intlo, mana street lo, mana life lo characters ni gurthu chestuntayi. Adi intlo amma chese character aina….father aina and and last mana heroines lo kuda mana girlfriends ni chusukovadam or relate chesukovadam manaki chala common thing.

Kani cinemallo amma, ammayi characters kante kuda father characters avi kuda mana middle class families li unde father characters chala gammathuga and relatable ga untayi. For example recent ga Middle Class Melodies movie oo Kondal Rao character. Ee character almost prathi middle class family lo exist ane cheppali.

Ila cnemallo middle class fathers la kanipinchina abba same maa daddy eh ra ani manathi anipinchina movies ento oosari chuseddam.

1.Goparaju Ramana from Middle Class Melodies

1Assala koduk ayana titte prathi boothullo chala mandi koidukulu tama father ni chusukunnaru. Tittakunda kodukuni penchani middle class fathers undaru…and daniki perfect example e movie lo Kondal Rao character.

2.Chandra Mohan from 7/G

2Naa paruvu tiyadanike puttav ra ane emotional fathers kondaru untaru. Alanti father eh mana Chandra MOhan in 7/G. Kodukuni kottadam, Tittadam, tannadamdaagara nundi adhe koduku settle aithe proud ga feel ayye average middle class father ni ee movie lo chudocchu.

3.Kota from AMAV

3Ika vayasocchina koduku waste ga padi unte fathers ela chestaro ee movie lo chudocchu. And also single fathers and sons madhya unde bonding kanniluu pettistundi.

4.Samuthirakani from Raghuvaran Btech

4Intlo pedda koduku padani father chala middle class intlo untaru like father in this movie. Raghuvaran ante nacchani father adhe Raghuvaran ni emotional ga daggara tiskovadam, athadu settle aithe happy ga feel avvadam manam ee movie lo chusocchu.

5.Prakash Raj from Kotha Bangaru Lokam

5Ika koduku ki em kavalante adi icchi neeku nacchindi cheyi, nee venuka nenu unna ani dhairyan cheppe middle class father ni manam ee movie lo chudocchu.

6.Devi Prasad from Needi Naadi Oke Katha

6Paniki raani panikirani yedava ani deppi podice father eh intlo undaru cheppandi mana Prasad gari laga.

7.Kota from Idiot

7Amma dosalu pedithe inka rednu veyyi adiki..ani chudadam. Alage vaddu ra chanti manaki ee prema doma, ani emotional ga society ki bayapada convince chese average middle class father ni indulo chudocchu.

8.Kedar Shankara from Pelli Choopulu

8Okati chadivi inkokati chestha ante eh middle class father tittadu cheppandi.

9.Chandra Mohan – Nuvve Nuvve

9Oka ordinary and middle class father aina koduku oka pedda inti ammayi ni love chesthe pade badhalu konchem comic ga unna…last lo Prakash Raj icche warning ki Chandra Mohan icche reactions chalu oka middle class father ki daughters unte entha kastam anedi.

10.Relangi Mavayya from SVSC

10.Last but not least mana Relangi Mavayya, assala ilanti middle class father untara ante ? Untaru but rare anta nenu ilanti father unte aa koduku antha lucky inkevvaru undaru.

11 ‘Chilipi & Pilla Puvvu’ Shopping Experiences We All Had During Our Childhood

0

Chinnappudu amma teche shirt lu pant lu ela untai ante aa dress lu manaki oka 2-3 years saripoye antha peddaga undevi.

Manam: Mo, Chala loose ga unnayi ivi…

Mom: Yedige pillodivi kadha, andukani techa…em parledu inko two years vaadochu

You: Odiyamma Badava

Ala mom’s annaka inkem antam cheppandi, idi just sample maatrame inka chala type of shopping experiences mana face chesi untam okasari ala back to time velli aa funny memories ni gurthu chesukundam padandi…

1) Mom: Chinna, Ivala shopping ki pothunnam…

Me:

2) Me: Maa, Naku aa black shirt kaavali…

Mom: Pandagalaki black vesuko kudadu raa…

Me: Naku aa shirt ye kavali…

Mom:

3) Mom: Rey ee bulugu shirt chudu yentha bgundo…

Me: Naku vaddu..

Mom: Insert <Big Eyes> Urimi Chudadam

Me: Insert <Fear> Sare maa…

4) Me After Wearing That Long Long Bulugu Shirt…

Mom:

Shopkeeper: Insert<Inside Laughing>

5) 15 Year Old Me In Tirumala: Mummy naku aa car bommi kavali…

Daddy: Inka bommalu kavali ra bommalu neeku

Konchem pedda ayyi maname dress lu select chesukune stage ki vachaka situations be like:

6) 15 year old you buy another black shirt and bring it to home:

Mom:

Mom: Aa black shirt vennaki ichi unko color techuko..

7) Mom: Ee shirt loose avuddi anukunta raa? Okasari try chey ra..

Nibba Me: Vesukune naaku telida naa size ento, you don’t worry mom…

After returning to home and trying the dress and the shirt is too loose:

Me: Konchem size peddadi maa, aina ide vesukunta lee

Mom:

8) Shopkeeper: Ee dress branded tammudu, idi vesuko acham hero laa untav…

16 year Nibba me:

Me after wearing that dress and going to school be like:

Everyone looking me be like:

That Shopkeeper Be like: Shirt lo hero laa untav anna anthe, nammesadu pilla pithre gadu

9) No one, literally no one:

Shopkeeper using my Nibba innocence: Ee tshirt neeku set ainattu yevariki set kaledu thammudu

Me Inside:

10) When your Nibba finally selected a beautiful shirt and return to home, then you observe a ‘Chinna Bokka’ in shirt

Me: Chinna bokka le amma, em kadu le vesukunta…

Mom: Bytaki pora neethi leni kukka…

Shopkeeper when you come back to return shirt:

That Proud Moment…

11) Shopkeeper: Ee shirt 500 babu

Me: 400 aithe ok…

Shopkeeper : OK…

Me: Going to home to make my mom proud bcoz i bought a 500 shirt for just 400 rs

Mom After watching that shirt be like: Deeniki 200 rs yekkuva alantidi 400 petti konavva…

Me: Yendi moo, nuvvu anedi

Ila rasukunte pothe lekkaleni anni memories unnayi manaki chinnappudu shopping matters lo…

Mee beautiful and funny memories ni comment cheyyandi P.R.E.N.D.S

Meet This Couple From Hyderabad Who Build A House Called ‘Andari Illu’ For The Poor & Shelterless

0

Contributed By: Chintapalli Siva Santhosh

అందరి ఇల్లు :

హైదరాబాద్ లో కొత్తపేట రైతుబజార్ వెనుక మూడు అంతస్తుల భవనం ఒకటి ఉంది. ఆ ఇల్లు…. అందరి ఇల్లు. నిజమే ఆ ఇల్లు అందరిది…. మీకు ఆకలేస్తే భోజనం దొరుకుతుంది, చదువుకోవాలి అంటే గ్రంధాలయం లా పుస్తకాలు ఉంటాయి, ఆరోగ్యం బాగో లేదా వైద్యం అందుతుంది, మనసు బాగోలేదా ప్రశాంతత ను ఇచ్చే దేవాలయం అవుతుంది, కష్టపడి అలసిపోయారు కాస్త సేద తీరే చోటు అవుతుంది ఆశ్రయం లేని వారికి కాస్త చోటు దొరుకుతుంది. నిజమే ఇవన్నీ అక్కడ ఉంటాయి అందుకే అది “ అందరి ఇల్లు ‘”.

Image2డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కామేశ్వరి అనే ఇద్దరి దంపతులుచే కొనసాగుతున్న “ అందరి ఇల్లు” సేవ సంస్థ. ఇద్దరు డాక్టర్లు,మంచి ఆదాయం వచ్చే ఉద్యోగాలను కాదనుకుని సేవ సంస్థ ను స్థాపించి అందరికి సాయం చేసి ఆదర్శమూర్తిలుగా నిలుస్తున్నారు ఆదర్శ దంపతులు.

Image1అందరి ఇల్లు స్థాపించడానికి కారణం, వైద్యులుగా ఉద్యోగం చేసుకుంటున్న సమయం లో ఒక విదేశీ వైద్యుడు అన్న మాటలు “ మీ భారతీయులు కు ఆహారాన్ని పంచటం రాదు “ కు బాధ పడిన డాక్టర్ ప్రకాష్ ఉద్యోగాని రాజీనామా చేసి తోపుడు బండి పై అరటిపళ్ళు అమ్మటం మొదలుపెట్టారు,దాని వెనుక పెద్ద ఆశయమే ఉంది,అరటి పళ్ళను అమ్ముతూ ఒక్కటై న పేదవారికి ఇవ్వండి అని చెప్పేవారు. అరటి పళ్ళు అమ్మటం వల్ల కొంత మందికె సాయం చేయగలుతున్నాం అనుకుని కొన్నాళ్ళు గడిచిన తర్వాత అంటే జూన్15,2006 వ సంవత్సరం లో అందరి ఇల్లు ను స్థాపించి, ఆకలిగా ఉన్న వారు భోజనం చేసి వెళ్ళమని చెప్పేవారు.అలా మొదలైనది అందరి ఇల్లు.

Image3ఇప్పుడు అనేక మంది కడుపు నింపుకుంటున్నారు,ఆశ్రయం పొందుతున్నారు. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు ఎవరి అనుమతి అవసరం లేదు. ఆకలితో ఉన్న వారు వచ్చి వంట చేసుకునేందుకు గ్యాస్,కూరగాయలు, వంట సరుకులు అన్ని సిద్ధంగా ఉంటాయి.వండుకుని కడుపునిండా తిని వెల్లచ్చు. అనేక మంది విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకుంటున్నారు, నిరోద్యగులు కూడా ఇక్కడి నుంచే ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్నారు. కుటుంబ పరిస్థితులు బాగోలేని వారు,ఎవరు లేని అనాథ లు ఇక్కడే ఆశ్రయం పొంది, కడుపు నింపు కుంటున్నారు. అందరి ఇల్లు లో ఇంకో ఆశ్చర్య కరమైన విషయం, అక్కడ ఒక గంట, ఒక బాక్స్ ను ఏర్పాటు చేశారు.ఈ రోజుల్లో మనసు ఉన్న బాధను ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి కొంత మందికి వస్తుంది.ఒక వేళ మన మనసు లో ఏమైనా బాధ ఉంటే అక్కడ ఉన్న గంటను మోగిస్తే ఎవరో ఒకరు వస్తారు,మనం వాళ్లతో మం బాధను పంచుకోవచ్చు. అలా కూడా మనం చెప్పుకోలేకపోతే ఒక కాగితం మీద రాసి అక్కడ ఉన్న బాక్స్ వేయచ్చు. మనసు ను ఓపెన్ చేసుకుని బాధను తీర్చుకోవచ్చు, ఓపెన్ లో ఉన్న కడుపును తిని క్లోజ్ చేసుకుని వెల్లచ్చు.

పై అంతస్తులో ప్రకాష్ గారి భార్య కామేశ్వరి క్లినిక్ నడుపుతున్నరూ,అక్కడి వచ్చే వారికి వైద్యాన్ని అందిస్తున్నారు.వైద్యానికి వచ్చిన వారు కూడా వండుకుని తిని నిండు మనసు తిరిగి ప్రయణమవుతారు.
ఒకసారి ఒకతను మా దగ్గరికి వచ్చాడు.అతనికి వండి పెట్టాం,తిన్న తర్వాత అతను అన్నాడు సార్ నేను తిని రెండు రోజులు అవుతుంది అన్నాడు.తిన్న తర్వాత అతని ముఖం లో మేము చూసిన సంతోషం మాకు చాలా శక్తిని ఇచ్చింది
అందుకే మా తర్వాత కూడా అందరి ఇల్లు నడవాలి అని మేము కోరుకుంటున్నాం.
“అందరి ఇల్లు “ ఇంటిలో వంట చేసుకోవటానికి అన్ని ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి, మా ఇంట్లో ఎలా వున్నా ఇక్కడ మాత్రం అని సిద్ధం చేసి ఉంచుతాం,ఒకోసారి సారి చుట్టూ పక్కల వారు కూడా తమ సాయని అందింస్తూ ఉంటారు అని చెబుతారు డాక్టర్ ప్రకాష్.

ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌తో పోలిస్తే జ‌పాన్ దేశ‌వాసులు ఆరోగ్యంగా ఎందుకు ఉంటారో తెలుసా ?

0

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక దేశాల్లోని ప్ర‌జ‌లు త‌మ అభిరుచులు, ఆహార‌పు అల‌వాట్ల‌కు అనుగుణంగా నిత్యం ఆహారం తీసుకుంటుంటారు. ఇక వారి జీవ‌న‌విధానం కూడా భిన్నంగా ఉంది. అయితే ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌తో పోలిస్తే.. జ‌పాన్ దేశ‌వాసులు ఆరోగ్యంగా ఉంటారు. అవును.. నిజ‌మే.. అందువ‌ల్లే ఆ దేశం ప్ర‌పంచంలోనే ఆరోగ్య‌వంత‌మైన దేశంగా పేరుగాంచింది. అమెరికాలో స‌గ‌టున 100 మందికి 31 శాతం మంది ఒబెసిటీతో బాధ‌ప‌డుతుండ‌గా.. జ‌పాన్‌లో మాత్రం అది 3.5 శాతంగా ఉంది. అంటే.. జ‌పాన్ వాసులు త‌మ ఆరోగ్యంపై ఏవిధంగా దృష్టి పెడుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

Healthy Foodజపానీయుల ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి ఇటీవల జపాన్‌లో ఓ సర్వే నిర్వహించారు. అక్కడ యువతరమే ఎక్కువగా ఉన్నారని తేల్చారు. వయసు మళ్లినా వారిలో వృద్ధాప్య ఛాయలు రావడం లేదని సర్వేలో నిర్ధారించారు. ఆ సర్వే ఆహారపు అలవాట్లు, వ్యాయామం తదితర అంశాలపై నిర్వహించడం జరిగింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జపాన్ ప్రజలు కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటున్నారు.

Japanese Dietనిజానికి జ‌పాన్‌లో ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య‌, ఆహార క్ర‌మ‌శిక్ష‌ణ ఎక్కువ‌. వారు అనారోగ్యాల‌ను క‌లిగించే జంక్ ఫుడ్‌ను ఎక్కువ‌గా తిన‌రు. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్నే ఎక్కువ‌గా తింటారు. చిన్న‌త‌నంలోనే పిల్ల‌ల‌కు పోష‌కాహారం తీసుకోవ‌డం, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండ‌డం.. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార‌పు అలవాట్ల‌ను, జీవ‌న‌విధానాన్ని క‌లిగి ఉండ‌డం.. త‌దిత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. అందువ‌ల్ల వారికి చిన్న‌ప్పుడే ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ఏది, అనారోగ్య‌క‌ర‌మైన ఆహారం ఏది.. అనే విష‌యాల‌పై ప‌రిపూర్ణ అవ‌గాహ‌న వ‌స్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను క‌లిగించే జంక్ ఫుడ్ జోలికి వారు దాదాపుగా వెళ్ల‌రు.

Junk Foodజపాన్ ప్రజల డైట్‌లో ఎక్కువగా గింజలు, ధాన్యాలు, కాయగూరలు, సముద్ర చేపలు, పాలు, పండ్లు ఉంటున్నాయి. హెర్బల్ టీ కూడా ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇవన్నీ అధిక బరువును తగ్గించేవే. జపాన్ ప్రజలు అధికంగా కూరగాయలు తింటుంటారు. వీటిలో పోషకాలు ఎక్కువ. శరీరంలోని వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూరగాయలు, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటాయి.

Japanese Dietబ్రకోలి, కాలీ ఫ్లవర్, మొలకలు, చైనీస్ క్యాబేజీ వంటివి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. వాటితో పాటు జపాన్ ప్రజలు సముద్ర ఆహారం ఎక్కువగా తింటున్నారు. చేపల్ని బాగా తింటారు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చర్మం ముడతలు పడకుండా, జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది. ప్రతి రోజు ఉదయం లేచాక గ్లాసుడు నీళ్లు తాగుతారు. దాంతో కడుపులోని మలినాలు తొలగిపోతాయి. వాళ్ల డైట్ విధానం పాటిస్తే యాభైలలోకి అడుగుపెట్టినా యువకులుగానే ఉంటారని సర్వే చేసిన సంస్థ వెల్లడించింది.

లో బీపీని సాధార‌ణ స్థాయికి తీసుకువచ్చే ఇంటి చిట్కాలు

0
లో బీపీ

పొద్దున్నే లేస్తూనే ఏదో అస‌హ‌నంగా, బ‌ద్ద‌కంగా అనిపిస్తోంది. అదే అల‌స‌ట కుర్చీలోంచి లేచిన‌ప్పుడు కూడా అనిపిస్తుంది. శ‌రీరంలోని ర‌క్త‌మంతా మెదడుకు వెళ్లిపోయి, ఇంకెక్క‌డా లేని భావ‌న క‌లుగుతుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు శ‌రీరంలో అనిపిస్తుంటే మీ బీపీ సాధార‌ణ స్థాయి క‌న్నా త‌క్కువున్న‌ట్టే. దీనికి స‌త్వ‌ర చికిత్స అవ‌స‌రం. ఇందుకోసం కొన్ని మంచి మంచి గృహ చిట్కాలు చూద్దాం.

లో బీపీలో బీపీ నే హైపో టెన్ష‌న్ అని అంటారు. శ‌రీరంలోని అన్ని అవ‌యవాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా ఒక్క‌సారిగా ప‌డిపోయి బాడీ షాక్‌కు గురైన‌ట్టుగా అవుతుంది.

లో బీపీకి కార‌ణాలు అనేకం వీటిలో ముఖ్య‌మైన‌విః

  • డీహైడ్రేష‌న్‌- త‌ద్వారా వాంతి, విరేచ‌నాలు
  • బ్లీడింగ్‌- మంద్ర‌స్థాయి నుంచి తీవ్ర స్థాయి దాకా
  • అవ‌యవాల వాపు, నొప్పి
  • గుండె రుగ్మ‌త‌లు- గుండె కొట్టుకునే వేగం త‌గ్గ‌డం, గుండెలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం లాంటివి
  • హై బీపీ కోసం మందులు వేసుకోవ‌డం మూలాన‌
  • బీ 12 విట‌మిన్ లోపం వ‌ల్ల‌
  • అడ్రిన‌లైన్ హార్మోన్ స‌రైన మోతాదులో లేనందు వ‌ల్ల‌
  • సెప్టిసీమియా
  • వేసో వ్యాగ‌ల్ రియాక్ష‌న్ల వ‌ల్ల‌
  • పోస్టుర‌ల్ హైపోటెన్ష‌న్ వ‌ల్ల‌
  • మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల‌
  • మాద‌క‌ద్ర‌వ్యాల‌ను అతిగా సేవించ‌డం వ‌ల్ల‌

సాధార‌ణ బీపీ అంటే 120/80 గా ఉంటే చాలు. 130/80 బీపీ ఉంటే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు అర్థం. లో బీపీలో ఈ సంఖ్య‌ల క‌న్నా ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టే నిర్ధారిస్తారు. అయితే 100/60 క‌న్నా త‌క్కువ ఉంటే లో బీపీగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు.

లో బీపీబీపీని ఎప్పుడు సాధార‌ణ స్థాయిలో ఉండేలా చేసుకోవ‌డం అన్ని విధాలా శ్రేయ‌స్క‌రం. లో బీపీ స‌మ‌స్య త‌ర‌చు ఎదుర్కోంటుంటే దాన్ని సాధార‌ణ స్థాయికి తీసుకురావ‌డం అనివార్యం. కొన్ని స‌హ‌జ‌మైన చిట్కాల‌తో బీపీని సాధార‌ణ స్థాయికి తీసుకురావ‌డం చాలా సుల‌భం.

విట‌మిన్లు:

విట‌మిన్లువిట‌మిన్ బీ12, మ‌రియు ఇ – లో బీపీని సాధార‌ణ స్థాయికి తీసుకురావ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. హై బీపీ ఉన్న‌వారు ఎట్టిప‌రిస్థితుల్లోనూ విట‌మిన్ ఇ తీసుకోకూడ‌దు. విట‌మిన్ బి 12 అనీమియా చికిత్స‌లో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక ఇదే బీపీని పెంచ‌డంలోనూ స‌హ‌క‌రిస్తుంది.
ఈ విట‌మిన్ల‌ను బాదంప‌ప్పు, పాల‌కూర‌, స్వీట్ పొటాటో, గుడ్లు, పాలు, చీజ్‌, చేప‌ల్లో పుష్కలంగా ఉంటాయి. దీనికి అద‌నంగా వైద్యుడి స‌లహాతో విట‌మిన్ ట్యాబ్లెట్ల‌ను కూడా తీసుకోవచ్చు.

కాఫీ:

కాఫీరోజుకు రెండు క‌ప్పుల కాఫీ తాగాలి. కాఫీలో కెఫీన్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది బీపీని తాత్కాలికంగ పెంచ‌డంలో స‌హ‌క‌రిస్తుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీకాస్తంత తేనె క‌లుపుకొని గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీ రోజుకు 2 లేదా 3 సార్లు తాగితే చాలు. కాఫీ త‌ర‌హాలోనే గ్రీన్ టీ లోనూ కెఫీన్ స‌మృద్ధిగా ఉంటుంది. కెఫీన్ లో బీపీని ఎలా త‌గ్గిస్తుందో క‌చ్చితంగా తెలియ‌దు కానీ ఇది ఒక ధ‌మ‌నుల‌ను వెడ‌ల్పు చేసే ఒక హార్మోన్‌ను ఉత్తేజ‌ప‌రుస్తుంద‌న్న విష‌యం మాత్రం అర్థ‌మ‌వుతుంది.

రోజ్‌మేరీ నూనె:

రోజ్‌మేరీ నూనె6 చుక్క‌ల రోజ్‌మేరీ నూనెను ఒక టేబుల్ స్పూన్ కొబ్బ‌రి లేదా ఆలివ్ నూనెలో క‌ల‌పాలి. దీంతో ఒళ్లంతా మ‌సాజ్ చేసుకోవాలి. లేదా స్నానం చేసే నీటిలో రోజ్‌మేరీ నూనెను క‌లుపుకోవాలి. ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే మంచి ఫ‌లిత‌ముంటుంది. శ్వాస వ్య‌వ‌స్థ‌ను ఉత్తేజ‌ప‌రుస్తుంది. దీని వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా స‌జావుగా సాగుతుంది. అందుకే రోజ్ మేరీ నూనె బీపీని త‌గ్గించ‌డంలో స‌హ‌క‌రిస్తుంది.

ఉప్పు నీళ్లు:

Saltఒక గ్లాసు నీటిలో అర టీ స్పూన్ ఉప్పు క‌ల‌పాలి. దీన్ని సెలైన్ సొల్యూష‌న్ అంటారు. దీన్ని తాగాలి.
బీపీ ప‌డిపోయిన‌ట్టు అనిపించిన‌ప్పుడ‌ల్లా ఇది తాగండి. ఉప్పులో ఉండే సోడియం బీపీని పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. అయితే ఎక్కువ మొత్తంలో ఉప్పు నీరు తాగ‌కూడ‌దు. ఎక్కువ ఉప్పు శ‌రీర ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

 

జుట్టు రాలే సమస్యను తగ్గించే ఆహారపదార్ధాలు ఏంటో తెలుసా ?

0
జుట్టు రాలే సమస్యను తగ్గించే ఆహారపదార్ధాలు

పెరుగుతున్న కాలుష్యంతో జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఆడ‌, మ‌గ అన్న తేడా లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. అయితే ఎవరికైనా జుట్టు రాలిపోయేందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. కార‌ణాలు ఏవైనా కొన్ని ఆహార ప‌దార్థాల‌ను రోజూ తీసుకోవడం వలన మన శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. అలాగే వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు తగ్గిపోతాయి. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.

Hair Fall1. పాల‌కూర‌లో ఫోలేట్‌, ఐర‌న్‌, విట‌మిన్ ఎ, సిలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుద‌ల‌కు స‌హాయం చేస్తాయి. క‌నుక పాల‌కూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు రాల‌డం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

పాల‌కూర‌2. కోడిగుడ్ల‌లో ప్రోటీన్లు పుష్క‌లంగా ఉంటాయి. అలాగే మ‌రొక పోష‌క ప‌దార్థ‌మైన బ‌యోటిన్ కూడా గుడ్ల‌లో స‌మృద్ధిగా ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతాయి. అందువ‌ల్ల నిత్యం కోడిగుడ్ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు రాల‌డం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

కోడిగుడ్ల‌3. చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి వెంట్రుక‌ల స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌టప‌డేస్తాయి. జుట్టు పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతాయి. అందువ‌ల్ల వారంలో క‌నీసం 3 సార్ల‌యినా చేప‌ల‌ను తింటే వెంట్రుక‌ల స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Fish4. అవిసె గింజ‌లు, పొద్దు తిరుగుడ విత్త‌నాల‌ను నిత్యం తింటున్న జుట్టు రాల‌డం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ ఇ, జింక్‌, సెలీనియం వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు తోడ్ప‌డుతాయి. జుట్టు రాల‌డాన్ని త‌గ్గిస్తాయి.

అవిసె గింజ‌లు5. బాదం ప‌ప్పులో ఉండే బి విట‌మిన్లు, విట‌మిన్ ఎ, జింక్ వెంట్రుక‌ల పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతాయి. వీటిని నిత్యం తింటే జుట్టు రాల‌డం స‌మ‌స్య నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

బాదం ప‌ప్పు

 

అతిగా నీరు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా ?

0

మనిషి శరీరంలో సగం కన్నా ఎక్కువ నీరే ఉంటుంది. నీళ్లు, నీటి శాతం ఎక్కువగా ఉన్న డ్రింగ్స్ తాగటం వల్ల ఎన్నో వ్యాధులు దరి చేరకుండా కాపాడుతాయి. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం సరిపడినంత నీటిని తీసుకోవాలి. ఎలాంటి అనారోగ్య సమస్యకైనా దివ్యౌషధం నీళ్లు. శరీరంలో జరిగే మెటబాలిక్ చర్యలకు నీళ్లు చాలా ముఖ్యం. అయితే కొంతమంది నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. మరికొంత మంది నీటిని ఎక్కువగా తీసుకుంటారు.

Drink Waterచాలా మంది సెలబ్రిటీలు కూడా తమ అందం, ఆరోగ్యానికి మంచి నీళ్లే కారణమని చెబుతుంటారు. అయితే ఎంత నీరు తాగాలో అంతే తాగాలి. ఎక్కువ నీరు తాగినా ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు నిపుణులు. మరి నీరు అతిగా తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Drink Waterఇక మంచి నీరు అతిగా తాగకూడదని చెబుతున్నారు నిపుణులు. ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నీరు ఎక్కువగా తాగితే మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. శరీరంలో తేమ శాతం పెరుగుతుంది. అంతేకాదు రక్తం పెరగడం కారణంగా రక్తనాళాలు, గుండెపై అదనపు భారం పడుతుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులు వస్తాయి.

Drink Waterనీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. ఇక శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా మూత్రం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో శరీరంలో సోడియం స్థాయి తగ్గి మరణానికి దారి తీస్తుంది. అతిగా నీరు తాగడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. తలనొప్పి, వికారం, కండరాల నొప్పులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి తగినంత నీటిని తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.

 

ఇవి వాసన చూస్తే చాలు అనారోగ్యాలు దూరమవుతాయి

0
అరోమా థెరపీ

మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే అందుబాటులో ఉండే ఇంగ్లిష్ మెడిసిన్‌ తెచ్చి వేసుకుంటాం. ఒకవేళ అది కుదరకపోతే ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను వాడి సమస్యల నుండి బయట పడతాం. అయితే ఇవే కాకుండా అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు మనకు తెలియని మరొ పద్ధతి కూడా మనకు అందుబాటులో ఉంది.

అరోమా థెరపీఅదే అరోమా థెరపీ.. అంటే పలు పదార్థాలకు చెందిన వాసనలను చూసి మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడమన్నమాట. మరి ఏయే సమస్యలు తగ్గాలంటే.. ఏయే పదార్థాలను వాసన చూడాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. నిమ్మజాతికి చెందిన పండ్లను వాసన చూస్తే మనస్సు రిలాక్స్ అవుతుంది. తాజాదనపు అనుభూతి కలుగుతుంది. ఫ్రెష్‌గా ఉన్నట్లు ఫీలవుతారు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

Lemon2. పైనాపిల్ పండ్లను వాసన చూస్తే ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది.

పైనాపిల్3. లవంగాలను వాసన చూస్తే నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. చక్కని నిద్ర వస్తుంది. రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు లవంగాలను వాసన చూస్తే బాగా నిద్రపోవచ్చు. దీంతో మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మూడ్ మారుతుంది.

లవంగాల4. దాల్చినచెక్కను వాసన చూడడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటుంది.

దాల్చినచెక్క5. పుదీనా ఆకులను వాసన చూస్తే శక్తి లభిస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. అలాగే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.

పుదీనా ఆకుల6. మల్లెపువ్వులను వాసన చూస్తే డిప్రెషన్ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్రలేమి తగ్గుతుంది.

Mallle Puvulu

 

మాస శివరాత్రి ఎలా జరుపుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏంటి ?

0

హిందూ ధర్మంలో శివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. ప్రతీ ఏడాది ఫిబ్రవరి లో శివరాత్రి ఘనంగా జరుపుకుంటాము. కానీ మాస శివరాత్రి అంటే ఏంటి? అనే విషయం చాలా మందికి తెలియదు. ప్రతీ నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా అని అంటారు. మరి మాసశివరాత్రిని ఎప్పుడు, ఎలా జరుపుకోవాలి? అసలు మాస శివరాత్రి అంటే ఏంటి?

మాస శివరాత్రిశివరాత్రి అనగా శివుని లింగోద్భవం అని అర్ధం. ఆ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. మహాశివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి అంటే మృత్యువునకు కారకుడు కేతువు, అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.

మాస శివరాత్రిచంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావం ఉండడంతో మన ఆహారపు అలవాట్లపై ప్రభావం పడి జీర్ణశక్తి తగ్గుతుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. ఈ సమయంలో మానసికంగా సంయమనం కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరుగుతుంది. తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణాలకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. తద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించవచ్చు. ఆ తీవ్రత మనపై తక్కువగా ఉండాలంటే మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసం ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉంది.

మాస శివరాత్రిఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 5 గాని 11గాని 18గాని 21గాని 56 లేదా 108 ప్రదక్షణలు చేయవచ్చు. శివాలయంలో పూజలో ఉంచిన చెరకు రసాన్ని భక్తులకు పంచితే ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.

మాస శివరాత్రిఅలాగే ఆరోజు ప్రదోష వేల శివునికు మారేడు దళాలతో లేదా కనీసం గంగా జలంతో అభిషేకాది అర్చనలు చేయడం మంచిది. మూడు పూటలా చల్లటి నీటితో వీలయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి. ఈ రోజును సశాస్త్రీయంగా జరుపుకోవడం వలన దోష తీవ్రత తగ్గుతుంది. సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

 

Recent Wirally Articles

Most Popular